Believe: మే 24న రైనా ఆత్మకథ
రైనా అభిమానులకు శుభవార్త! ఈ టీమ్ఇండియా క్రికెటర్ జీవితం త్వరలోనే పుస్తక రూపంలో రానుంది....
ఇంటర్నెట్ డెస్క్: రైనా అభిమానులకు శుభవార్త! ఈ టీమ్ఇండియా క్రికెటర్ జీవితం త్వరలోనే పుస్తక రూపంలో రానుంది. ‘బిలీవ్: వాట్ లైఫ్ అండ్ క్రికెట్ టాట్ మి’ (నమ్మకం: జీవితం, క్రికెట్ నాకేం బోధించిందంటే) పుస్తకం మే 24న విడుదల కానుంది. రైనాతో పాటు రచయిత, పాత్రికేయుడు భరత్ సుందరేశన్ ఈ పుస్తకాన్ని రాశారు. పెంగ్విన్ ర్యాండమ్ హౌజ్ ఇండియా ప్రచురించింది.
యువ క్రికెటర్గా ఉన్నప్పుడు సురేశ్ రైనా ఎదుర్కొన్న సవాళ్లు, పాఠశాల, క్రికెట్ శిబిరాల్లో ఎదుర్కొన్న అవమానాలు, ఏళ్ల తరబడి కొనసాగుతున్న అనుబంధాల గురించి ఈ పుస్తకంలో వివరించారు. ‘బిలీవ్.. క్రికెట్ కలలను నిజం చేసుకొనేందుకు సాగించిన అంతర్గత ప్రయాణం. బిలీవ్.. నీలో అత్యుత్తమ గుణాలను ఆవిష్కరించేందుకు అవసరమైంది. బిలీవ్.. సరిహద్దులను దాటేసి నీపై నీకు విశ్వాసం ఉంటే..’ అని రైనా తన పుస్తకం గురించి సోషల్ మీడియాలో పెట్టాడు.
సీనియర్ క్రికెటర్లైన రాహుల్ ద్రవిడ్, ఎంఎస్ ధోనీ, సౌరవ్ గంగూలీ, సచిన్ తెందూల్కర్ నుంచి మైదానం, మైదానం ఆవల నేర్చుకున్న పాఠాలను రైనా ఈ పుస్తకంలో వివరించాడని తెలిసింది. కాగా, ఎంఎస్ ధోనీతో వీడ్కోలు పలికిన రైనా ఈ ఏడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఆడాడు. గతేడాది వ్యక్తిగత కారణాలతో దూరమైన అతడు తిరిగి చేరాక ఆ జట్టు బలం మరింత పెరిగింది. చక్కని విజయాలు సాధించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బెంగళూరు గెలిచిందోచ్..
విధ్వంసక బ్యాటింగ్తో ప్రత్యర్థులను హడలెత్తిస్తున్న సన్రైజర్స్ హైదరాబాద్తో వరుస ఓటములతో సతమతమవుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ అంటే ఫేవరెట్ ఎవరో చెప్పాల్సిన పని లేదు. -
చదరంగ యువరాజుకు ఘన స్వాగతం
సమయం తెల్లవారుజామున 3 గంటలు. చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం. సాధారణంగా రాత్రి వేళ ప్రయాణికులతో మాత్రమే కాస్త సందడిగా ఉండే ఆ విమానాశ్రయంలో గురువారం మాత్రం ఎంతో హడావుడి నెలకొంది. -
దిల్లీ జట్టులోకి గుల్బాదిన్
గాయంతో ఐపీఎల్ 17వ సీజన్ నుంచి అర్ధంతరంగా తప్పుకొన్న మిచెల్ మార్ష్ స్థానాన్ని అఫ్గానిస్థాన్ పేస్ ఆల్రౌండర్ గుల్బాదిన్ నయీబ్తో దిల్లీ క్యాపిటల్స్ భర్తీ చేసింది. -
ఫైనల్లో ధీరజ్ బృందం
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో భారత పురుషుల రికర్వ్ జట్టు సత్తా చాటింది. -
ఆ నిబంధనతో ప్రమాదమే
ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన వల్ల ఆల్రౌండర్ పాత్ర ప్రమాదంలో పడుతోందని స్పిన్నర్ అక్షర్ పటేల్ అన్నాడు. -
ట్రయల్స్లో అర్జున్ రికార్డు స్కోరు
ఒలింపిక్ షూటింగ్ ట్రయల్స్ 10మీ ఎయిర్ రైఫిల్లో అర్జున్ బబూత ప్రపంచ రికార్డు స్కోరు (254) సాధించాడు. -
భారత అథ్లెట్ల జోరు
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా