SKY: వాషింగ్టన్ సుందర్ విషయంలో నాదే తప్పు.. వైరల్గా మారిన సూర్య వ్యాఖ్యలు
న్యూజిలాండ్తో (IND vs NZ) జరిగిన రెండో టీ20 మ్యాచ్లో భారత్ (Team India) గెలవడంలో స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ (Surya Kumar Yadav) కీలక పాత్ర పోషించాడు. ఈ సందర్భంగా వాషింగ్టన్ సుందర్కు (Washington Sundar) క్షమాపణలు తెలిపాడు. ఎందుకంటే..?
ఇంటర్నెట్ డెస్క్: ఉత్కంఠభరితంగా సాగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ విజయం సాధించింది. దీంతో మూడు టీ20ల సిరీస్లో టీమ్ఇండియా 1-1తో సమంగా నిలిచింది. ఈ క్రమంలో జట్టును గెలిపించిన సూర్యకుమార్ యాదవ్ చేసిన కీలక వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఇంతకీ అతడేం చెప్పాడు.. ఎందుకు చెప్పాడో తెలియాలంటే.. దీనిపై ఓ లుక్కేయండి..
పది ఓవర్లు.. స్కోరు బోర్డుపై 49 పరుగులు.. ఓపెనర్లు అప్పటికే ఔట్.. ఇక చివరి 10 ఓవర్లలో భారత్ లక్ష్యం 51.. చేతిలో ఇంకా ఏడు వికెట్లు ఉన్నాయనే ధీమా.. డ్రింక్స్ బ్రేక్ ముగిసిన తర్వాతి ఓవర్లోనే కుదురుగా ఆడుతున్న రాహుల్ త్రిపాఠి పెవిలియన్కు చేరాడు. ఆ ఓవర్లో రెండే పరుగులు వచ్చాయి. దీంతో విజయ సమీకరణం 9 ఓవర్లలో 49 పరుగులకు చేరింది. ఇలాంటి సమయంలో సూర్యకుమార్ (26*)తో కలిసి వాషింగ్టన్ సుందర్ (9 బంతుల్లో 10) ఇన్నింగ్స్ను నిలబెట్టేందుకు ప్రయత్నించాడు. అయితే 36 బంతుల్లో 30 పరుగులుగా భారత విజయ సమీకరణం మారింది. కానీ, గ్లెన్ ఫిలిప్స్ బౌలింగ్లో సూర్యకుమార్ చేసిన తప్పిదంతో వాషింగ్టన్ సుందర్ తన వికెట్ను త్యాగం చేయాల్సి వచ్చింది. 15వ ఓవర్ మూడో బంతిని ఆడిన సూర్యకుమార్.. బాల్ పక్కనే పెట్టుకొని మరీ పరుగు కోసం ముందుకొచ్చేశాడు. అప్పటికీ వాషింగ్టన్ సుందర్ వద్దని చెబుతున్నా సరే ఆగకుంగా నాన్స్ట్రైకింగ్ వైపు దూసుకొచ్చాడు. దీంతో సూర్యకుమార్ వికెట్ విలువను గుర్తెరిగిన సుందర్ అడుగులు ముందుకేసి రనౌట్ రూపంలో తీవ్ర అసంతృప్తితో డగౌట్కు వెళ్లిపోయాడు. ఈ క్రమంలో చివరి వరకూ క్రీజ్లో ఉండి భారత్ను విజయతీరాలకు చేర్చిన సూర్యకుమార్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకొన్నాడు. ఈ సందర్భంగా వాషింగ్టన్ సుందర్ రనౌట్ విషయంలో తనదే తప్పు అని అంగీకరించాడు.
మ్యాచ్ అనంతరం సూర్యకుమార్ మాట్లాడుతూ.. ‘‘రనౌట్ విషయంలో పూర్తిగా నాదే తప్పు. బంతి ఎక్కడికి వెళ్లిందనేది నేను గమనించలేదు. అక్కడైతే కచ్చితంగా పరుగు రాదు’’ అని వెల్లడించాడు. కఠినమైన పిచ్ మీద ప్రతి పరుగూ రాబట్టడం కష్టంగా మారింది. అయితే చివరి వరకూ బ్యాటింగ్ చేసి జట్టును గెలిపించడం ఆనందంగా ఉందని పేర్కొన్నాడు. సుందర్ను రనౌట్ చేయడంపై సూర్య చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. నిజాయతీగా అంగీకరించిన సూర్యను అభిమానులు, నెటిజన్లు ప్రశంసించారు. అలాగే టీమ్ఇండియాను గెలిపించినందుకు అభినందనలు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
MS Dhoni: ధోని.. ఇంకా నాటౌటే
చివరి సీజన్గా భావిస్తున్న ఈ ఐపీఎల్లో బ్యాటింగ్ చేస్తోంది తక్కువసేపే అయినా అభిమానులను ఉర్రూతలూగిస్తున్నాడు ధోని. -
కేఎల్ రాహుల్ కెప్టెన్ ఇన్నింగ్స్.. చెన్నైకి చెక్
ఏక్నా స్టేడియంలోని నెమ్మదైన పిచ్పై స్కోరు 160 దాటిందంటే ఛేదన కష్టమే. ఓ దశలో చెన్నై 150 అయినా చేస్తుందా అనుకుంటే.. గత మ్యాచ్లో ముంబయిపై చెలరేగినట్లే మహేంద్రసింగ్ ధోని ఈ మ్యాచ్లోనూ ఆఖర్లో మెరుపు ఇన్నింగ్స్ ఆడడంతో చెన్నై స్కోరు 176కు చేరుకుంది. -
కుర్రాళ్లు కుమ్మేస్తున్నారు
ఛేదనలో నాలుగైదు వికెట్లు పడ్డాయా? అయినా భయం లేదు తామున్నామంటూ సత్తాచాటుతున్నారు. -
బుమ్రా బౌలింగ్లో స్వీప్ షాట్.. నా కల!
అశుతోష్ శర్మ.. ఈ ఐపీఎల్లో గట్టిగా వినిపిస్తున్న కొత్త పేరు. -
రేసులో గుకేశ్ ఒక్కడే..
క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్లో భారత యువ కెరటం గుకేశ్ మళ్లీ ఆధిక్యంలోకి వచ్చాడు. -
మెరిసిన ఇషా, భవేష్
ఒలింపిక్స్ సెలెక్షన్ ట్రయల్స్లో అగ్రశ్రేణి షూటర్లు ఇషా సింగ్, భవేష్ షెకావత్ మెరిశారు. -
దీపకు నాలుగో స్థానం
దోహాలో జరిగిన జిమ్నాస్టిక్స్ ప్రపంచకప్ను భారత స్టార్ దీప కర్మాకర్ నాలుగో స్థానంతో ముగించింది. -
భారత రెజ్లర్లు విఫలం
ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో భారత పురుష రెజ్లర్లు విఫలమయ్యారు. -
విమానం ఆలస్యమై...
భారత ఉత్తమ రెజ్లర్లలో ఇద్దరైన దీపక్ పునియా (86 కేజీలు), సుజీత్ కలాకల్ (65 కేజీలు)కు నిరాశ తప్పలేదు. -
రాకెట్ వదిలేద్దాం అనుకున్నా
గత కొన్నేళ్లలో కెరీర్లో ఎంతో క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొన్నానని.. ఒకటికి రెండుసార్లు బ్యాడ్మింటన్కు వీడ్కోలు చెప్పాలని భావించానని భారత డబుల్స్ స్టార్ అశ్విని పొన్నప్ప తెలిపింది. -
చెరువుల సంరక్షణ కోసం ఆర్సీబీ
ఐపీఎల్ జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టింది.