T20 League: టీ20 లీగ్‌ ఫైనల్‌ సందడి.. అతిథులు ఎవరంటే?

టీ20 లీగ్‌ తుది దశకు చేరుకుంది. ఈ ఆదివారమే అహ్మదాబాద్‌ వేదికగా ఫైనల్‌ మ్యాచ్‌ జరగనుంది. కరోనా కారణంగా గత రెండు సీజన్లలో ముగింపు వేడుకలు నిర్వహించలేదు. ప్రస్తుతం కొవిడ్ తగ్గుముఖం పడటంతో ఈ సీజన్‌లో ముగింపు వేడుకలు

Published : 27 May 2022 22:14 IST

ఇంటర్నెట్ డెస్క్: టీ20 లీగ్‌ తుది దశకు చేరుకుంది. ఈ ఆదివారమే అహ్మదాబాద్‌ వేదికగా ఫైనల్‌ మ్యాచ్‌ జరగనుంది. కరోనా కారణంగా గత రెండు సీజన్లలో ముగింపు వేడుకలు నిర్వహించలేదు. ప్రస్తుతం కొవిడ్ తగ్గుముఖం పడటంతో ఈ సీజన్‌లో ముగింపు వేడుకలు నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించింది. ఆదివారం జరిగే సెలబ్రేషన్స్‌లో బాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ రణ్‌వీర్‌ సింగ్‌, సంగీత దర్శకుడు ఎ.ఆర్‌. రెహమన్‌ పాల్గొననున్నారు. రణ్‌వీర్‌ సింగ్‌ ఓ పాటకు డ్యాన్స్‌ చేయనున్నాడు. ముగింపు వేడుకల కారణంగా ఫైనల్‌ మ్యాచ్‌ అరగంట ఆలస్యంగా ప్రారంభం కానుంది. అంటే, రాత్రి 8 గంటలకు మ్యాచ్‌ ఆరంభం అవుతుంది. ఇక, లీగ్‌ విషయానికొస్తే క్వాలిఫయర్‌-1లో రాజస్థాన్‌ను ఓడించి గుజరాత్‌ తుది పోరుకు అర్హత సాధించింది. క్వాలిఫయర్‌-2లో విజేతగా నిలిచిన జట్టు గుజరాత్‌తో టైటిల్‌ పోరులో తలపడుతుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని