Suresh Raina : టీమ్‌ఇండియా మాజీ క్రికెటర్‌ సురేశ్ రైనాకు పితృవియోగం

టీమ్‌ఇండియా మాజీ ఆల్‌రౌండర్‌ సురేశ్‌ రైనా ఇంట విషాదం నెలకొంది. క్యాన్సర్‌తో...

Published : 06 Feb 2022 16:30 IST

లఖ్‌నవూ: టీమ్‌ఇండియా మాజీ ఆల్‌రౌండర్‌ సురేశ్‌ రైనా ఇంట విషాదం నెలకొంది. క్యాన్సర్‌తో బాధపడుతున్న రైనా తండ్రి త్రిలోక్‌చంద్‌ రైనా ఇవాళ తుదిశ్వాస విడిచారు. సైనికాధికారిగా ఆర్డనెన్స్‌ ఫ్యాక్టరీలో పని చేసిన త్రిలోక్‌చంద్‌ బాంబులను తయారు చేయడంలో నిపుణులు. రైనా త్రండి సొంత ఊరు జమ్ముకశ్మీర్‌లోని ‘రైనావారి’. 

అయితే కశ్మీర్‌ పండిట్లపై హత్యాకాండ నేపథ్యంలో  రైనా కుటుంబం ఉత్తర్‌ప్రదేశ్‌కు వలస వచ్చేసింది. మురాద్‌నగర్‌లో స్థిరపడ్డారు. అక్కడే సురేశ్‌ రైనా 1998లో గురు గోవింద్‌ సింగ్‌ స్పోర్ట్స్‌ కాలేజీలో చేరాడు. కశ్మీరీ విషాదం గురించి తమకు తెలియకుండా తన తండ్రి చాలా జాగ్రత్తలు తీసుకునేవారని సురేశ్‌ రైనా గతంలో పేర్కొన్నాడు. ప్రస్తుతం సురేశ్‌ రైనా ఐపీఎల్‌ మెగా వేలంలో పాల్గొనబోతున్నాడు. గత సీజన్‌ వరకు చెన్నై సూపర్‌ కింగ్స్‌ తరఫున ఆడిన రైనా ‘చిన్న తలైవా’గా గుర్తింపు పొందాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని