Virat Kohli: కోహ్లీతో పాటు బెంగళూరుకు కావాల్సింది ఇదే: గావస్కర్
బెంగళూరు మాజీ సారథి విరాట్ కోహ్లీ గుజరాత్తో ఆడిన మ్యాచ్లో అర్థశతకం సాధించడం ద్వారా తనకు కావాల్సిన ఆత్మవిశ్వాసం పెంపొందించుకున్నాడని దిగ్గజ బ్యాట్స్మన్ సునీల్ గావస్కర్ అన్నాడు...
ఇంటర్నెట్డెస్క్: బెంగళూరు మాజీ సారథి విరాట్ కోహ్లీ గుజరాత్తో ఆడిన మ్యాచ్లో అర్థశతకం సాధించడం ద్వారా తనకు కావాల్సిన ఆత్మవిశ్వాసం పెంపొందించుకున్నాడని దిగ్గజ బ్యాట్స్మన్ సునీల్ గావస్కర్ అన్నాడు. కోహ్లీ నుంచి బెంగళూరు జట్టు కూడా ఇదే ఆశిస్తుందని చెప్పాడు. ఇప్పటికే 5 విజయాలు, 5 ఓటములతో కొనసాగుతున్న ఆ జట్టుకు అతడు తిరిగి ఫామ్లోకి రావడం ఊరటనిచ్చే విషయమని పేర్కొన్నాడు. ఈ మ్యాచ్కు ముందు 0, 0, 9 పరుగులతో విఫలమైన కోహ్లీ (58; 53 బంతుల్లో 6x4, 1x6) గుజరాత్తో మెరిశాడు. ఈ నేపథ్యంలో గావస్కర్ స్పందించాడు.
‘కోహ్లీతో పాటు బెంగళూరు జట్టుకు కావాల్సింది ఇదే. ఒక్కసారి అతడు గాడిలో పడి అర్ధశతకం సాధిస్తే మిగతా మ్యాచ్ల్లోనూ ఇలాగే రాణించడానికి దోహదపడుతుంది. ఇలాంటి కీలక బ్యాట్స్మన్ పరుగులు చేయడం చాలా మంచి విషయం. ఈ మ్యాచ్లో కోహ్లీ క్రీజులో ఉండగా తన కాలి కదలికలు కూడా బాగున్నాయి. ఇది అతడికి ఆత్మవిశ్వాసం పెంపొందించే ఇన్నింగ్స్. దీంతో బెంగళూరు జట్టు కూడా చాలా సంతోషించి ఉంటుంది’ అని గావస్కర్ పేర్కొన్నాడు. అనంతరం యువ బ్యాట్స్మన్ రజత్ పాటిదార్ గురించి మాట్లాడిన సన్నీ.. మూడో స్థానంలో ఈ యువకుడు సరిగ్గా సరిపోయాడని చెప్పాడు. డుప్లెసిస్ ఔటయ్యాక టాప్క్లాస్ బ్యాటింగ్ చేశాడని మెచ్చుకున్నాడు. అతడు జట్టు నమ్మకాన్ని కాపాడినట్టు చెప్పాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
MS Dhoni: ధోని.. ఇంకా నాటౌటే
చివరి సీజన్గా భావిస్తున్న ఈ ఐపీఎల్లో బ్యాటింగ్ చేస్తోంది తక్కువసేపే అయినా అభిమానులను ఉర్రూతలూగిస్తున్నాడు ధోని. -
కేఎల్ రాహుల్ కెప్టెన్ ఇన్నింగ్స్.. చెన్నైకి చెక్
ఏక్నా స్టేడియంలోని నెమ్మదైన పిచ్పై స్కోరు 160 దాటిందంటే ఛేదన కష్టమే. ఓ దశలో చెన్నై 150 అయినా చేస్తుందా అనుకుంటే.. గత మ్యాచ్లో ముంబయిపై చెలరేగినట్లే మహేంద్రసింగ్ ధోని ఈ మ్యాచ్లోనూ ఆఖర్లో మెరుపు ఇన్నింగ్స్ ఆడడంతో చెన్నై స్కోరు 176కు చేరుకుంది. -
కుర్రాళ్లు కుమ్మేస్తున్నారు
ఛేదనలో నాలుగైదు వికెట్లు పడ్డాయా? అయినా భయం లేదు తామున్నామంటూ సత్తాచాటుతున్నారు. -
బుమ్రా బౌలింగ్లో స్వీప్ షాట్.. నా కల!
అశుతోష్ శర్మ.. ఈ ఐపీఎల్లో గట్టిగా వినిపిస్తున్న కొత్త పేరు. -
రేసులో గుకేశ్ ఒక్కడే..
క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్లో భారత యువ కెరటం గుకేశ్ మళ్లీ ఆధిక్యంలోకి వచ్చాడు. -
మెరిసిన ఇషా, భవేష్
ఒలింపిక్స్ సెలెక్షన్ ట్రయల్స్లో అగ్రశ్రేణి షూటర్లు ఇషా సింగ్, భవేష్ షెకావత్ మెరిశారు. -
దీపకు నాలుగో స్థానం
దోహాలో జరిగిన జిమ్నాస్టిక్స్ ప్రపంచకప్ను భారత స్టార్ దీప కర్మాకర్ నాలుగో స్థానంతో ముగించింది. -
భారత రెజ్లర్లు విఫలం
ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో భారత పురుష రెజ్లర్లు విఫలమయ్యారు. -
విమానం ఆలస్యమై...
భారత ఉత్తమ రెజ్లర్లలో ఇద్దరైన దీపక్ పునియా (86 కేజీలు), సుజీత్ కలాకల్ (65 కేజీలు)కు నిరాశ తప్పలేదు. -
రాకెట్ వదిలేద్దాం అనుకున్నా
గత కొన్నేళ్లలో కెరీర్లో ఎంతో క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొన్నానని.. ఒకటికి రెండుసార్లు బ్యాడ్మింటన్కు వీడ్కోలు చెప్పాలని భావించానని భారత డబుల్స్ స్టార్ అశ్విని పొన్నప్ప తెలిపింది. -
చెరువుల సంరక్షణ కోసం ఆర్సీబీ
ఐపీఎల్ జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టింది.
తాజా వార్తలు (Latest News)
-
వైకాపా నేతల సిఫార్సులతో పోస్టు.. మహిళా ఉద్యోగినులతో వెకిలి చేష్టలు
-
విశాఖ-బెంగళూరు మధ్య ప్రత్యేక రైలు
-
ఒలింపిక్స్లో పతకం తెస్తే బీఎండబ్ల్యూ కారు
-
పెళ్లి ఘట్టం.. క్యూఆర్ కోడ్లో నిక్ష్లిప్తం
-
పిల్లలతో అశ్లీల వీడియోలు తీయడం ఆందోళనకరం, నేరం : సుప్రీంకోర్టు
-
వివేకా హత్యలో నాపై రెండు క్రిమినల్ కేసులు.. అఫిడవిట్లో పేర్కొన్న అవినాష్రెడ్డి