PV Sindhu:రెండేళ్ల దాహం తీరిన వేళ.. సయ్యద్‌ మోదీ టోర్నీ ఫైనల్లో సింధు విజయం

అంతర్జాతీయ టైటిళ్ల కరవుకు పీవీ సింధు ముగింపు పలికింది. సయ్యద్‌ మోదీ అంతర్జాతీయ బ్యాడ్మింటన్‌ సూపర్‌ 300 టోర్నీ ఫైనల్లో విజయం సాధించింది......

Updated : 23 Jan 2022 17:21 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సయ్యద్‌ మోదీ అంతర్జాతీయ బ్యాడ్మింటన్‌ సూపర్‌ 300 టోర్నీ ఫైనల్లో పీవీ సింధు విజయం సాధించింది. ఆదివారం లఖ్‌నవూలో జరిగిన ఫైనల్‌ పోరులో భారత్‌కే చెందిన యువ క్రీడాకారిణి మాళవిక బన్సోద్‌ను వరుస సెట్లలో ఓడించి టైటిల్‌ను కైవసం చేసుకుంది. మ్యాచ్‌ ఆసాంతం దూకుడుగా ఆడిన సింధు మొదటి సెట్‌ను 21-13, రెండో సెట్‌ను 21-16తో గెలుపొంది. కేవలం 35 నిమిషాల్లోనే సింధు ఈ పోరును ముగించడం విశేషం.

సింధుకు ఇది రెండో సయ్యద్ మోదీ ట్రోఫీ. మొదట 2017లో ఈ టైటిట్‌ చేజిక్కించుకుంది. 2019లో గ్లాస్గోలో జరిగిన ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో బంగారు పతకం సాధించిన తర్వాత.. మరే అంతర్జాతీయ పోరులోనూ సింధుకు టైటిల్‌ దక్కలేదు. సింధు గతేడాది వరల్డ్ టూర్ ఫైనల్స్‌లో రన్నరప్‌గా నిలిచింది. ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో క్వార్టర్ ఫైనల్లోనే వెనుదిరిగింది. దాదాపు రెండేళ్ల తర్వాత సింధుకు ఇదే మొదటి టైటిల్.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని