Neeraj Chopra: స్విస్ పర్వతశ్రేణుల్లో నీరజ్ చోప్రా.. ఆడటానికి కాదు!
భారత్ బల్లెం వీరుడు నీరజ్చోప్రాకు ఇప్పుడు ఇదే తరహాలో అరుదైన గౌరవం దక్కింది. స్విట్జర్లాండ్ ప్రభుత్వం ఆయన్ను ఆ దేశ పర్యాటకశాఖ ‘ఫ్రెండ్షిప్ అంబాసిడర్’గా నియమించింది.
ఇంటర్నెట్ డెస్క్: చుట్టూ పచ్చదనం. ఉట్టిపడే ప్రకృతి రమణీయం. కొంత దూరం ప్రయాణించగానే మంచు దుప్పటి కప్పినట్లు పర్వతశ్రేణులు, నిటారైన పర్వతాల మధ్య బంగీ జంప్, మంచులో రైలు ప్రయాణం.. వీటి గురించి వినగానే.. ఒక్కసారైనా అక్కడ పర్యటించాలని ప్రతి ఒక్కరూ ఆశపడుతుంటారు. ఒకవేళ ఆ ప్రదేశాల్లో పర్యటించి అక్కడి ప్రకృతి అందాల గురించి ప్రచారం చేయమంటే.. ఇంకేముంది ఎంత గొప్ప అవకాశం అని సంబరపడిపోతాం.
భారత్ బల్లెం వీరుడు నీరజ్చోప్రాకు ఇప్పుడు ఇదే తరహాలో అరుదైన గౌరవం దక్కింది. స్విట్జర్లాండ్ ప్రభుత్వం ఆయన్ను ఆ దేశ పర్యాటకశాఖ ‘ఫ్రెండ్షిప్ అంబాసిడర్’గా నియమించింది. ఈ భాగస్వామ్యం ద్వారా ప్రకృతి అందాలకు నెలవైన స్విట్జర్లాండ్లోని ప్రముఖ పర్యాటక ప్రదేశాలకు భారత్ సహా ప్రపంచ దేశాల నుంచి ఎక్కువ మంది పర్యాటకులను ఆకర్షించవచ్చని స్విట్జర్లాండ్ భావిస్తోంది.
గతేడాది సెప్టెంబరులో జ్యురిచ్లో డైమండ్ లీగ్ ఛాంపియన్షిప్ గెలిచిన తర్వాత నీరజ్ చోప్రా తన స్నేహితులతో కలిసి స్విట్జర్లాండ్లోని ఇంటర్లాకెన్, జెర్మాట్, జెనీవాలో పర్యటించాడు. దీనికి సంబంధించిన వీడియోను నీరజ్ చోప్రా తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశాడు.
కారులు లేని గ్రామం.. మంచుకొండల్లో రైలు ప్రయాణం
స్విట్జర్లాండ్లో ప్రకృతి రమణీయత ఉట్టిపడే ఆల్ప్స్ పర్వతాలు ప్రధాన ఆకర్షణ. ఇంటర్లాకెన్ను స్విట్జర్లాండ్ అడ్వెంచర్ క్యాపిటల్గా పిలుస్తారు. అక్కడ స్కై డైవింగ్, జెట్ బోటింగ్, కాన్యాన్ జంపింగ్ వంటి సాహసోపేత ఆటలు పర్యాటకులను విశేషంగా ఆదరిస్తాయి.
కారులే ఉండని గ్రామం జెర్మాటాలో మంచుతో నిండిన ఆల్ప్ పర్వతశ్రేణుల్లో కేబుల్ కార్ ప్రయాణం పర్యటకులు తీపి గుర్తుగా మిగిలిపోతుంది. ఇక్కడ పారాగ్లైడింగ్ చేస్తూ ముఖ్యమైన ప్రదేశాలను బర్డ్ ఐ వ్యూలో చూడొచ్చు. ఇవేకాకుండా ఆల్ప్ పర్వతాల్లో గోర్నెర్గ్రాట్లో ఉన్న రాతి కట్టడం స్విట్జర్లాండ్లో తప్పక చూడాల్సిన ప్రదేశాల్లో ఒకటి. జెర్మాట్ నుంచి గోర్నెర్గ్రాట్కు రైల్లో చేరుకోవచ్చు. ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ మంచు పర్వతాల గుండా సాగే ఈ రైలు ప్రయాణం మరో మధురానుభూతిని మిగులుస్తుంది. ఇవేకాకుండా నాలుగు వేల మీటర్ల ఎత్తుల్లో జెర్మాట్లోని హెలికాఫ్టర్ ప్రయాణం, మంచులో స్కేటింగ్, గొండాలా రైడ్ వంటివి అదనపు ఆకర్షణగా చెప్పుకోవచ్చు.
నీరజ్ చోప్రాకు, స్విట్జర్లాండ్తో విడదీయరాని అనుబంధం ఉంది. ఆయన తరచుగా జావెలిన్ త్రో శిక్షణ కోసం స్విట్జర్లాండ్ వెళుతుంటాడు. శిక్షణ అనంతరం అప్పుడప్పుడు ఆ దేశంలోని పర్యాటక ప్రాంతాల్లో విహారిస్తుంటాడు. ఆ విధంగా నీరజ్ చోప్రాకు స్విట్జర్లాండ్లోని పర్యాటక స్థలాలపై అవగాహన ఉంది. ఆయన్ను ఫ్రెండ్షిప్ అంబాసిడర్గా నియమించడం భారత్ సహా, ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులను ఆకర్షించేందుకు దోహదపడుతుందని స్విట్జర్లాండ్ పర్యాటకశాఖ భావిస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దిల్లీ గట్టెక్కింది
ఐపీఎల్-17లో తడబడుతూ సాగుతున్న దిల్లీ క్యాపిటల్స్.. ప్లేఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లుతున్న సమయంలో ఓ కీలక విజయం సాధించింది. బుధవారం ఆ జట్టు గుజరాత్ టైటాన్స్ను 4 పరుగుల స్వల్ప తేడాతో ఓడించింది. -
మోహిత్.. చెత్త రికార్డు
గుజరాత్ టైటాన్స్ పేసర్ మోహిత్ శర్మ చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఓ ఐపీఎల్ మ్యాచ్లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్గా అతను రికార్డులకెక్కాడు. -
పొట్టి కప్పులో ఎవరు?
వెస్టిండీస్, అమెరికా ఉమ్మడిగా ఆతిథ్యమిస్తున్న టీ20 ప్రపంచకప్ కోసం 15 మంది జట్టుతో పాటు అయిదుగురు రిజర్వ్ ఆటగాళ్లనూ ప్రకటించేందుకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ కసరత్తులు చేస్తోంది. -
300 కొట్టేస్తారా?
ఈ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ నమోదు చేసిన రికార్డులివీ. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్లతో రికార్డులు తిరగరాస్తున్న సన్రైజర్స్ పొట్టి లీగ్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. -
తాగి చెస్ ఆడా.. ప్యాంట్లో మూత్రం పోసుకున్నా..
చెస్ మేటి మాగ్నస్ కార్ల్సన్ ఇటీవల ఓ కొత్త సవాలును స్వీకరించాడు. సత్యశోధన పరీక్ష (లై డిటెక్టర్ టెస్ట్)లో తన చెస్ కెరీర్, వ్యక్తిగత జీవితంపై అనేక ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. -
ఫైనల్లో జ్యోతి జట్టు
ఆర్చరీ ప్రపంచకప్లో భారత ఆర్చర్ల దూకుడు కొనసాగుతోంది. విజయవాడ అమ్మాయి జ్యోతి సురేఖ జట్టు కాంపౌడ్ మహిళల విభాగంలో ఫైనల్లో అడుగుపెట్టింది. -
దీపాన్షుకు జావెలిన్ స్వర్ణం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ తొలి రోజు, బుధవారం భారత అథ్లెట్లు సత్తా చాటారు. పురుషుల జావెలిన్ త్రోలో దీపాన్షు శర్మ స్వర్ణం గెలుచుకున్నాడు. -
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
T20 Worldcup 2024 - BCCI: వచ్చే టీ20 ప్రపంచకప్ కోసం ఏ 15 మందిని ఎంపిక చేస్తే బాగుంటుంది. -
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
ఐపీఎల్లో ఫినిషర్గా అదరగొడుతున్న ఎంఎస్ ధోనీ (MS Dhoni)ని టీ20 వరల్డ్కప్నకు ఎంపిక చేయాలనే ఆలోచనను పలువురు మాజీలు కోరుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
-
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!