IND vs AUS: ‘కోహ్లీ డబుల్ సెంచరీ చేస్తే భారత్ విజయం సాధించే అవకాశం’
ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్టు మొదటి ఇన్నింగ్స్లో విరాట్ కోహ్లీ (Virat Kohli) అర్ధ శతకం బాదాడు. ఈ హాఫ్ సెంచరీని అతడు డబుల్ సెంచరీగా మలుస్తాడని గావస్కర్ అభిప్రాయపడ్డాడు.
అహ్మదాబాద్: టీమ్ఇండియా బ్యాటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli) గత కొంతకాలంగా టెస్టుల్లో ఫామ్లేమితో ఇబ్బంది పడుతున్నాడు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడు టెస్టుల్లో విఫలమైన అతడు నాలుగో టెస్టులో మాత్రం రాణిస్తున్నాడు. మొదటి ఇన్నింగ్స్లో అర్ధశతకం బాదాడు. మూడో రోజు ఆట ముగిసే సమయానికి 59 పరుగులతో నాటౌట్గా ఉన్నాడు. దాదాపు 14 నెలల తర్వాత సుదీర్ఘ ఫార్మాట్లో కోహ్లీ హాఫ్ సెంచరీ చేశాడు. ఈ నేపథ్యంలో కోహ్లీ ఆటతీరు గురించి భారత మాజీ ఆటగాడు సునీల్ గావస్కర్ (Sunil Gavaskar) మాట్లాడాడు. కోహ్లీ ఈ అర్ధశతకాన్ని డబుల్ సెంచరీగా మరల్చుతాడని గావస్కర్ అభిప్రాయపడ్డాడు. ఒకవేళ కోహ్లీ ద్వి శతకం సాధిస్తే భారత్ ఆధిక్యంలోకి వెళ్లి మ్యాచ్లో విజయం సాధించే అవకాశం ఉందని చెప్పాడు.
‘పిచ్ ఎలా స్పందిస్తుందనే విషయాన్ని అర్థం చేసుకుని విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీ చేయడం గొప్ప విషయం. ఈ అర్ధ సెంచరీ డబుల్ సెంచరీగా మారే అవకాశం ఉందని నేను భావిస్తున్నాను. అదే జరిగితే ఆస్ట్రేలియాపై భారత్ ఆధిక్యం సాధించడంతోపాటు మ్యాచ్లో భారత్ గెలిచే అవకాశం ఉంది’ అని గావస్కర్ వివరించాడు. కోహ్లీ పరుగుల దాహంతో ఉన్నాడని, ఫామ్ లేమి నుంచి బయటపడటానికి ఇది మంచి అవకాశమని ఆయన చెప్పాడు. ‘ఎవరైనా ఆకలితో ఉండి సరిపడా తిననప్పుడు.. తినడానికి ఏదైనా దొరికితే ఎందుకు వదిలేయాలి? కోహ్లీ విషయంలోనూ ఇదే వర్తిస్తుంది. అతడు గత కొన్నేళ్లుగా సెంచరీ చేయలేదు. కాబట్టి దాన్ని భర్తీ చేయడానికి 250 పరుగులు చేయడం ఉత్తమ మార్గం’ అని గావస్కర్ పేర్కొన్నాడు.
ఆసీస్తో నాలుగో టెస్టు విషయానికొస్తే.. మూడో రోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్లో భారత్ మూడు వికెట్ల నష్టానికి 289 పరుగులు చేసింది. కోహ్లీ (59), రవీంద్ర జడేజా (16) పరుగులతో నాటౌట్గా ఉన్నారు. మొదటి ఇన్నింగ్స్లో ఆసీస్ 480 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్మన్ గిల్
Shubman Gill: ఈ ఐపీఎల్ సీజన్లో భారీ స్కోర్లు నమోదవుతున్న విషయం తెలిసిందే. దీనికి ఓ కారణం ఉందని శుభ్మన్ గిల్ తెలిపాడు. -
తాగి చెస్ ఆడా.. ప్యాంట్లో మూత్రం పోసుకున్నా..
చెస్ మేటి మాగ్నస్ కార్ల్సన్ ఇటీవల ఓ కొత్త సవాలును స్వీకరించాడు. సత్యశోధన పరీక్ష (లై డిటెక్టర్ టెస్ట్)లో తన చెస్ కెరీర్, వ్యక్తిగత జీవితంపై అనేక ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. -
మోహిత్.. చెత్త రికార్డు
గుజరాత్ టైటాన్స్ పేసర్ మోహిత్ శర్మ చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఓ ఐపీఎల్ మ్యాచ్లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్గా అతను రికార్డులకెక్కాడు. -
దిల్లీ గట్టెక్కింది
ఐపీఎల్-17లో తడబడుతూ సాగుతున్న దిల్లీ క్యాపిటల్స్.. ప్లేఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లుతున్న సమయంలో ఓ కీలక విజయం సాధించింది. బుధవారం ఆ జట్టు గుజరాత్ టైటాన్స్ను 4 పరుగుల స్వల్ప తేడాతో ఓడించింది. -
పొట్టి కప్పులో ఎవరు?
వెస్టిండీస్, అమెరికా ఉమ్మడిగా ఆతిథ్యమిస్తున్న టీ20 ప్రపంచకప్ కోసం 15 మంది జట్టుతో పాటు అయిదుగురు రిజర్వ్ ఆటగాళ్లనూ ప్రకటించేందుకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ కసరత్తులు చేస్తోంది. -
300 కొట్టేస్తారా?
ఈ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ నమోదు చేసిన రికార్డులివీ. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్లతో రికార్డులు తిరగరాస్తున్న సన్రైజర్స్ పొట్టి లీగ్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. -
ఫైనల్లో జ్యోతి జట్టు
ఆర్చరీ ప్రపంచకప్లో భారత ఆర్చర్ల దూకుడు కొనసాగుతోంది. విజయవాడ అమ్మాయి జ్యోతి సురేఖ జట్టు కాంపౌడ్ మహిళల విభాగంలో ఫైనల్లో అడుగుపెట్టింది. -
దీపాన్షుకు జావెలిన్ స్వర్ణం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ తొలి రోజు, బుధవారం భారత అథ్లెట్లు సత్తా చాటారు. పురుషుల జావెలిన్ త్రోలో దీపాన్షు శర్మ స్వర్ణం గెలుచుకున్నాడు. -
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
T20 Worldcup 2024 - BCCI: వచ్చే టీ20 ప్రపంచకప్ కోసం ఏ 15 మందిని ఎంపిక చేస్తే బాగుంటుంది. -
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
ఐపీఎల్లో ఫినిషర్గా అదరగొడుతున్న ఎంఎస్ ధోనీ (MS Dhoni)ని టీ20 వరల్డ్కప్నకు ఎంపిక చేయాలనే ఆలోచనను పలువురు మాజీలు కోరుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
పతి దేవుడికి గుడి కట్టింది!
-
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్మన్ గిల్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
శరీర బరువు తగ్గించే శస్త్రచికిత్సకు వెళ్లి..
-
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?
-
పులివెందులలోనూ పరదాల వీరుడే.. నేడు సీఎం జగన్ నామినేషన్