T20 Challenge : స్మృతీ మంధాన టీమ్‌ చేతిలో ఓడినా.. ఫైనల్‌కు చేరిన దీప్తి శర్మ జట్టు

హిళల టీ20 ఛాలెంజ్‌ పోటీల్లో దీప్తి శర్మ టీమ్‌పై స్మృతీ మంధాన జట్టు 16 పరుగుల తేడాతో విజయం సాధించింది. అయినా రన్‌రేట్ ఆధారంగా..

Published : 26 May 2022 23:31 IST

పుణె: మహిళల టీ20 ఛాలెంజ్‌ పోటీల్లో దీప్తి శర్మ టీమ్‌పై స్మృతీ మంధాన జట్టు 16 పరుగుల తేడాతో విజయం సాధించింది. అయినా రన్‌రేట్ ఆధారంగా దీప్తి శర్మ జట్టే ఫైనల్‌కు చేరుకుంది. తొలుత బ్యాటింగ్‌ చేసిన స్మృతీ మంధాన టీమ్‌ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది. అనంతరం దీప్తి శర్మ జట్టు 174/9 స్కోరుకే పరిమితమై ఓటమిపాలైంది. కిరణ్‌ నవ్‌గిరే (69) అర్ధశతకం సాధించాడు. షఫాలీ వర్మ 29, యస్తిక భాటియా 19, లారా వాల్వొర్డ్‌ 17, దీప్తి శర్మ 2, స్నేహ్‌ రాణా 11, రాధా యాదవ్ 2, సిమ్రన్‌ బహదుర్‌, కేట్ క్రాస్‌, నాథకన్ చంతమ్‌ 3 పరుగులు చేశారు. స్మృతీ మంధాన జట్టు  బౌలర్లలో రాజేశ్వరి గైక్వాడ్ 2, పూనమ్‌ యాదవ్‌2.. రేణుక సింగ్‌, హేలీ మ్యాథ్యూస్, సల్మా ఖాతున్, సోఫియా తలో వికెట్ తీశారు. మే 28న హర్మన్‌ ప్రీత్‌ టీమ్‌తో దీప్తి శర్మ జట్టు ఫైనల్‌లో తలపడనుంది.

రోడ్రిగ్స్‌, మేఘన వీర విహారం

అంతకుముందు టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన స్మృతీ మంధాన టీమ్‌ దూకుడుగా ఆడింది. కెప్టెన్‌ స్మృతీ మంధాన (1) విఫలమైనా సబ్బినేని మేఘన (73), రోడ్రిగ్స్‌ (66) వీరవిహారం చేశారు. వీరిద్దరూ రెండో వికెట్‌కు 113 పరుగులను జోడించారు. ఆ తర్వాత వచ్చిన హేలే మ్యాథ్యూస్ (27), డంక్‌లే (19) ధాటిగా ఆడారు. దీంతో ఐదు వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది. దీప్తి శర్మ జట్టు బౌలర్లలో సిమ్రన్ బహదుర్‌ 2.. కేట్ క్రాస్, స్నేహ్‌ రాణా, ఖాకా తలో వికెట్ తీశారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని