
T20 League : అలెర్ట్.. టీ20 లీగ్ ఫైనల్ మ్యాచ్ సమయం మారింది!
ఇంటర్నెట్ డెస్క్: టీ20 లీగ్ తుది దశకు చేరుకుంది. ఇక లీగ్ స్థాయిలో కేవలం మరో నాలుగు మ్యాచ్లు మాత్రమే ఉన్నాయి. ఆ తర్వాత క్వాలిఫయర్ -1, ఎలిమినేటర్, క్వాలిఫయర్-2 మ్యాచ్లు జరుగుతాయి. ఇక మే 29న టీ20 లీగ్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే రెండు జట్లు గుజరాత్, లఖ్నవూ ప్లేఆఫ్స్కు చేరుకోగా.. మిగిలిన స్థానాల కోసం ఐదు జట్లు పోటీ పడుతున్నాయి. రాజస్థాన్ కాస్త ముందు వరుసలో ఉండగా.. దిల్లీ, బెంగళూరు ఆ తర్వాత ఉన్నాయి. అయితే పంజాబ్, హైదరాబాద్ అవకాశాలు ఇతర జట్ల ఫలితాల మీద ఆధారపడి ఉన్నాయి.
ఈ క్రమంలో ఫైనల్ మ్యాచ్కు సంబంధించి కొత్త అప్డేట్ వచ్చింది. ప్రస్తుతం మ్యాచ్ల్లో కొన్ని మధ్యాహ్నం 3.30 గంటలకు, రాత్రి 7.30 గంటలకు ప్రారంభమవుతున్నాయి కదా.. అయితే ఫైనల్ మ్యాచ్ మాత్రం రాత్రి 8 గంటలకు మొదలవుతుందని బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి. అంటే టాస్ 7.30 గంటలకు వేసి అర్ధ గంట తర్వాత మ్యాచ్ను స్టార్ట్ చేస్తారు. ఫైనల్ మ్యాచ్ అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనుంది. ముగింపు సంబరాలను అద్భుతంగా నిర్వహించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
‘‘మెగా టీ20 టోర్నీ ముగింపు ఉత్సవాలను 40 నిమిషాలపాటు నిర్వహించేందుకుగాను ఫైనల్ మ్యాచ్ను కాస్త ఆలస్యంగా ప్రారంభిస్తాం. గత రెండేళ్లుగా కొవిడ్ కారణంగా ఎలాంటి ఉత్సవాలు లేకుండానే నిర్వహించాం. అందుకే ఈసారి సంబరాలను పెద్ద ఎత్తున చేయాలని సంకల్పించాం’’ అని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. రణ్వీర్ సింగ్, ఏఆర్ రెహ్మాన్ సంగీత కార్యక్రమాలు ఉంటాయి. అదేవిధంగా స్వాతంత్ర్య వచ్చి 75 ఏళ్లు అయిన సందర్భంగానూ ప్రత్యేకంగా నిలిచేలా గత ఏడు దశాబ్దాలుగా భారత క్రికెట్ ప్రయాణాన్ని బీసీసీఐ ఆవిష్కరించనుంది. దీని కోసం కొన్ని వారాల కిందట బిడ్లను కూడా ఆహ్వానించిన విషయం తెలిసిందే. అలానే దక్షిణాఫ్రికాతో జరిగే ఐదు టీ20 సిరీస్కు వందశాతం ప్రేక్షకులను బీసీసీఐ అనుమతి ఇచ్చినట్లు సమాచారం. జూన్ 9 నుంచి జూన్ 19వ తేదీ వరకు సౌతాఫ్రికాతో భారత్ టీ20 ల్లో తలపడనుంది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
Atmakur bypoll: ఆత్మకూరులో కొనసాగుతోన్న ఓట్ల లెక్కింపు
-
General News
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
Related-stories News
National News: భార్యకు కానుకగా చంద్రుడిపై స్థలం
-
Ts-top-news News
Telangana News: ఆ విద్యార్థుల సర్దుబాటు బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే
-
Related-stories News
Indian railways: నాలుగు రైళ్లు 24 రోజుల పాటు రద్దు
-
Ap-top-news News
AP sachivalayam: జులై 1 నుంచి ప్రొబేషన్
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Weekly Horoscope : రాశిఫలం ( జూన్ 26 - జులై 02 )
- మా ఆయన కోసం సల్మాన్ఖాన్ని వదులుకున్నా!
- Actor Sai kiran: మోసం చేశారంటూ పోలీస్స్టేషన్లో సినీ నటుడు సాయికిరణ్ ఫిర్యాదు
- AP Liquor: మద్యంలో విషం
- ప్రశ్నించానని పాలు, నీళ్లు లేకుండా చేశారు
- New Labour codes: వారానికి 4 రోజులే పని.. తగ్గనున్న చేతికొచ్చే వేతనం.. జులై 1 నుంచి కొత్త రూల్స్..!
- Rohit Sharma: టీమ్ఇండియాకు షాక్.. రోహిత్ శర్మకు కరోనా
- Yuvraj Singh - RaviShastri: ఆరోజు యువరాజ్ ఐదో సిక్సర్ కొట్టగానే..: రవిశాస్త్రి
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (26-06-2022)
- Amaravathi: రాజధాని భూముల అమ్మకం