IPL - MSD: ఐపీఎల్ 2024లోనూ ఎంఎస్ ధోనీ ఆడతాడా..? రైనా రెస్పాన్స్ ఇదే..!
మరో పక్షం రోజుల్లో ఐపీఎల్ (IPL 2023) సందడి మొదలు కానుంది. దాదాపు రెండు నెలల పాటు జరిగే మెగా టోర్నీలో ఆటగాళ్లు సర్వశక్తులూ ఒడ్డుతారు. కెప్టెన్ కూల్ ఎంఎస్ ధోనీ ఇప్పటికే ప్రాక్టీస్ను ప్రారంభించాడు. అయితే, ఇదే చివరి సీజన్ అవుతుందా..? లేకపోతే వచ్చేఏడాది కూడా ఆడతాడా..? అనేది అందరిలోనూ మెదిలే ప్రశ్నలు.
ఇంటర్నెట్ డెస్క్: మార్చి 31 నుంచి ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2023) పదహారో సీజన్ ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్ గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ (GT vs CSK) జట్ల మధ్య పోరుతో మెగా టోర్నీ షురూ అవుతుంది. అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన ఎంఎస్ ధోనీ (MS Dhoni) ప్రాక్టీస్ను కూడా ప్రారంభించేశాడు. అయితే, ఈ సీజన్ తర్వాత ధోనీ ఐపీఎల్కూ గుడ్బై చెప్పేస్తాడని క్రికెట్ విశ్లేషకులు అంచనా వేశారు. ఇదే విషయాన్ని సురేశ్ రైనా (Suresh Raina) దృష్టికి తీసుకెళ్లగా.. అద్భుతమైన సమాధానం ఇచ్చాడు. ప్రస్తుతం రైనా లెజెండ్స్ లీగ్ క్రికెట్ (LLC) ఆడుతున్నాడు. ప్రెస్ కాన్ఫెరెన్స్లో రైనా మాట్లాడుతూ.. తప్పకుండా వచ్చేసీజన్లోనూ ఆడతాడని పేర్కొన్నాడు.
‘‘ఎంఎస్ ధోనీ ఐపీఎల్ 2024 (IPL 2024) సీజన్లోనూ ఆడాలని కోరుకుంటున్నా. అయితే, అతడి ఉద్దేశం ఏంటో మనకు తెలియదు. బ్యాటింగ్ బాగానే చేస్తాడు. ఫిట్నెస్లో తిరుగులేదు. అయితే, ఈ ఏడాది ధోనీ ప్రదర్శనపైనే వచ్చే సీజన్ ఆడాలా...? వద్దా..? అనే నిర్ణయం ఆధారపడి ఉంటుంది. సంవత్సరం నుంచి ఆడని ధోనీ, అంబటి రాయుడుకు సవాల్ తప్పదు. జట్టు ఇప్పటికీ చాలా బలంగా ఉంది. చాలామంది యువ ఆటగాళ్లు నిరూపించుకుంటున్నారు. రుతురాజ్ గైక్వాడ్, డేవన్ కాన్వే, జడేజా, బెన్ స్టోక్స్, దీపక్ చాహర్.. ఇలా అనుభజ్ఞులు, యువతతో కూడిన జట్టు సిద్ధంగా ఉంది. అయితే, వారు ఎలా ఆడతారో చూడాలి’’ అని రైనా చెప్పాడు.
ఇప్పటికీ ధోనీ ఫోన్లోనూ అందుబాటులో ఉండడని చాలా మంది క్రికెటర్లు చెబుతూ ఉంటారు. అయితే, తాను మాత్రం ధోనీతో టచ్లోనే ఉన్నట్లు రైనా తెలిపాడు. ‘‘అలాంటిదేం లేదు. తరచూ టచ్లోనే ఉంటాం. ఇప్పుడు ధోనీ కఠినంగా ప్రాక్టీస్ చేస్తున్నాడు. సీఎస్కే సోషల్ మీడియాలోని వీడియోలను చూస్తే మీకే తెలుస్తుంది. నెట్స్లో భారీ షాట్లను కొట్టేస్తున్నాడు. ఇలానే మ్యాచ్లోనూ ఆడితే విజయం వరించడం ఖాయం’’ అని రైనా తెలిపాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
త్వరలో ఫీల్డింగ్కు వస్తా.. 40 ఓవర్లూ మైదానంలో ఉంటా: సూర్య
‘ఇంపాక్ట్’ ప్లేయర్గా బరిలోకి దిగుతున్న సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) బ్యాటింగ్లో చెలరేగుతున్నాడు. విరామం తర్వాత బ్యాటింగ్లో మునుపటి సూర్యను చూస్తున్నామని అభిమానులు సంబరపడుతున్నారు. -
దుబాయ్ నుంచి ఆలస్యంగా పునియా, సుజీత్.. ఒలింపిక్ క్వాలిఫయర్స్ మిస్
Wrestlers: భారీ వర్షాల కారణంగా దుబాయ్లో చిక్కుకున్న భారత రెజ్లర్లు దీపక్ పునియా, సుజీత్.. ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్ దూరమయ్యారు. ఆలస్యంగా రావడంతో వారిని పోటీలకు అనుమతించలేదు. -
పవర్ప్లేలో రెండు ఓవర్లు వేస్తేనే..: జస్ప్రీత్ బుమ్రా
పంజాబ్పై ముంబయి విజయం సాధించడంలో బుమ్రా కీలక పాత్ర పోషించాడు. తన తొలి ఓవర్లోనే రెండు వికెట్లను పడగొట్టి ముంబయి పైచేయి సాధించేలా చేశాడు. -
ఆలస్యమైన మ్యాచ్.. హార్దిక్ పాండ్యకు జరిమానా
ఎట్టకేలకు ముంబయి మళ్లీ మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్లో పంజాబ్పై కేవలం 9 పరుగుల తేడాతో విజయం సాధించింది. -
అంపైర్గా పని చేసి.. ఐపీఎల్లో అదరగొట్టి... నయా సంచలనం అశుతోష్ కథ ఇది!
ధనాధన్ షాట్లతో ముంబయి మీద విరుచుకుపడి ఓటమి భయం చూపించిన అశుతోష్ శర్మ గురించి ఆసక్తికర విషయాలు... -
ఇంపాక్ట్ ప్లేయర్తో నష్టమే
ఐపీఎల్ గతేడాది ప్రవేశ పెట్టిన ఇంపాక్ట్ ప్లేయర్ విధానం కారణంగా ఆల్రౌండర్లకు నష్టం కలుగుతోందని టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అభిప్రాయపడ్డాడు. -
ఆల్రౌండర్లకు దెబ్బ
టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ చెప్పినట్లు ఐపీఎల్లో ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన భారత ఆల్రౌండర్లకు చేటు చేస్తోంది. టీ20 ప్రపంచకప్లో తలపడే టీమ్ఇండియా ఎంపిక కోసం ఐపీఎల్ ప్రదర్శన కూడా పరిగణలోకి తీసుకుంటారనే చెప్పాలి. -
ప్చ్.. పంజాబ్
13 బంతులు.. 14 పరుగులు.. 4 వికెట్లు! 193 పరుగుల ఛేదనలో పంజాబ్ పరిస్థితిది! బుమ్రా లాంటి మేటి బౌలర్.. బెంబేలెత్తిస్తున్న నేపథ్యంలో ఆ జట్టు కనీసం పోటీలో ఉన్నట్లు కూడా కనపడలేదు. ముంబయి విజయం లాంఛనమేనని తీర్మానించారంతా! కానీ అశుతోష్ శర్మ అసాధారణ బ్యాటింగ్తో పంజాబ్ అద్భుతం చేసినంత పని చేసింది. -
అశుతోష్.. నయా మెరుపు
గుజరాత్తో పంజాబ్ మ్యాచ్.. లక్ష్యం 200.. 150కే 6 వికెట్లు పడిపోయాయి.. ఉన్న ఓవర్లు కూడా తక్కువే! అయినా చివరికి పంజాబ్ గెలిచింది! -
చమరి 195 నాటౌట్
మహిళల క్రికెట్లో శ్రీలంక నయా రికార్డు సృష్టించింది. చమరి ఆటపట్టు (195 నాటౌట్; 139 బంతుల్లో 26×4, 5×6) భారీ శతకంతో అదరగొట్టడంతో దక్షిణాఫ్రికాతో మ్యాచ్లో 302 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. -
ఇషా సత్తా చాటేనా!
హైదరాబాదీ షూటర్ ఇషా సింగ్కు సవాల్. పారిస్ ఒలింపిక్స్ టికెట్ కోసం ఆమె పోటీకి సిద్ధమైంది. శుక్రవారం కర్ణిసింగ్ రేంజ్లో ఆరంభమయ్యే సెలక్షన్ ట్రయల్స్లో మహిళల 25 మీటర్ల పిస్టల్ విభాగంలో ఇషా బరిలో దిగనుంది. -
కళ్లన్నీ వినేశ్ పైనే
పారిస్ ఒలింపిక్స్ కోటా స్థానాల వేటకు భారత రెజ్లర్లు సిద్ధమయ్యారు. శుక్రవారం ప్రారంభమయ్యే ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో అత్యుత్తమ ప్రదర్శనే లక్ష్యంగా బరిలో దిగుతున్నారు. -
నదిలో నాలుగు గంటలు
ఒలింపిక్స్ చరిత్రలోనే మొట్టమొదటిగా ఈ మెగా క్రీడల ఆరంభోత్సవ వేడుకలను ఆరుబయట నిర్వహించేందుకు పారిస్ సిద్ధమవుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
ట్రెక్కింగ్ చేస్తూ జారిపడి.. స్కాట్లాండ్లో ఇద్దరు తెలుగు విద్యార్థులు మృతి
-
మీ ప్రాంతంలో బ్రాడ్బ్యాండ్ సేవలందించే సంస్థలేవో ఎలా తెలుసుకోవాలి?
-
మహబూబ్నగర్ ఎంపీ అభ్యర్థిగా వంశీచంద్రెడ్డి నామినేషన్.. ర్యాలీలో పాల్గొన్న సీఎం రేవంత్
-
త్వరలో ఫీల్డింగ్కు వస్తా.. 40 ఓవర్లూ మైదానంలో ఉంటా: సూర్య
-
వైకాపా అడ్డుపడుతోంది.. మీ ఇళ్ల వద్దకు రాలేకపోతే మన్నించండి: సునీత
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM