WTC Finals: బాక్స్లోనూ డీకే అదరగొడతాడు
టీమ్ఇండియా వెటరన్ క్రికెటర్ దినేశ్ కార్తీక్ మరికొద్ది రోజుల్లో కొత్త అవతారం ఎత్తనున్నాడు. ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లో దిగ్గజ క్రికెటర్, వ్యాఖ్యాత సునీల్ గావస్కర్ సరసన మరో వ్యాఖ్యాతగా అలరించనున్నాడు.
ఇంటర్నెట్డెస్క్: టీమ్ఇండియా వెటరన్ క్రికెటర్ దినేశ్ కార్తీక్ మరికొద్ది రోజుల్లో కొత్త అవతారం ఎత్తనున్నాడు. ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లో దిగ్గజ క్రికెటర్, వ్యాఖ్యాత సునీల్ గావస్కర్ సరసన మరో వ్యాఖ్యాతగా అలరించనున్నాడు. ఇప్పటికే డీకేతో కలిసి సెర్బియాలో క్వారంటైన్లో ఉన్న గావస్కర్ తాజాగా అతడితో కలిసి దిగిన ఓ ఫొటోను సామాజిక మాధ్యమాల్లో పంచుకొని, సంతోషం వ్యక్తం చేశాడు. ఈ సందర్భంగా వ్యాఖ్యాతగా కొత్త ఇన్నింగ్స్ ప్రారంభిస్తున్న డీకేకు శుభాకాంక్షలు చెప్పాడు.
‘నేను టీమ్ఇండియాకు కన్సల్టెంట్గా ఉన్న రోజుల్లో దినేశ్ కార్తీక్ టెస్టు క్రికెట్లో అరంగేట్రం చేశాడు. ఇప్పుడు ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లో క్రికెట్ వ్యాఖ్యాతగా కొత్త ఇన్నింగ్స్ ప్రారంభిస్తున్నాడు. కామెంట్రీ బాక్స్లోనూ అతడు అదరగొడతాడని నేను కచ్చితంగా నమ్ముతున్నా. గుడ్లక్ డీకే’ అని పేర్కొంటూ గావస్కర్ ఇన్స్టాలో పోస్టు చేశాడు. దీనికి స్పందించిన డీకే.. మీ పక్కన కూర్చొని పనిచేయడం నా అదృష్టం. మీ ఆశీస్సులకు ధన్యవాదాలు’ అని బదులిచ్చాడు.
ప్రస్తుతం దినేశ్ కార్తీక్ అంతర్జాతీయ క్రికెట్లో ఆడకపోయినా ఐపీఎల్లో కోల్కతా నైట్ రైడర్స్ తరఫున కొనసాగుతున్న సంగతి తెలిసిందే. 2019 వన్డే ప్రపంచకప్లో టీమ్ఇండియా తరఫున చివరిసారి ఆడాడు. కీలకమైన సెమీఫైనల్స్లో అందరిలాగే విఫలమై తర్వాత జట్టుకు దూరమయ్యాడు. మరోవైపు గతేడాది ఐపీఎల్లో కేకేఆర్ కెప్టెన్ బాధ్యతల నుంచి తప్పుకొని ఇయాన్ మోర్గాన్ నేతృత్వంలో మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మన్గా కొనసాగుతున్నాడు. ఇక ఇప్పుడు టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లో వ్యాఖ్యాతగా ఏమేరకు ఆకట్టుకుంటాడో చూడాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ధోని.. ఇంకా నాటౌటే
చివరి సీజన్గా భావిస్తున్న ఈ ఐపీఎల్లో బ్యాటింగ్ చేస్తోంది తక్కువసేపే అయినా అభిమానులను ఉర్రూతలూగిస్తున్నాడు ధోని. -
కేఎల్ రాహుల్ కెప్టెన్ ఇన్నింగ్స్.. చెన్నైకి చెక్
ఏక్నా స్టేడియంలోని నెమ్మదైన పిచ్పై స్కోరు 160 దాటిందంటే ఛేదన కష్టమే. ఓ దశలో చెన్నై 150 అయినా చేస్తుందా అనుకుంటే.. గత మ్యాచ్లో ముంబయిపై చెలరేగినట్లే మహేంద్రసింగ్ ధోని ఈ మ్యాచ్లోనూ ఆఖర్లో మెరుపు ఇన్నింగ్స్ ఆడడంతో చెన్నై స్కోరు 176కు చేరుకుంది. -
కుర్రాళ్లు కుమ్మేస్తున్నారు
ఛేదనలో నాలుగైదు వికెట్లు పడ్డాయా? అయినా భయం లేదు తామున్నామంటూ సత్తాచాటుతున్నారు. -
బుమ్రా బౌలింగ్లో స్వీప్ షాట్.. నా కల!
అశుతోష్ శర్మ.. ఈ ఐపీఎల్లో గట్టిగా వినిపిస్తున్న కొత్త పేరు. -
రేసులో గుకేశ్ ఒక్కడే..
క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్లో భారత యువ కెరటం గుకేశ్ మళ్లీ ఆధిక్యంలోకి వచ్చాడు. -
మెరిసిన ఇషా, భవేష్
ఒలింపిక్స్ సెలెక్షన్ ట్రయల్స్లో అగ్రశ్రేణి షూటర్లు ఇషా సింగ్, భవేష్ షెకావత్ మెరిశారు. -
దీపకు నాలుగో స్థానం
దోహాలో జరిగిన జిమ్నాస్టిక్స్ ప్రపంచకప్ను భారత స్టార్ దీప కర్మాకర్ నాలుగో స్థానంతో ముగించింది. -
భారత రెజ్లర్లు విఫలం
ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో భారత పురుష రెజ్లర్లు విఫలమయ్యారు. -
విమానం ఆలస్యమై...
భారత ఉత్తమ రెజ్లర్లలో ఇద్దరైన దీపక్ పునియా (86 కేజీలు), సుజీత్ కలాకల్ (65 కేజీలు)కు నిరాశ తప్పలేదు. -
రాకెట్ వదిలేద్దాం అనుకున్నా
గత కొన్నేళ్లలో కెరీర్లో ఎంతో క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొన్నానని.. ఒకటికి రెండుసార్లు బ్యాడ్మింటన్కు వీడ్కోలు చెప్పాలని భావించానని భారత డబుల్స్ స్టార్ అశ్విని పొన్నప్ప తెలిపింది. -
చెరువుల సంరక్షణ కోసం ఆర్సీబీ
ఐపీఎల్ జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టింది.
తాజా వార్తలు (Latest News)
-
మా పేర్లు చెప్పాలని వారిని చిత్రహింసలు పెడుతున్నారు: బొండా ఉమా
-
యాక్టర్ జగన్.. ఎన్నికల లబ్ధికి ఉత్తుత్తి శిబిరాలు
-
కేరళలో ఒక్క ఓటరు కోసం.. అడవిలో 18 కి.మీ. ప్రయాణం
-
మిమ్మల్ని గద్దెనెక్కిస్తే.. నడిరోడ్డుపై పడేశారు
-
వేదమంత్రాల సాక్షిగా శ్రీకృష్ణుడితో యువతి పెళ్లి
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM