INDvsSL: సున్నా నుంచే మొదలుపెడతా
ఇంగ్లాండ్తో టీ20 సిరీస్ సందర్భంగా అరంగేట్రంలోనే అదరగొట్టిన సూర్యకుమార్ యాదవ్ రాబోయే శ్రీలంక సిరీస్లో మళ్లీ సున్నా నుంచి మొదలుపెడతానని అంటున్నాడు. ప్రస్తుతం కొలంబోలో క్వారంటైన్లో ఉన్న శిఖర్ ధావన్...
లంక పర్యటనపై సూర్యకుమార్ యాదవ్..
కొలంబో: ఇంగ్లాండ్తో టీ20 సిరీస్ సందర్భంగా అరంగేట్రంలోనే అదరగొట్టిన సూర్యకుమార్ యాదవ్ రాబోయే శ్రీలంక సిరీస్లో మళ్లీ సున్నా నుంచి మొదలుపెడతానని అంటున్నాడు. ప్రస్తుతం కొలంబోలో క్వారంటైన్లో ఉన్న శిఖర్ ధావన్ నేతృత్వంలోని భారత జట్టులో సూర్య ఒకడనే సంగతి తెలిసిందే. ఇప్పుడా జట్టు అక్కడ కఠోర సాధన చేస్తోంది. ఈ క్రమంలోనే ఆటగాళ్లు ఇంట్రా-స్క్వాడ్ మ్యాచ్లు ఆడుతూ తమని తాము మెరుగుపర్చుకుంటున్నారు. అయితే, తాజాగా సూర్యకుమార్ వర్చువల్ పద్ధతిలో మీడియాతో మాట్లాడుతూ లంక పర్యటనపై తన అభిప్రాయాలు వెల్లడించాడు. అలాగే రాహుల్ ద్రవిడ్ లాంటి దిగ్గజంతో తొలిసారి కలిసి పనిచేస్తున్నానని చెప్పాడు. దాంతో అతని నుంచి మరిన్ని విషయాలు నేర్చుకునేందుకు సిద్ధంగా ఉన్నానన్నాడు.
‘లంకతో తలపడేటప్పుడు కచ్చితంగా ఒత్తిడి ఉంటుంది. అది లేకపోతే ఉత్సాహం ఉండదు. ఈ పర్యటన మాకు సవాళ్లతో కూడుకున్నది. అందుకోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. మరోవైపు ఇంగ్లాండ్తో అరంగేట్రం చేసిన సిరీస్కూ, ఈ సిరీస్కూ పోలికే లేదు. రెండూ వేర్వేరైనా సవాళ్లు ఒకే రీతిలో ఉంటాయి. ఈ క్రమంలోనే లంకతో ఆడేటప్పుడు నా ఆటను మళ్లీ సున్నా నుంచి మొదలుపెట్టాలనుకుంటున్నా. ఇదివరకు ఎలా ఆడానో ఇప్పుడూ అలాగే ఆడాలనుకుంటున్నా’ అని ముంబయి బ్యాట్స్మన్ చెప్పుకొచ్చాడు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో శ్రీలంక పర్యటన నిర్వహించడం గొప్ప విశేషమని, అది తమకు మంచి అవకాశమని సూర్యకుమార్ అన్నాడు. ఆటగాళ్లు ఇక్కడ రాణించి తమని, తాము నిరూపించుకోవడం సవాళ్లతో కూడుకున్నది చెప్పాడు. అలాగే రాహుల్ ద్రవిడ్తో కలిసి తొలిసారి పనిచేస్తున్నట్లు చెప్పాడు. ‘అతనితో ఇదే నా తొలి పర్యటన. తన గురించి చాలా గొప్పగా విన్నా. ద్రవిడ్ నేతృత్వంలో మరెన్నో విషయాలు నేర్చుకోవాలనుకుంటున్నా’ అని సూర్య పేర్కొన్నాడు.
ఇక ఐపీఎల్లో ముంబయి ఇండియన్స్ తరఫున ఆడినట్లే భారత జట్టులోనూ ఆడతానని ఈ యువ బ్యాట్స్మన్ చెప్పుకొచ్చాడు. అనంతరం హార్దిక్ పాండ్య బౌలింగ్పై స్పందిస్తూ.. అతడు ఇంట్రా-స్క్వాడ్ మ్యాచ్లో బంతులేశాడని, అలాగే ఇంగ్లాండ్తో టీ20ల్లోనూ బౌలింగ్ చేశాడని సూర్య గుర్తుచేశాడు. ఇప్పుడైతే హార్దిక్ బౌలింగ్ చేసేందుకు సిద్ధంగా ఉన్నా ఆ నిర్ణయం అతడూ, జట్టు యాజమాన్యం తీసుకోవాలన్నాడు. ఇక అక్కడి పరిస్థితులకు అలవాటు పడటంపై మాట్లాడుతూ ఇలాంటి ఉక్కపోత పరిస్థితుల్లో తాము ఇదివరకు ఆడామని, చెన్నై, ముంబయిలాంటి నగరాల్లోనూ అచ్చం ఇలాంటి పరిస్థితులే ఉంటాయని సూర్య వెల్లడించాడు. అలాగే తాము అక్కడి పరిస్థితులకు అలవాటు పడటానికే 15-20 రోజుల ముందుగా వచ్చామన్నాడు. దాంతో ఎలాంటి సమస్య ఉండదని అభిప్రాయపడ్డాడు. చివరగా తమ జట్టును ద్వితీయశ్రేణి జట్టుగా అభివర్ణించడాన్ని సూర్య కొట్టిపారేశాడు. తాము ఆ విషయం గురించి ఆలోచించడంలేదని తేల్చిచెప్పాడు. శ్రీలంకకు క్రికెట్ ఆడేందుకు వచ్చామని, ఆ సిరీస్లను సానుకూల పరిస్థితుల్లో పూర్తి చేయాలని అనుకుంటున్నామని యువ బ్యాట్స్మన్ పేర్కొన్నాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్చ్.. పంజాబ్
13 బంతులు.. 14 పరుగులు.. 4 వికెట్లు! 193 పరుగుల ఛేదనలో పంజాబ్ పరిస్థితిది! బుమ్రా లాంటి మేటి బౌలర్.. బెంబేలెత్తిస్తున్న నేపథ్యంలో ఆ జట్టు కనీసం పోటీలో ఉన్నట్లు కూడా కనపడలేదు. ముంబయి విజయం లాంఛనమేనని తీర్మానించారంతా! కానీ అశుతోష్ శర్మ అసాధారణ బ్యాటింగ్తో పంజాబ్ అద్భుతం చేసినంత పని చేసింది. -
అశుతోష్.. నయా మెరుపు
గుజరాత్తో పంజాబ్ మ్యాచ్.. లక్ష్యం 200.. 150కే 6 వికెట్లు పడిపోయాయి.. ఉన్న ఓవర్లు కూడా తక్కువే! అయినా చివరికి పంజాబ్ గెలిచింది! -
ఇంపాక్ట్ ప్లేయర్తో నష్టమే
ఐపీఎల్ గతేడాది ప్రవేశ పెట్టిన ఇంపాక్ట్ ప్లేయర్ విధానం కారణంగా ఆల్రౌండర్లకు నష్టం కలుగుతోందని టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అభిప్రాయపడ్డాడు. -
చమరి 195 నాటౌట్
మహిళల క్రికెట్లో శ్రీలంక నయా రికార్డు సృష్టించింది. చమరి ఆటపట్టు (195 నాటౌట్; 139 బంతుల్లో 26×4, 5×6) భారీ శతకంతో అదరగొట్టడంతో దక్షిణాఫ్రికాతో మ్యాచ్లో 302 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. -
ఇషా సత్తా చాటేనా!
హైదరాబాదీ షూటర్ ఇషా సింగ్కు సవాల్. పారిస్ ఒలింపిక్స్ టికెట్ కోసం ఆమె పోటీకి సిద్ధమైంది. శుక్రవారం కర్ణిసింగ్ రేంజ్లో ఆరంభమయ్యే సెలక్షన్ ట్రయల్స్లో మహిళల 25 మీటర్ల పిస్టల్ విభాగంలో ఇషా బరిలో దిగనుంది. -
కళ్లన్నీ వినేశ్ పైనే
పారిస్ ఒలింపిక్స్ కోటా స్థానాల వేటకు భారత రెజ్లర్లు సిద్ధమయ్యారు. శుక్రవారం ప్రారంభమయ్యే ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో అత్యుత్తమ ప్రదర్శనే లక్ష్యంగా బరిలో దిగుతున్నారు. -
నదిలో నాలుగు గంటలు
ఒలింపిక్స్ చరిత్రలోనే మొట్టమొదటిగా ఈ మెగా క్రీడల ఆరంభోత్సవ వేడుకలను ఆరుబయట నిర్వహించేందుకు పారిస్ సిద్ధమవుతోంది. -
ఆల్రౌండర్లకు దెబ్బ
టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ చెప్పినట్లు ఐపీఎల్లో ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన భారత ఆల్రౌండర్లకు చేటు చేస్తోంది. టీ20 ప్రపంచకప్లో తలపడే టీమ్ఇండియా ఎంపిక కోసం ఐపీఎల్ ప్రదర్శన కూడా పరిగణలోకి తీసుకుంటారనే చెప్పాలి.
తాజా వార్తలు (Latest News)
-
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షలు
-
పేదరాలు బుట్టమ్మ ఆస్తులు రూ.161.21 కోట్లు
-
నా భర్తపై రెబల్గా పోటీ చేస్తా.. టెక్కలి వైకాపా అభ్యర్థి దువ్వాడ భార్య వాణి
-
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
-
గూగుల్ మ్యాప్స్లో మరో కొత్త ఫీచర్.. ఈవీ స్టేషన్లు వెతకడం ఇక సులువే!
-
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు