WTC Final: న్యూజిలాండ్కు కృతజ్ఞతలు చెప్పాల్సిన అవసరం లేదు: సునీల్ గావస్కర్
న్యూజిలాండ్ జట్టు శ్రీలంకను ఓడించి భారత్ డబ్ల్యూటీసీ ఫైనల్కు చేరడానికి పరోక్షంగా లాభం చేకూర్చిందనే చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో భారత మాజీ ఆటగాడు సునీల్ గావస్కర్ (Sunil Gavaskar) కీలక వ్యాఖ్యలు చేశారు.
ఇంటర్నెట్ డెస్క్: బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో భాగంగా అహ్మదాబాద్ వేదికగా జరిగిన నాలుగో టెస్టు డ్రాగా ముగిసింది. ఈ మ్యాచ్ డ్రాగా ముగిసినప్పటికీ.. టీమ్ఇండియా (Team India) డబ్ల్యూటీసీ ఫైనల్ బెర్త్ను ఖరారు చేసుకుంది. ఈ మ్యాచ్ ఫలితం తేలకముందే.. న్యూజిలాండ్ చేతిలో లంక ఓటమితో రోహిత్ సేన ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ (WTC Final)కు చేరింది. శ్రీలంకను ఓడించి భారత్కు న్యూజిలాండ్ పరోక్షంగా లాభం చేకూర్చిందనే చర్చ జరుగుతోంది. కొంతమంది భారత అభిమానులు సామాజిక మాధ్యమాల్లో కివీస్కు కృతజ్ఞతలు తెలుపుతూ పోస్టులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో టీమ్ఇండియా బ్యాటింగ్ దిగ్గజం సునీల్ గావస్కర్ (Sunil Gavaskar) కీలక వ్యాఖ్యలు చేశారు. న్యూజిలాండ్కు భారత్ రుణపడి లేదని, కివీస్కు ఎలాంటి కృతజ్ఞతలు చెప్పాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డారు. టీమ్ఇండియా ఎవరి సహాయంతోనో కాకుండా.. రెండేళ్లుగా అద్భుతమైన ఆటతీరు కనబర్చి ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్కు దూసుకెళ్లిందని ఆయన పేర్కొన్నారు.
‘న్యూజిలాండ్కు భారత్ ఏమీ రుణపడి ఉంటుందని నేను అనుకోను. మీరు ఏం చెప్పినా.. పాయింట్ల పట్టికలో నంబర్ 2గా ఉండటానికి, డబ్ల్యూటీసీ ఫైనల్కు అర్హత సాధించడానికి భారత్ గత కొంతకాలంగా అత్యుత్తమ క్రికెట్ ఆడింది. శ్రీలంకపై కివీస్ గెలిచింది బాగానే ఉంది. ఇది న్యూజిలాండ్ క్రికెట్కు మంచిది. కానీ, భారత క్రికెట్ న్యూజిలాండ్కు కృతజ్ఞతలు చెప్పాల్సిన అవసరం లేదనుకుంటున్నాను. ఎందుకంటే 2021 ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ నుంచి గత రెండేళ్లలో టీమ్ఇండియా చాలా అత్యుత్తమ క్రికెట్ ఆడింది. అందువల్లే వారు ఎవరి సహాయంతో కాకుండా వారి సొంతంగానే డబ్ల్యూటీసీ ఫైనల్కు అర్హత సాధించారు’ అని సునీల్ గావస్కర్ ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. జూన్ 7-11 మధ్య లండన్లోని ది ఓవెల్ మైదానంలో (WTC Final)ను నిర్వహించనున్నారు. జూన్ 12 తేదీని రిజర్వ్ డేగా ప్రకటించారు. ఈ మెగా పోరులో భారత్, ఆస్ట్రేలియా తలపడనున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
లఖ్నవూ.. అక్కడా ఇక్కడా!
ఐపీఎల్లో ఎంతో నిలకడగా ఆడే జట్లలో చెన్నై సూపర్కింగ్స్ ఒకటి. లఖ్నవూతో మ్యాచ్ అంటే చెన్నైనే ఎక్కువమంది ఫేవరెట్గా పరిగణిస్తారు. కానీ ఆ జట్టు చేతిలో సూపర్కింగ్స్కు వరుసగా రెండు ఓటములు తప్పలేదు. -
మెరిసిన జ్యోతి సురేఖ
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ మెరిసింది. మంగళవారం మహిళల కాంపౌండ్ అర్హత రౌండ్లో సురేఖ (711) రెండో స్థానం సాధించింది. ఆండ్రియా బెకెరా (713- మెక్సికో) అగ్రస్థానంలో నిలిచింది. -
శ్రీజ నం.1
అంతర్జాతీయ స్థాయిలో వరుస విజయాలతో సత్తా చాటుతున్న తెలుగమ్మాయి ఆకుల శ్రీజ మరో ఘనత అందుకుంది. టీటీ మహిళల సింగిల్స్లో కెరీర్లో అత్యుత్తమంగా 38వ ర్యాంకు సాధించిన శ్రీజ.. -
ఆసియా జూనియర్ అథ్లెటిక్స్కు ‘లక్ష్య’ హిమతేజ
ఈనాడు సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ క్రీడాకారుడు వల్లిపి హిమతేజ అంతర్జాతీయ వేదికపై సత్తాచాటేందుకు సిద్ధమయ్యాడు. బుధవారం ప్రారంభంకానున్న ఆసియా జూనియర్ (అండర్-20) అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో తన అదృష్టం పరీక్షించుకోనున్నాడు. -
టొరంటోలో భారత భూకంపం
అంచనాలను తలకిందులు చేస్తూ క్యాండిడేట్స్ చెస్ టోర్నీలో విజేతగా నిలిచిన భారత టీనేజ్ సంచలనం, గ్రాండ్మాస్టర్ గుకేశ్పై రష్యా దిగ్గజ క్రీడాకారుడు గ్యారీ కాస్పరోవ్ ప్రశంసల జల్లు కురిపించాడు. -
విండీస్కు ఆడను
టీ20 ప్రపంచకప్ కోసం రిటైర్మెంట్ వీడి తిరిగి అంతర్జాతీయ క్రికెట్లోకి రాబోనని వెస్టిండీస్ మాజీ బౌలింగ్ ఆల్రౌండర్ సునీల్ నరైన్ స్పష్టం చేశాడు. ఐపీఎల్లో కోల్కతా తరఫున అతడు విశేషంగా రాణిస్తున్న సంగతి తెలిసిందే. -
జకోవిచ్కు లారియస్ అవార్డు
టెన్నిస్ స్టార్ నొవాక్ జకోవిచ్.. లారియస్ స్పోర్ట్స్పర్సన్ ఆఫ్ ద ఇయర్ అవార్డును అందుకున్నాడు. మాడ్రిడ్లో జరిగిన లారియస్ అవార్డుల కార్యక్రమంలో అమెరికా జిమ్నాస్ట్ సిమోన్ బైల్స్.. కమ్బ్యాక్ ఆఫ్ ద ఇయర్ పురస్కారాన్ని గెలుచుకుంది. -
జుట్టు కత్తిరించడమే మార్గమనుకుని..
పారిస్ ఒలింపిక్స్ క్వాలిఫయర్స్ ఆరంభానికి ముందు రోజు బరువును తగ్గించుకోవడం కోసం చాలా ఇబ్బందిపడ్డానని వినేశ్ తెలిపింది. 50 కేజీల విభాగంలో పోటీపడాల్సి ఉండగా నిర్ణీత బరువు కంటే కాస్త ఎక్కువ ఉండడంతో కలవరం రేగిందని ఆమె తెలిపింది. -
అక్కడ బుర్ర పగిలిపోతుంది
చెన్నై సూపర్ కింగ్స్, ముంబయి ఇండియన్స్ జట్లలో పూర్తిగా భిన్నమైన సంస్కృతి ఉంటుందని భారత మాజీ ఆటగాడు అంబటి రాయుడు అన్నాడు. ముంబయికి గెలుపే లక్ష్యంగా ఉంటుందని.. చెన్నై మాత్రం ప్రక్రియపై నమ్మకం ఉంచుతుందని రాయుడు తెలిపాడు.
తాజా వార్తలు (Latest News)
-
రంగనాథస్వామి దేవస్థాన ప్రధాన అర్చకుడు హఠాన్మరణం
-
యూసఫ్గూడలో రోడ్డు ప్రమాదం.. యువతిపై బస్సు ఎక్కడంతో మృతి
-
ఈ నగరంలో అడుగుపెట్టాలంటే.. టికెట్ కొనాల్సిందే!
-
నేడే తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. రిజల్ట్స్ ఈనాడు.నెట్లో..
-
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
-
బెంగాలీ అమ్మాయి.. నాన్న కొట్టిన చెంప దెబ్బ.. ఇవే ఆలోచనలు: పూరి జగన్నాథ్