Suryakumar yadav: రంజీ ట్రోఫీలో ‘మిస్టర్ 360’.. ముంబయి తరఫున బరిలోకి..!
రానున్న రంజీ ట్రోఫీ(Ranji trophy) సీజన్లో సూర్యకుమార్ యాదవ్(Suryakumar yadav) ఆడనున్నట్టు సమాచారం. ముంబయి తరఫున ఈ ఆటగాడు బరిలోకి దిగే అవకాశాలు ఉన్నాయి.
దిల్లీ: టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్(Suryakumar yadav) రంజీ ట్రోఫీ 2022-23(Ranji trophy 2022-23) సీజన్లో ఆడనున్నట్టు తెలుస్తోంది. ముంబయి జట్టు తరఫున ఈ మిస్టర్ 360 బరిలోకి దిగే అవకాశాలున్నట్టుగా ఓ ఆంగ్ల క్రీడా ఛానెల్ పేర్కొంది. హరియాణా, హిమాచల్ప్రదేశ్ మధ్య ఈ సీజన్ తొలి మ్యాచ్ డిసెంబర్ 13న ప్రారంభం కానుంది. భారత సీనియర్ బ్యాట్స్మన్ అజింక్యా రహానె జట్టుకు నాయకత్వం వహించనున్నాడు. బంగ్లాదేశ్(Bangladesh)తో వన్డే సిరీస్కు విశ్రాంతి తీసుకున్నసూర్య పేరును ముంబయి జట్టులో ప్రకటించలేదు. కానీ, హైదరాబాద్తో జరిగే రెండో రౌండ్ గేమ్కు ఈ యువ ఆటగాడు అందుబాటులోకి రానున్నట్టు తెలుస్తోంది.
అద్భుతమైన ప్రదర్శనతో ఫామ్ను కొనసాగిస్తోన్న సూర్యకుమార్ ఈ ఏడాది 31 టీ20 మ్యాచ్ల్లో 46.56 సగటుతో 1,164 పరుగులు చేసి రికార్డులకెక్కాడు. రెండు సెంచరీలు, 9 అర్ధసెంచరీలను తన ఖాతాలో వేసుకున్నాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
-
గూగుల్ మ్యాప్స్లో మరో కొత్త ఫీచర్.. ఈవీ స్టేషన్లు వెతకడం ఇక సులువే!
-
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు
-
40 గంటల బ్యాటరీ లైఫ్తో నథింగ్ నుంచి 2 కొత్త ఇయర్బడ్స్
-
కాలేజీ క్యాంపస్లో ఘోరం.. కార్పొరేటర్ కుమార్తె దారుణ హత్య
-
అమ్మ చనిపోయారు.. నేను పోటీ చేయలేను: ‘హిమాచల్’ డిప్యూటీ సీఎం కుమార్తె