IND vs NZ: సూర్యకుమార్.. శ్రేయస్.. వన్డౌన్లో ఎవరు? అశ్విన్ ఎంపిక ఇదే!
ప్రస్తుతం టీమ్ఇండియా న్యూజిలాండ్ పర్యటనలో ఉంది. హార్దిక్ పాండ్య నాయకత్వంలోని భారత్ మూడు టీ20లను ఆడనుంది. అయితే వెల్లింగ్టన్ వేదికగా జరగాల్సిన తొలి మ్యాచ్ వర్షం కారణంగా రద్దైన సంగతి తెలిసిందే.
ఇంటర్నెట్ డెస్క్: మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడేందుకు న్యూజిలాండ్లో టీమ్ఇండియా పర్యటిస్తోంది. అయితే వెల్లింగ్టన్ వేదికగా జరగాల్సిన తొలి టీ20 మ్యాచ్ వర్షం కారణంగా రద్దైన విషయం తెలిసిందే. యువకులతో కూడిన భారత జట్టు తమ సత్తా చాటేందుకు ఉవ్విళ్లూరుతోంది. ఈ క్రమంలో కీలకమైన వన్డౌన్లో ఎవరు బ్యాటింగ్ చేస్తే బాగుంటుందనే దానిపై అభిమానుల్లో ఉత్కంఠ కొనసాగుతోంది. రెగ్యులర్ జట్టు అయితే విరాట్ కోహ్లీ మూడో స్థానంలో బ్యాటింగ్కు దిగేవాడు. ఆ తర్వాత సూర్యకుమార్ వచ్చేవాడు. ఇప్పుడు ఆ స్థానం కోసం ఇద్దరి మధ్య తీవ్ర పోటీ నెలకొంది. సూర్యకుమార్తోపాటు శ్రేయస్ అయ్యర్ రేసులో నిలిచాడు. మరి టీమ్ఇండియా సీనియర్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ మనసులో మాటను తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా వెల్లడించాడు.
‘‘శ్రేయస్ అయ్యర్ వన్డౌన్లో బ్యాటింగ్కు వస్తేనే ఉత్తమం. ఇక సూర్యకుమార్ తన నాలుగో స్థానంలోనే ఆడాలి. దీనిని లాక్ చేసేయొచ్చు. సూర్యను మూడో స్థానంలో పంపించడం ఉద్వేగంతో తీసుకొనే నిర్ణయం అవుతుందని భావిస్తున్నా. అందుకే ఆ స్థానానికి శ్రేయస్ అయ్యర్ కరెక్ట్. ఇక ఓపెనర్గా రిషభ్ పంత్ను పంపిస్తే.. ఐదో స్థానంలో వాషింగ్టన్ సుందర్ కీలకమవుతాడు. అతడు లెఫ్ట్ హ్యాండర్ కావడమే అందుక్కారణం. మిడిలార్డర్లో ఇంకెవరూ ఎడమ చేతివాటం బ్యాటర్లు లేరు. ఎందుకంటే టీ20 ఫార్మాట్లో లెఫ్ట్-రైట్ కాంబినేషన్ చాలా కీలకం. వాషింగ్టన్ సుందర్ తుది జట్టులో ఉండి బాగా ఆడితే మంచి కమ్బ్యాక్ అవుతుంది’’ అని అశ్విన్ వెల్లడించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తాగి చెస్ ఆడా.. ప్యాంట్లో మూత్రం పోసుకున్నా..
చెస్ మేటి మాగ్నస్ కార్ల్సన్ ఇటీవల ఓ కొత్త సవాలును స్వీకరించాడు. సత్యశోధన పరీక్ష (లై డిటెక్టర్ టెస్ట్)లో తన చెస్ కెరీర్, వ్యక్తిగత జీవితంపై అనేక ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. -
మోహిత్.. చెత్త రికార్డు
గుజరాత్ టైటాన్స్ పేసర్ మోహిత్ శర్మ చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఓ ఐపీఎల్ మ్యాచ్లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్గా అతను రికార్డులకెక్కాడు. -
దిల్లీ గట్టెక్కింది
ఐపీఎల్-17లో తడబడుతూ సాగుతున్న దిల్లీ క్యాపిటల్స్.. ప్లేఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లుతున్న సమయంలో ఓ కీలక విజయం సాధించింది. బుధవారం ఆ జట్టు గుజరాత్ టైటాన్స్ను 4 పరుగుల స్వల్ప తేడాతో ఓడించింది. -
పొట్టి కప్పులో ఎవరు?
వెస్టిండీస్, అమెరికా ఉమ్మడిగా ఆతిథ్యమిస్తున్న టీ20 ప్రపంచకప్ కోసం 15 మంది జట్టుతో పాటు అయిదుగురు రిజర్వ్ ఆటగాళ్లనూ ప్రకటించేందుకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ కసరత్తులు చేస్తోంది. -
300 కొట్టేస్తారా?
ఈ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ నమోదు చేసిన రికార్డులివీ. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్లతో రికార్డులు తిరగరాస్తున్న సన్రైజర్స్ పొట్టి లీగ్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. -
ఫైనల్లో జ్యోతి జట్టు
ఆర్చరీ ప్రపంచకప్లో భారత ఆర్చర్ల దూకుడు కొనసాగుతోంది. విజయవాడ అమ్మాయి జ్యోతి సురేఖ జట్టు కాంపౌడ్ మహిళల విభాగంలో ఫైనల్లో అడుగుపెట్టింది. -
దీపాన్షుకు జావెలిన్ స్వర్ణం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ తొలి రోజు, బుధవారం భారత అథ్లెట్లు సత్తా చాటారు. పురుషుల జావెలిన్ త్రోలో దీపాన్షు శర్మ స్వర్ణం గెలుచుకున్నాడు. -
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
T20 Worldcup 2024 - BCCI: వచ్చే టీ20 ప్రపంచకప్ కోసం ఏ 15 మందిని ఎంపిక చేస్తే బాగుంటుంది. -
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
ఐపీఎల్లో ఫినిషర్గా అదరగొడుతున్న ఎంఎస్ ధోనీ (MS Dhoni)ని టీ20 వరల్డ్కప్నకు ఎంపిక చేయాలనే ఆలోచనను పలువురు మాజీలు కోరుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?
-
పులివెందులలోనూ పరదాల వీరుడే.. నేడు సీఎం జగన్ నామినేషన్
-
నేడు ఉప్పల్లో ఐపీఎల్ మ్యాచ్.. ట్రాఫిక్ మళ్లింపు
-
తాగి చెస్ ఆడా.. ప్యాంట్లో మూత్రం పోసుకున్నా..
-
నిజం చెబితే.. గురువులకు నోటీసులు!
-
రోడ్డేయలేదని అడిగితే.. కొడాలి నాని వర్గం దాడి