Vijay Mallya: క్రిస్ గేల్‌ను కలిసిన విజయ్ మాల్యా.. వైరల్‌ అవుతున్న ట్వీట్‌

భారతీయ బ్యాంకుల నుంచి రూ.వేల కోట్ల రుణాలు తీసుకొని పరారైన వ్యాపారవేత్త విజయ్‌ మాల్యా మరోసారి వార్తల్లోకెక్కాడు. వెస్టిండీస్‌ స్టార్‌ ప్లేయర్‌, భారత టీ20 లీగ్‌లో బెంగళూరు జట్టు మాజీ ఓపెనర్‌ క్రిస్‌ గేల్‌ని 

Published : 23 Jun 2022 01:17 IST

ఇంటర్నెట్ డెస్క్‌: భారతీయ బ్యాంకుల నుంచి రూ.వేల కోట్ల రుణాలు తీసుకొని పరారైన వ్యాపారవేత్త విజయ్‌ మాల్యా మరోసారి వార్తల్లోకెక్కాడు. వెస్టిండీస్‌ స్టార్‌ ప్లేయర్‌, భారత టీ20 లీగ్‌లో బెంగళూరు జట్టు మాజీ ఓపెనర్‌ క్రిస్‌ గేల్‌ని విజయ్ మాల్యా కలవడమే ఇందుకు కారణం. గేల్‌తో కలిసి దిగిన ఫొటోని మాల్యా ట్విటర్‌లో పోస్ట్ చేస్తూ ‘నా మంచి స్నేహితుడు క్రిస్టోఫర్ హెన్రీ గేల్, యూనివర్స్ బాస్‌ను కలుసుకోవడం చాలా బాగుంది. నేను అతడిని బెంగళూరు జట్టుకి తీసుకున్నప్పటి నుంచి మంచి స్నేహం ఏర్పడింది. గేల్‌ని జట్టులోకి తీసుకోవడం ఎప్పటికీ ఉత్తమ ఎంపిక’ అనే వ్యాఖ్యని జత చేశాడు. ఈ ట్వీట్ ప్రస్తుతం వైరల్‌గా మారింది. గతంలో బెంగళూరు జట్టుకు విజయ్‌ మాల్యా యజమానిగా ఉన్న సంగతి తెలిసిందే.

ఇక, క్రిస్‌ గేల్‌ విషయానికొస్తే.. అతడు 2011 నుంచి 2017 వరకు బెంగళూరు జట్టుకు ఆడాడు. ఈ జట్టు తరఫునే 2013లో అత్యధిక వ్యక్తిగత స్కోరు 175ని పుణెపై సాధించాడు. టీ20 క్రికెట్‌లో ఇప్పటివరకు ఇదే అత్యధిక వ్యక్తిగత స్కోరు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు