IPL 2021: రాజస్థాన్పై హైదరాబాద్ విజయం
రాజస్థాన్ రాయల్స్పై సన్రైజర్స్ హైదరాబాద్ విజయం సాధించింది.
దుబాయ్: ఈ సీజన్లో ఎట్టకేలకు హైదరాబాద్ రెండో విజయం సాధించింది. రాజస్థాన్తో జరిగిన మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు 7 వికెట్ల తేడాతో నెగ్గింది. రాజస్థాన్ నిర్దేశించిన 165 పరుగుల లక్ష్యాన్ని విలియమ్సన్ సేన 18.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. హైదరాబాద్ జట్టులో జేసన్ రాయ్(60: 42 బంతుల్లో 8X4, 1x6), కెప్టెన్ విలియమ్సన్ (51 నాటౌట్: 41 బంతుల్లో 5X4, 1X6) అర్ధసెంచరీలతో చెలరేగారు. దీంతో హైదరాబాద్కు వరుస ఓటముల నుంచి స్వాంతన లభించినట్టైంది. అంతకుముందు రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. కెప్టెన్ సంజూ శాంసన్ (82: 57 బంతుల్లో 7x4, 3x6) మెరుపు ఇన్నింగ్స్ ఆడగా, జైశ్వాల్(36) రాణించాడు. అర్ధసెంచరీతో చెలరేగి హైదరాబాద్కు విజయాన్ని అందించిన జేసన్రాయ్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ లభించింది.
జేసన్ దూకుడు..
165 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన హైదరాబాద్కు ఓపెన్లరు శుభారంభం అందించారు. జేసన్రాయ్, వృద్ధి సాహా తొలి వికెట్కు 57 పరుగులు జోడించారు. ఈ క్రమంలో మంచి ఊపు మీద ఉన్న ఈ జోడిని లామ్రోర్ విడగొట్టాడు. అతడు వేసిన ఆరో ఓవర్ తొలి బంతికి వృద్ధిమాన్ సాహా స్టంపౌట్గా వెనుదిరిగాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన విలియమ్సన్తో జేసన్రాయ్ జట్టుకట్టాడు. వీలుచిక్కినప్పడల్లా బౌండరీలతో జేసన్ (60) దూకుడు పెంచాడు. దీంతో 10 ఓవర్లు పూర్తయ్యేసరికి ఈ జోడి 90 పరుగులు చేసి విజయం దిశగా సాగింది. ఈ క్రమంలో జేసన్ రాయ్ జట్టు స్కోర్ 114 పరుగుల వద్ద ఔటయ్యాడు. ఆతర్వాత వచ్చిన ప్రియమ్ గార్గ్(0) డకౌట్ కావడంతో హైదరాబాద్ శిబిరంలో ఒకింత ఆందోళన నెలకొంది. అయితే కెప్టెన్ విలియమ్సన్ క్రీజులో ఉండడంతో విజయంపై ఆ జట్టు భరోసాగానే కనిపించింది. ఈ క్రమంలో క్రీజులోకి వచ్చిన అభిషేక్ శర్మ(21 నాటౌట్)తో కలిసి విలియమ్సన్ స్కోర్ను ముందుకు తీసుకెళ్లాడు. మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడుతూ విజయతీరాల వైపు తీసుకెళ్లాడు. ఇక 18 ఓవర్లలో 16 పరుగులు రావడంతో ఎస్ఆర్హెచ్ విజయం లాంఛనం అయింది. చివర్లో విలియమ్సన్ వరుసగా రెండో ఫోర్లు కొట్టడంతో జట్టు విజయంతో పాటు అర్ధశతకం కూడా నమోదు చేశాడు. రాజస్థాన్ జట్టులో ముస్తాఫిజుర్ రెహ్మాన్, మహిపాల్ లామ్రోర్, చేతన్ సకారియా తలో వికెట్ తీశారు.
సంజూ శాంసన్ ఒంటరి పోరాటం..
టాస్ గెలిచి బ్యాటింగ్ చేపట్టిన రాజస్థాన్కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. 11 పరుగుల వద్ద లెవిస్ ఔటయ్యాడు. అనంతరం వచ్చిన సంజూ శాంసన్ మరో ఓపెనర్ యశస్వి జైశ్వాల్ (36)తో కలిసి ఇన్నింగ్స్ను నిలబెట్టాడు. అయితే జైశ్వాల్ ఔటైన తర్వాత క్రీజ్లోకి వచ్చిన లివింగ్స్టోన్ (4) ఎక్కువసేపు నిలబడలేదు. 10 ఓవర్లకు మూడు వికెట్ల నష్టానికి 77 పరుగులు చేసిన రాజస్థాన్ను మహిపాల్ లామ్రోర్ (29)తో కలిసి శాంసన్ ఇన్నింగ్స్ను చక్కదిద్దాడు. వీరిద్దరూ కలిసి 84 పరుగుల భాగస్వామ్యం నిర్మించారు. అయితే స్వల్ప వ్యవధిలో సంజూతోపాటు పరాగ్ పెవిలియన్కు చేరడంతో రాజస్థాన్ 164 పరుగులకే పరిమితమైంది. హైదరాబాద్ బౌలర్లలో సిద్ధార్థ్ కౌల్ 2.. సందీప్ శర్మ, భువనేశ్వర్, రషీద్ ఖాన్ తలో వికెట్ తీశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
30 ఏళ్ల క్రితం సచిన్ ఆట మొదలైంది ఈ రోజే..!
మనకు తెలిసిన క్రికెట్ దేవుడు (Sachin Tendulkar) అక్కడే అవతరించాడు. ఆ పిలుపే లెజెండరీ బ్యాటర్ కెరీర్లో టర్నింగ్ పాయింట్గా మారింది. -
భారత్ - పాక్ ద్వైపాక్షిక సిరీస్ల నిర్వహణకు ఆసీస్ ఆసక్తి!
భారత్, పాక్ల మధ్య 2012-13 నుంచి ఇప్పటివరకూ ఎటువంటి ద్వైపాక్షిక సిరీస్లు జరగలేదు. ఈ తరుణంలో క్రికెట్ ఆస్ట్రేలియా మరోసారి తన ఆసక్తిని బయటపెట్టింది. -
కెప్టెన్సీ ఇచ్చారు సరే.. టైమూ ఇవ్వాలి కదా.. అల్లుడిని వెనకేసుకొచ్చిన షాహిద్ అఫ్రిది
పాకిస్థాన్ క్రికెట్ బోర్డుపై మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది మరోసారి ఫైర్ అయ్యాడు. తన అల్లుడు షహీన్ను కెప్టెన్సీ నుంచి తప్పించనున్నారనే కథనాల నేపథ్యంలో స్పందించాడు. -
కెప్టెన్గా తొలిసారి గిల్కు రూ. 12 లక్షల జరిమానా.. పునరావృతమైతే ఒక మ్యాచ్ వేటు!
గుజరాత్ కెప్టెన్ శుభ్మన్ గిల్ (Shubman Gill) జరిమానా ఎదుర్కొన్నాడు. స్లో ఓవర్ రేట్ కారణంగా ఐపీఎల్ నిర్వాహకులు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు., -
రెండు మ్యాచుల్లో ఒక్క బంతినీ ఎదుర్కోని ధోనీ.. కారణమేంటో చెప్పిన మైక్ హస్సీ!
ఈ ఐపీఎల్ సీజన్లో ధోనీ (MS Dhoni) బ్యాటింగ్ను చూసే అవకాశం ఇప్పటి వరకూ రాలేదు. తొలి రెండు మ్యాచుల్లోనూ మహీ వికెట్ కీపింగ్కే పరిమితమయ్యాడు. -
హైదరాబాద్ జట్టుకు తప్పని నిరీక్షణ.. కీలక స్పిన్నర్ మరో వారం దూరం!
ఓటమితో టోర్నీని ప్రారంభించిన రెండు జట్లు నేడు ఉప్పల్ వేదికగా తలపడేందుకు సిద్ధమయ్యాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్కు షాకింగ్ న్యూస్. టాప్ స్పిన్నర్ ఇంకా అందుబాటులోకి రాలేదు. -
ఇతరుల కెప్టెన్సీలో ఆడినా.. ధోనీ - రోహిత్ స్థాయి ఎప్పటికీ తగ్గదు: సిద్ధూ
హార్దిక్ పాండ్య నాయకత్వంలో ముంబయి తొలి మ్యాచ్లో ఓడిపోయింది. దీంతో అతడి సారథ్యంపైనా విమర్శలు వస్తున్నాయి. -
నేడు హైదరాబాద్తో ముంబయి మ్యాచ్.. చరిత్ర సృష్టించనున్న రోహిత్ శర్మ
హార్దిక్ పాండ్య సారథ్యంలోని ముంబయి బుధవారం హైదరాబాద్తో తలపడనుంది. ఈమ్యాచ్ స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మకు చాలా ప్రత్యేకం కానుంది. -
కొత్త రూల్స్ మాకు ఉపయోగం.. బ్యాటర్లు చిత్తే: దీపక్ చాహర్
గుజరాత్ను ఓడించడంలో చెన్నై బౌలర్ దీపక్ చాహర్, శివమ్ దూబె కీలక పాత్ర పోషించారు. -
వారిని చూస్తుంటే.. మా జట్టులో అదనంగా ఇద్దరు కుర్రాళ్లు ఉన్నట్టుంది: రుతురాజ్ గైక్వాడ్
వరుసగా రెండో విజయంతో చెన్నై జట్టు ఐపీఎల్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలోకి దూసుకెళ్లింది. -
చెన్నైదే చిందు
యువ కెప్టెన్ల పోరులో రుతురాజ్ గైక్వాడ్దే పైచేయి. డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై ఖాతాలో వరుసగా రెండో విజయం. తొలి మ్యాచ్ను మించిన ప్రదర్శన చేస్తూ అన్ని రంగాల్లోనూ ఆధిపత్యం చలాయిస్తూ సూపర్కింగ్స్.. గుజరాత్ టైటాన్స్ను చిత్తుగా ఓడించింది. -
బోణీ కొట్టేదెవరో
కొత్త సారథులు.. సరికొత్త ఉత్సాహంతో బరిలో దిగిన సన్రైజర్స్ హైదరాబాద్, ముంబయి ఇండియన్స్ జట్లకు ఆరంభ మ్యాచ్ల్లో పరాజయాలు తప్పలేదు. -
టికెట్లో రామచంద్ర!
ఐపీఎల్-17 ఆతిథ్యానికి హైదరాబాద్ సిద్ధమైంది. రసవత్తర మ్యాచ్లకు వేదికగా నిలిచేందుకు ఉప్పల్ స్టేడియం ముస్తాబైంది. అటు సన్రైజర్స్ యాజమాన్యం.. ఇటు హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్సీఏ) మ్యాచ్ల నిర్వహణ కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్నాయి. -
రెండు నెలలు ఎందుకంటే..
విరాట్ కోహ్లి ఇటీవల రెండు నెలల క్రికెట్కు దూరంగా ఉన్నాడు. భార్య అనుష్క తమ రెండో బిడ్డకు జన్మనిచ్చిన నేపథ్యంలో కుటుంబంతో అతడు విలువైన సమయం గడిపాడు. -
భారత్కు అఫ్గాన్ షాక్
69 నిమిషాల వరకు మ్యాచ్లో ఆధిక్యం.. బంతిపై చక్కని నియంత్రణ! ప్రత్యర్థి గోల్పోస్టుపై వరుస దాడులు! ఇవన్నీ చూస్తే విజయం భారత్దే అనిపించింది. -
భారత క్రికెటర్లను మార్చింది కోహ్లినే
ఫిట్నెస్ను ఎంతో ప్రేమించే విరాట్ కోహ్లి భారత క్రికెటర్లందరిని తన బాటలో నడిపిస్తున్నాడని ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ కొనియాడాడు. ఐపీఎల్ వ్యాఖ్యతగా ఉన్న కేపీ ఇలా వ్యాఖ్యానించాడు. -
గాయత్రి జోడీ ఓటమి
స్పెయిన్ మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో పుల్లెల గాయత్రి-ట్రీసా జాలీ జంటకు చుక్కెదురైంది. ఈ అయిదో సీడ్ జోడీ తొలి రౌండ్లోనే ఇంటిముఖం పట్టింది. -
నవంబరు 22న పెర్త్లో..
ఆతిథ్య ఆస్ట్రేలియా, టీమ్ఇండియా మధ్య అయిదు టెస్టుల బోర్డర్-గావస్కర్ సిరీస్ నవంబరు 22న పెర్త్లో ఆరంభం కానుంది. రెండో టెస్టు డిసెంబరు 6 నుంచి జరుగుతుంది. -
శ్రీజకు కెరీర్ ఉత్తమ ర్యాంకు
భారత యువ టేబుల్ టెన్నిస్ స్టార్ ఆకుల శ్రీజ కెరీర్లో ఉత్తమ ర్యాంకు సాధించింది. తాజా ప్రపంచ టీటీ ర్యాంకింగ్స్ మహిళల సింగిల్స్లో ఈ తెలుగమ్మాయి 40వ ర్యాంకులో నిలిచింది. -
Rahane: రహానె కళ్లు చెదిరే క్యాచ్.. ముందుకు డైవ్ చేసి.. బంతిని ఒడిసి పట్టి
చెన్నై: ఐపీఎల్ 17వ సీజన్లో తన రెండో మ్యాచ్లో గుజరాత్ను చెన్నై చిత్తుగా ఓడించింది. 207 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్కు దిగిన గుజరాత్ 143 పరుగులకే పరిమితమైంది. ఆ జట్టు 96 పరుగుల వద్ద తుషార్ దేశ్పాండే బౌలింగ్లో డేవిడ్ మిల్లర్ (21) ఔటయ్యాడు. మిల్లర్ కొట్టిన భారీ షాట్ను అజింక్య రహానె ముందుకు డైవ్ చేసి అద్భుతంగా క్యాచ్ను ఒడిసిపట్టాడు. ఇంకేందుకు ఆలస్యం వీడియో చూసేయండి..
తాజా వార్తలు (Latest News)
-
దిల్లీ హైకోర్టులో కేజ్రీవాల్కు దక్కని ఊరట
-
హైకోర్టుల్లోనూ మౌలిక సౌకర్యాల కొరత: సీజేఐ జస్టిస్ చంద్రచూడ్
-
ఒక్క ఓటరు కోసం.. 39 కి.మీ. ట్రెక్కింగ్కు పోలింగ్ సిబ్బంది రెడీ!
-
30 ఏళ్ల క్రితం సచిన్ ఆట మొదలైంది ఈ రోజే..!
-
జనసేన పెండింగ్ స్థానాలపై పవన్ కల్యాణ్ కసరత్తు
-
మయన్మార్ సరిహద్దుల్లో కంచె.. రూ.30,000 కోట్ల ఖర్చు..!