Rajasthan vs Bangalore: రాణించిన దినేశ్ కార్తిక్, షాబాజ్ అహ్మద్.. రాజస్థాన్ జోరుకి కళ్లెం
టీ20 మెగా టోర్నీలో రాజస్థాన్ జోరుకి.. బెంగళూరు కళ్లెం వేసింది. వాంఖడే స్టేడియం వేదికగా జరిగిన మ్యాచులో నాలుగు వికెట్ల తేడాతో గెలుపొందింది...
ఇంటర్నెట్ డెస్క్ : టీ20 మెగా టోర్నీలో రాజస్థాన్ జోరుకి.. బెంగళూరు కళ్లెం వేసింది. వాంఖడే స్టేడియం వేదికగా జరిగిన మ్యాచులో నాలుగు వికెట్ల తేడాతో గెలుపొందింది. రాజస్థాన్ నిర్దేశించిన 170 పరుగుల లక్ష్యాన్ని 19.1 ఓవర్లలోనే ఛేదించింది. బెంగళూరు విజయంలో దినేశ్ కార్తిక్ (44* : 23 బంతుల్లో 7×4, 1×6), షాబాజ్ అహ్మద్ (45 : 26 బంతుల్లో 4×4, 3×6) కీలకంగా వ్యవహరించారు. కెప్టెన్ డు ప్లెసిస్ (29), ఓపెనర్ అనుజ్ రావత్ (26) పరుగులతో బెంగళూరు జట్టుకి శుభారంభాన్నందించారు. విరాట్ కోహ్లీ (5), రూథర్ ఫోర్డ్ (5) విఫలమవగా.. డేవిడ్ విల్లే (0) డకౌటయ్యాడు. ఆఖర్లో వచ్చిన హర్షల్ పటేల్ (9*) పరుగులు చేశాడు. రాజస్థాన్ బౌలర్లలో యుజ్వేంద్ర చాహల్, ట్రెంట్ బౌల్ట్ చెరో రెండు, నవదీప్ సైని ఓ వికెట్ పడగొట్టారు.
దూకుడుగా ఆడుతున్న దినేశ్ కార్తిక్..
స్వల్ప వ్యవధిలో కీలక వికెట్లు కోల్పోయిన బెంగళూరు జట్టు.. 15 ఓవర్లు పూర్తయ్యే సరికి 125/5 స్కోరుతో నిలిచింది. 11వ ఓవర్లో చాహల్ మూడు పరుగులు ఇవ్వగా.. ఆ తర్వాతి ఓవర్లో షాబాజ్ అహ్మద్ (20) ఓ ఫోర్, ఓ సిక్స్ బాదాడు. ట్రెంట్ బౌల్ట్ వేసిన 13వ ఓవర్లో రూథర్ ఫోర్డ్ (5).. నవదీప్ సైనికి చిక్కి క్రీజు వీడాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన దినేశ్ కార్తిక్ దూకుడుగా ఆడుతున్నాడు. అశ్విన్ వేసిన 14వ ఓవర్లో ఓ సిక్స్, మూడు ఫోర్లు బాదాడు. దీంతో ఈ ఒక్క ఓవర్లోనే 21 పరుగులు వచ్చాయి. నవదీప్ సైని వేసిన 15వ ఓవర్లోనూ దినేశ్ కార్తిక్ (31) మరో రెండు ఫోర్లు బాదగా.. ఆఖరి బంతికి షాబాజ్ ఫోర్ కొట్టాడు. బెంగళూరు విజయానికి ఇంకా 45 పరుగుల దూరంలో ఉంది.
కీలక వికెట్లు కోల్పోయిన బెంగళూరు..
రాజస్థాన్ బౌలర్లు పుంజుకుంటున్నారు. ధాటిగా ఆడుతున్న బెంగళూరు బ్యాటర్లను కట్టడి చేస్తున్నారు. యుజ్వేంద్ర చాహల్ వేసిన ఏడో ఓవర్లో ఆఖరు బంతికి కెప్టెన్ డు ప్లెసిస్ (29) బౌల్ట్కి చిక్కగా.. నవదీప్ సైని వేసిన తర్వాతి ఓవర్లో ఆఖరు బంతికి మరో ఓపెనర్ అనుజ్ రావత్ (26).. సంజూ శాంసన్కి క్యాచ్ ఇచ్చి క్రీజు వీడాడు. యుజ్వేంద్ర చాహల్ తొమ్మిదో ఓవర్లో నాలుగో బంతికి కోహ్లీ (5) రనౌట్ కాగా.. ఐదో బంతికి డేవిడ్ విల్లే (0) డకౌటయ్యాడు. పదో ఓవర్లో ఆరు పరుగులు వచ్చాయి. రూథర్ ఫోర్డ్ (2), షాబాజ్ అహ్మద్ (1) క్రీజులో ఉన్నారు. దీంతో పది ఓవర్లకు 68/4 స్కోరుతో నిలిచింది.
పవర్ ప్లే పూర్తి..
ఛేదనకు దిగిన బెంగళూరు బ్యాటర్లు ధాటిగా ఆడుతున్నారు. దీంతో పవర్ ప్లే పూర్తయ్యే సరికి బెంగళూరు 48/0 స్కోరుతో నిలిచింది. అశ్విన్ వేసిన నాలుగో ఓవర్లో డు ప్లెసిస్ (24) ఓ ఫోర్ బాదగా.. ఆ తర్వాతి ఓవర్లో అనుజ్ రావత్ (22) మరో ఫోర్ బాదాడు. ఆరో ఓవర్లో 8 పరుగులు వచ్చాయి.
ఛేదనకు దిగిన బెంగళూరు బ్యాటర్లు..
రాజస్థాన్ నిర్దేశించిన లక్ష్యాన్ని ఛేదించేందుకు బెంగళూరు బరిలోకి దిగింది. తొలి ఓవర్లో ట్రెంట్ బౌల్ట్ మూడే పరుగులు ఇచ్చాడు. ప్రసిద్ధ్ కృష్ణ వేసిన ఆ తర్వాతి ఓవర్లో ఆఖరి రెండు బంతులను అనుజ్ రావత్ (14) బౌండరీకి తరలించాడు. మూడో తొలి బంతిని డు ప్లెసిస్ (14) బౌండరీకి తరలించగా.. అనుజ్ మరో రెండు ఫోర్లు బాదాడు. దీంతో మూడు ఓవర్లు పూర్తయ్యే సరికి బెంగళూరు 28/0 స్కోరుతో నిలిచింది.
ఆఖర్లో దంచికొట్టిన జోస్ బట్లర్.. బెంగళూరు టార్గెట్ ఫిక్స్..
రాజస్థాన్ బ్యాటింగ్ ముగిసింది. నిర్ణీత ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 169 పరుగులు చేసింది. బెంగళూరు ముందు 170 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. రాజస్థాన్ బ్యాటర్లలో ఓపెనర్ జోస్ బట్లర్ (70*: 47 బంతుల్లో 6×6) అర్ధ శతకంతో రాణించగా..షిమ్రోన్ హెట్మయర్ (42*) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. దేవ్దత్ పడిక్కల్ (37 : 29 బంతుల్లో 2×4, 2×6) పరుగులు చేయగా.. ఓపెనర్ యశస్వీ జైస్వాల్ (4), కెప్టెన్ సంజూ శాంసన్ (8) విఫలమయ్యారు. బెంగళూరు బౌలర్లలో డేవిడ్ విల్లే, వనిందు హసరంగ, హర్షల్ పటేల్ తలో వికెట్ పడగొట్టారు.
కీలక వికెట్లు కోల్పోయిన రాజస్థాన్.. పుంజుకుంటున్న బెంగళూరు బౌలర్లు..
బెంగళూరు బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేస్తుండటంతో రాజస్థాన్ స్వల్ప వ్యవధిలో కీలక వికెట్లు కోల్పోయింది. పదో ఓవర్లో దేవ్దత్ పడిక్కల్ ఔట్ కాగా.. వనిందు హసరంగ వేసిన 12వ ఓవర్లో కెప్టెన్ సంజూ శాంసన్ (8) రిటర్న్ క్యాచ్ ఇచ్చి క్రీజు వీడాడు. ఆ తర్వాతి ఓవర్లో హర్షల్ పటేల్ మూడే పరుగులు ఇచ్చాడు. హసరంగ వేసిన 14వ ఓవర్లో షిమ్రోన్ హెట్మయర్ (11) వరుసగా రెండు ఫోర్లు బాదాడు. 15వ ఓవర్లో నాలుగు పరుగులు వచ్చాయి. ఓపెనర్ జోస్ బట్లర్ (37) క్రీజులో ఉన్నాడు. దీంతో 15 ఓవర్లు ముగిసే సరికి రాజస్థాన్ మూడు వికెట్లు కోల్పోయి 103 పరుగులు చేసింది.
ధాటిగా ఆడుతున్న రాజస్థాన్ బ్యాటర్లు..
ఆరంభంలో ఆచితూచి ఆడిన రాజస్థాన్ బ్యాటర్లు పవర్ ప్లే పూర్తయ్యాక కాస్త వేగం పెంచారు. ఆకాశ్ దీప్ వేసిన ఏడో ఓవర్లో ఐదో బంతిని ఓపెనర్ జోస్ బట్లర్ (31) భారీ సిక్సర్గా మలుచగా.. ఆ తర్వాతి ఓవర్లో దేవ్దత్ పడిక్కల్ ఓ ఫోర్, ఓ సిక్స్ బాదాడు. వనిందు హసరంగ వేసిన తొమ్మిదో ఓవర్లో ఆఖరు బంతికి బట్లర్ మరో సిక్స్ బాదాడు. పదో ఓవర్లో ఆఖరు బంతిని భారీ సిక్సర్గా మలిచేందుకు ప్రయత్నించిన దేవ్దత్ పడిక్కల్ (37) కోహ్లీకి చిక్కి క్రీజు వీడాడు. దీంతో 10 ఓవర్లు పూర్తయ్యే సరికి రాజస్థాన్ 76/2 స్కోరుతో నిలిచింది.
పవర్ ప్లే పూర్తి.. రాజస్థాన్ స్కోరెంతంటే.?
పవర్ ప్లే పూర్తయ్యే సరికి రాజస్థాన్ 35/1 స్కోరుతో నిలిచింది. డేవిడ్ విల్లే వేసిన నాలుగో ఓవర్లో ఆఖరు బంతిని దేవ్దత్ పడిక్కల్ (19) బౌండరీకి తరలించాడు. ఆ తర్వాతి ఓవర్లో ఐదే పరుగులు వచ్చాయి. ఆరో ఓవర్లోనూ డేవిడ్ ఐదే పరుగులు ఇచ్చాడు. జోస్ బట్లర్ (10) క్రీజులో ఉన్నాడు.
కట్టుదిట్టంగా బెంగళూరు బౌలింగ్.. రాజస్థాన్ తొలి వికెట్ డౌన్..
టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన రాజస్థాన్ జట్టుకు ఆరంభంలోనే భారీ షాక్ తగిలింది. డేవిడ్ విల్లే వేసిన రెండో ఓవర్లో ఐదో బంతికి ఓపెనర్ యశస్వీ జైస్వాల్ (4) బౌల్డయ్యాడు. అంతకు ముందు తొలి ఓవర్లో మహమ్మద్ సిరాజ్ రెండే పరుగులు ఇచ్చాడు. మూడో ఓవర్లో మూడో బంతిని దేవ్దత్ పడిక్కల్ (9) సిక్స్గా మలిచాడు. జోస్ బట్లర్ (3) క్రీజులో ఉన్నాడు. దీంతో మూడు ఓవర్లు పూర్తయ్యే సరికి రాజస్థాన్ ఒక వికెట్ కోల్పోయి 17 పరుగులు చేసింది.
టాస్ నెగ్గిన బెంగళూరు.. రాజస్థాన్ జోరుకు అడ్డుకట్టవేసేనా.?
టీ20 మెగా టోర్నీలో భాగంగా మరి కాసేపట్లో రాజస్థాన్, బెంగళూరు జట్లు తలపడనున్నాయి. టాస్ గెలిచిన బెంగళూరు కెప్టెన్ డు ప్లెసిస్ బౌలింగ్ ఎంచుకున్నాడు. రాజస్థాన్కు బ్యాటింగ్ అప్పగించాడు. ఇప్పటి వరకు ఆడిన రెండు మ్యాచుల్లో గెలుపొందిన రాజస్థాన్ జట్టు.. ఈ మ్యాచులోనూ అదే ఊపును కొనసాగించాలనుకుంటోంది. మరోవైపు, బెంగళూరు ఆడిన రెండు మ్యాచుల్లో.. ఓ దాంట్లో గెలుపొంది మరో దాంట్లో ఓటమి పాలైంది. ఈ నేపథ్యంలో రాజస్థాన్ జట్టును బెంగళూరు అడ్డుకుంటుందేమో చూడాలి.! ముంబయిలోని వాంఖడే స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరుగనుంది.
తుది జట్ల వివరాలు..
రాజస్థాన్ : జోస్ బట్లర్, యశస్వీ జైస్వాల్, సంజూ శాంసన్ (కెప్టెన్, వికెట్ కీపర్), దేవ్దత్ పడిక్కల్, షిమ్రోన్ హెట్మయర్, రియాన్ పరాగ్, రవిచంద్రన్ అశ్విన్, నవదీప్ సైని, ట్రెంట్ బౌల్ట్, యుజ్వేంద్ర చాహల్, ప్రసిద్ధ్ కృష్ణ
బెంగళూరు : డు ప్లెసిస్ (కెప్టెన్), అనుజ్ రావత్, విరాట్ కోహ్లీ, దినేశ్ కార్తిక్ (వికెట్ కీపర్), షెర్ఫేన్ రూథర్ ఫోర్డ్, షాబాజ్ అహ్మద్, వనిందు హసరంగ, డేవిడ్ విల్లే, హర్షల్ పటేల్, ఆకాశ్ దీప్, మహమ్మద్ సిరాజ్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారత్లో న్యూజిలాండ్ క్రికెట్ ప్రసార హక్కులు ఎస్పీఎన్ఐ సొంతం
న్యూజిలాండ్ పురుషుల (బ్లాక్ క్యాప్స్), మహిళల (వైట్ ఫెర్న్స్) క్రికెట్ జట్ల మ్యాచ్లను వచ్చే ఏడేళ్ల పాటు భారత్, అనుబంధ ప్రాంతాల్లో ప్రసారం చేసేందుకు సోనీ పిక్చర్స్ నెట్వర్క్ ఇండియా (ఎస్పీఎన్ఐ) టెలివిజన్, డిజిటల్ హక్కులను సొంతం చేసుకుంది. -
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు జరిగింది. ముజీబ్ స్థానంలో అల్లాహ్ ఘజన్ఫర్, ప్రసీధ్ కృష్ణ స్థానంలో కేశవ్ మహరాజ్ జట్టులోకి వచ్చారు. -
రసవత్తరంగా సాగుతున్న మెగా లీగ్.. తొలి రోజు వీక్షణల్లోనూ రికార్డే
దాదాపు రెండు నెలలపాటు క్రికెట్ అభిమానులను అలరించే ఐపీఎల్.. రికార్డులను ఖాతాలో వేసుకుంటోంది. -
‘హార్దిక్ కెప్టెన్సీ దారుణం’.. సోషల్ మీడియా యూజర్ వ్యాఖ్యలకు భారత మాజీ క్రికెటర్ కౌంటర్
రోహిత్ స్థానంలో హార్దిక్ పాండ్యను ముంబయి మేనేజ్మెంట్ కెప్టెన్గా నియమించుకుంది. దీంతో సోషల్ మీడియాలో ఆ ఫ్రాంచైజీపై ట్రోలింగ్ వచ్చింది. ఇప్పుడు ముంబయి వరుసగా రెండు మ్యాచుల్లో ఓడిపోవడంతో పాండ్య సారథ్యంపై విమర్శల దాడి ఎక్కువైంది. -
రషీద్ బౌలింగ్లో సిక్స్లు.. ధోనీ సలహాలు పాటించా: సమీర్ రిజ్వీ
తన అభిమాన క్రికెటర్తో కలిసి డ్రెస్సింగ్ రూమ్ పంచుకోవడం ఎప్పటికీ మరిచిపోలేనని చెన్నై ఆటగాడు సమీర్ రిజ్వీ వ్యాఖ్యానించాడు. -
గత సీజన్లో విదేశీ క్రికెటర్లకు ఆ కోచ్ తీరు నచ్చలేదు: కోల్కతా మాజీ ఆటగాడు
కోల్కతా ప్రధాన కోచ్ చంద్రకాంత్ పండిత్ వల్ల చాలామంది విదేశీ క్రికెటర్లు ఇబ్బందిపడ్డారని నమీబియా క్రికెటర్ వ్యాఖ్యానించడం సంచలనమైంది. -
మా బౌలర్ల తప్పేమీ లేదు.. హైదరాబాద్ బ్యాటర్లకు హ్యాట్సాఫ్: హార్దిక్ పాండ్య
ముంబయి బౌలర్లు భారీగా పరుగులు ఇవ్వడంతో హైదరాబాద్ రికార్డు స్కోరును నమోదు చేసి చరిత్ర సృష్టించింది. దీంతో ఐపీఎల్ 17వ సీజన్లో తొలి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. -
‘అత్యంత సంతోషకరమైన వ్యక్తి ఆమె’.. నెట్టింట వైరల్గా మారిన కావ్యా మారన్
కావ్యా మారన్.. సన్రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ యజమాని. ముంబయితో జరిగిన మ్యాచ్లో హైదరాబాద్ భారీ స్కోరు సాధించడంతో ఆమె ఒక్కసారిగా నెట్టింట వైరల్గా మారారు. -
ముంబయి లక్ష్య ఛేదన దిశగా వస్తుందని భావించారా? ప్యాట్ కమిన్స్ సమాధానమిదే!
ఐపీఎల్ 17వ సీజన్లో హైదరాబాద్ బోణీ కొట్టింది. ఉప్పల్ వేదికగా జరిగిన మ్యాచ్లో ముంబయిని చిత్తు చేసింది. -
హైదరాబాద్, ముంబయి మ్యాచ్లో నమోదైన రికార్డులివీ..
ఉప్పల్ వేదికగా ముంబయితో జరిగిన మ్యాచ్లో హైదరాబాద్ 31 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్లో పలు రికార్డులు నమోదు అయ్యాయి. -
ఉప్పల్ ఊగిపోయింది
ఐపీఎల్ చరిత్రలో నిలిచిపోయే మ్యాచ్లో సన్రైజర్స్ అద్వితీయమైన బ్యాటింగ్తో అదరగొట్టింది. బ్యాటర్లు మెషీన్ గన్నుల్లా పేలడంతో ఐపీఎల్లో రికార్డు స్కోరుతో సత్తాచాటింది. తొలి మ్యాచ్లో త్రుటిలో ఓడినా.. రెండో పోరులో చిరస్మరణీయ విజయం అందుకుంది. -
ఇది సన్రైజర్సేనా?
సన్రైజర్స్ అంటే.. నత్తనడక బ్యాటింగ్కు మారు పేరు! సన్రైజర్స్ బ్యాటర్లది.. స్ట్రైక్రేట్లో ఎప్పుడూ వెనుకంజే! సన్రైజర్స్ మెరుపులన్నీ బౌలింగ్ వరకే! కానీ ఇదంతా పాత కథ! -
సింధు శుభారంభం
మాడ్రిడ్ స్పెయిన్ మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు శుభారంభం చేసింది. -
సెమీస్లో బోపన్న జోడీ
44 ఏళ్ల వయసులోనూ అద్భుతమైన ఆటతీరుతో అదరగొడుతున్న భారత టెన్నిస్ వెటరన్ డబుల్స్ స్టార్ రోహన్ బోపన్న మరో టైటిల్ దిశగా సాగుతున్నాడు. -
ఎఫ్ఐహెచ్ అథ్లెట్ల కమిటీలో శ్రీజేష్
అంతర్జాతీయ హాకీ సమాఖ్య నూతన ఎఫ్ఐహెచ్ అథ్లెట్ల కమిటీ సహ అధ్యక్షుడిగా భారత హాకీ వెటరన్ గోల్కీపర్ శ్రీజేష్ నియమితుడయ్యాడు. -
‘ఇంపాక్ట్ ప్లేయర్’ వల్లే ధోని అలా..
కెప్టెన్సీ నుంచి తప్పుకొన్నాడు. ఆటగాడిగా కూడా ఇదే చివరి సీజన్ అని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో మహేంద్ర ధోని బ్యాటు పట్టి కొన్ని మెరుపులు మెరిపిస్తే చూడాలన్నది అభిమానుల ఆశ. -
కోచ్కు జకోవిచ్ టాటా
కోచ్ గోరాన్ ఇవానిసెవిచ్తో ఆరేళ్ల బంధానికి జకోవిచ్ వీడ్కోలు పలికాడు. 2018లో ఇవానిసెవిచ్తో కలిసి జకోవిచ్ ప్రయాణం ప్రారంభించాడు. -
సచిన్ గోల్ఫాట
క్రికెట్ దిగ్గజం సచిన్ తెందుల్కర్ గోల్ఫ్ స్టిక్ చేతబట్టాడు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని బౌల్డర్హిల్స్ క్లబ్లో బుధవారం గోల్ఫ్ ఆడాడు. -
భారత్-పాక్ సిరీస్.. ఆసీస్ ఆసక్తి
భారత్, పాకిస్థాన్ మధ్య ద్వైపాక్షిక టెస్టు సిరీస్కు ఆతిథ్యమివ్వడానికి ఆస్ట్రేలియా మరోసారి ఆసక్తి వ్యక్తం చేసింది. -
ముంబయిలో హార్దిక్కు మరింతగా..
రోహిత్ శర్మ స్థానంలో ముంబయి ఇండియన్స్ కెప్టెన్గా ఎంపికైన హార్దిక్ పాండ్యకు సామాజిక మాధ్యమాల్లోనే కాదు మైదానాల్లోనూ తీవ్ర వ్యతిరేకత తప్పడం లేదు. -
మళ్లీ బాబర్కే పగ్గాలు!
పాకిస్థాన్ క్రికెట్ జట్టు పగ్గాలు మళ్లీ బాబర్ అజామ్ చేతికి దక్కే సూచనలు కనిపిస్తున్నాయి. అతణ్ని మరోసారి జట్టు కెప్టెన్గా నియమించేందుకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఆసక్తితో ఉన్నట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు (Latest News)
-
బెంగళూరు కేఫ్ పేలుడు ఘటన.. కీలక కుట్రదారు అరెస్ట్!
-
వరంగల్ జకోటియ షాపింగ్ కాంప్లెక్స్లో భారీ అగ్ని ప్రమాదం
-
కేజ్రీవాల్పై వ్యాఖ్యలు.. మరోసారి అమెరికాకు భారత్ కౌంటర్
-
ఆ మాజీ సీఎం తనయుడి ఆస్తి ₹700 కోట్లు.. సొంత వాహనం లేదు!
-
రిటైల్ బ్రాండ్ల చూపు.. ఆలయ నగరాల వైపు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM