Delhi vs Bangalore : ఛేదనలో తడబడిన దిల్లీ.. బెంగళూరు ఖాతాలో మరో విజయం..
టీ20 మెగా టోర్నీలో బెంగళూరు జట్టు మరో విజయం సాధించింది. దిల్లీతో జరిగిన మ్యాచులో 16 పరుగుల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు 5 వికెట్లు కోల్పోయి 189 పరుగులు చేసింది...
ఇంటర్నెట్ డెస్క్ : టీ20 మెగా టోర్నీలో బెంగళూరు జట్టు మరో విజయం సాధించింది. దిల్లీతో జరిగిన మ్యాచులో 16 పరుగుల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు 5 వికెట్లు కోల్పోయి 189 పరుగులు చేసింది. అనంతరం ఛేదనకు దిగిన దిల్లీ తడబడింది. నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 173 పరుగులకే పరిమితమైంది. బెంగళూరుకిది నాలుగో విజయం కాగా.. దిల్లీకి మూడో ఓటమి. దిల్లీ బ్యాటర్లలో ఓపెనర్ డేవిడ్ వార్నర్ (66 : 38 బంతుల్లో 4×4, 5×6) అర్ధ శతకంతో రాణించగా.. కెప్టెన్ రిషభ్ పంత్ (34) ఫర్వాలేదనిపించాడు. శార్దూల్ ఠాకూర్ (17), ఓపెనర్ పృథ్వీ షా (16), మిచెల్ మార్ష్ (14), రోమన్ పావెల్ (0), లలిత్ యాదవ్ (1) విఫలమయ్యారు. అక్షర్ పటేల్ (10), కుల్దీప్ యాదవ్ (10) నాటౌట్గా నిలిచారు. బెంగళూరు బౌలర్లలో జోష్ హేజిల్ వుడ్ మూడు, మహమ్మద్ సిరాజ్ రెండు వికెట్లు తీయగా.. వనిందు హసరంగ ఓ వికెట్ పడగొట్టాడు.
బెంగళూరు బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేస్తూ దిల్లీపై ఒత్తిడి పెంచుతున్నారు. ధాటిగా ఆడుతున్న ఓపెనర్ డేవిడ్ వార్నర్ (66).. హసరంగ వేసిన 12వ ఓవర్లో ఎల్బీగా వెనుదిరిగాడు. ఆ తర్వాతి ఓవర్లో సిరాజ్ ఐదే పరుగులు ఇచ్చాడు. 14వ ఓవర్లో కెప్టెన్ రిషభ్ పంత్ (15*) రెండు ఫోర్లు కొట్టాడు. ఆఖరు బంతికి మిచెల్ మార్ష్ (14) రనౌటయ్యాడు. జోష్ హేజిల్వుడ్ వేసిన 15వ ఓవర్ తొలి బంతికి రోమన్ పావెల్ (0).. కీపర్కి చిక్కాడు. ఆఖరు బంతికి లలిత్ యాదవ్ (1).. భారీ షాట్కు ప్రయత్నించి ప్రభుదేశాయ్కి క్యాచ్ ఇచ్చి క్రీజు వీడాడు. దీంతో 15 ఓవర్లు పూర్తయ్యే సరికి దిల్లీ 115/5 స్కోరుతో నిలిచింది. దిల్లీ విజయానికి ఇంకా 30 బంతుల్లో 75 పరుగులు కావాల్సి ఉంది.
దిల్లీ బ్యాటర్లు వికెట్ కాపాడుకుంటూ జాగ్రత్తగా ఆడుతున్నారు. ఏడో ఓవర్లో హర్షల్ పటేల్ ఐదే పరుగులు ఇచ్చాడు. హసరంగ వేసిన ఎనిమిదో ఓవర్లో ఓ సిక్స్ బాదిన డేవిడ్ వార్నర్ (54).. ఆ తర్వాతి ఓవర్లో సింగిల్ తీసి అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. మిచెల్ మార్ష్ (7) క్రీజులో ఉన్నాడు. దీంతో పది ఓవర్లు ముగిసే సరికి దిల్లీ 79/1 స్కోరుతో నిలిచింది. దిల్లీ విజయానికి 60 బంతుల్లో 111 పరుగులు కావాల్సి ఉంది.
ఛేదనకు దిగిన దిల్లీ బ్యాటర్లు దూకుడుగా ఆడుతున్నారు. దీంతో పవర్ ప్లే పూర్తయ్యే సరికి దిల్లీ ఒక వికెట్ కోల్పోయి 57 పరుగులు చేసింది. హేజిల్ వుడ్ వేసిన మూడో ఓవర్లో డేవిడ్ వార్నర్ (38) ఓ సిక్స్ బాదగా.. పృథ్వీ షా ఓ ఫోర్ కొట్టాడు. షాబాజ్ అహ్మద్ వేసిన తర్వాతి ఓవర్లో వార్నర్ మరో ఫోర్, సిక్స్ బాదాడు. సిరాజ్ వేసిన ఐదో ఓవర్లో భారీ షాట్కు ప్రయత్నించిన పృథ్వీ షా (16).. అనుజ్ రావత్కి చిక్కి క్రీజు వీడాడు. మిచెల్ మార్ష్ (1) క్రీజులోకి వచ్చాడు.
బెంగళూరు నిర్దేశించిన 190 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు దిల్లీ బ్యాటర్లు బరిలోకి దిగారు. గ్లెన్ మ్యాక్స్వెల్ వేసిన తొలి ఓవర్లో డేవిడ్ వార్నర్ (8) ఓ సిక్స్ బాదాడు. మహమ్మద్ సిరాజ్ వేసిన ఆ తర్వాతి ఓవర్లో పృథ్వీ షా (11) మరో సిక్స్ కొట్టాడు. దీంతో రెండు ఓవర్లు పూర్తయ్యే సరికి దిల్లీ వికెట్ నష్టపోకుండా 19 పరుగులు చేసింది.
బెంగళూరు బ్యాటింగ్ ముగిసింది. నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 189 పరుగులు చేసింది. దిల్లీ ముందు 190 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. బెంగళూరు జట్టులో దినేశ్ కార్తిక్ (66* : 34 బంతుల్లో 5×4, 5×6) మెరుపు ఇన్నింగ్స్తో మరోసారి సత్తా చాటాడు. క్రీజులోకి వచ్చినప్పటి నుంచే దూకుడుగా ఆడిన దినేశ్ కార్తిక్.. ముస్తాఫిజుర్ రహ్మాన్ వేసిన 18వ ఓవర్లో మరింత చెలరేగిపోయాడు. ఏకంగా నాలుగు ఫోర్లు, రెండు సిక్సులు బాది.. ఒకే ఓవర్లో 28 పరుగులు రాబట్టాడు. గ్లెన్ మ్యాక్స్వెల్ (55 : 34 బంతుల్లో 7×4, 2×6) అర్ధ శతకంతో రాణించాడు. షాబాజ్ అహ్మద్ (32*) కూడా ఆఖర్లో ధాటిగా ఆడాడు. కెప్టెన్ డు ప్లెసిస్ (8), అనుజ్ రావత్ (0), విరాట్ కోహ్లీ (12), సుయశ్ ప్రభుదేశాయ్ (6) విఫలమయ్యారు. దిల్లీ బౌలర్లలో శార్దూల్ ఠాకూర్, ఖలీల్ అహ్మద్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ తలో వికెట్ పడగొట్టారు.
దిల్లీ బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేస్తూ బెంగళూరు బ్యాటర్లను కట్టడి చేస్తున్నారు. అర్ధ శతకం పూర్తి చేసుకున్న కాసేపటికే ఆల్ రౌండర్ గ్లెన్ మ్యాక్స్వెల్ (55) ఔటయ్యాడు. కుల్దీప్ యాదవ్ వేసిన 12వ ఓవర్లో రెండో బంతికి అతడు లలిత్ యాదవ్కి క్యాచ్ ఇచ్చాడు. 11 - 14 ఓవర్ల మధ్య 20 పరుగులే వచ్చాయి. ఖలీల్ అహ్మద్ వేసిన 15వ ఓవర్లో రెండో బంతిని షాబాజ్ అహ్మద్ (13) బౌండరీకి తరలించగా.. ఆఖరు బంతిని దినేశ్ కార్తిక్ (15) సిక్స్గా మలిచాడు. ఈ క్రమంలోనే 15 ఓవర్లు పూర్తయ్యే సరికి బెంగళూరు 115/5 స్కోరుతో నిలిచింది.
బెంగళూరు ఆల్ రౌండర్ గ్లెన్ మ్యాక్స్వెల్ (49) అర్ధ శతకానికి చేరువయ్యాడు. కుల్దీప్ యాదవ్ వేసిన తొమ్మిదో ఓవర్లో రెండు సిక్సులు, రెండు ఫోర్లు బాదాడు. అక్షర్ పటేల్ వేసిన ఆ తర్వాతి ఓవర్లో సుయశ్ ప్రభుదేశాయ్ (6) కుల్దీప్ యాదవ్కి చిక్కాడు. క్రీజులోకి వచ్చిన షాబాజ్ అహ్మద్ (4) ఓ ఫోర్ బాదాడు. అంతకు ముందు 7, 8 ఓవర్లలో కలిపి ఏడే పరుగులు వచ్చాయి. దీంతో పది ఓవర్లు పూర్తయ్యే సరికి బెంగళూరు 82/4 స్కోరుతో నిలిచింది.
ఆరంభంలోనే కీలక వికెట్లు కోల్పోవడంతో.. బెంగళూరు ఆటగాళ్లు ఆచితూచి ఆడుతున్నారు. అక్షర్ పటేల్ వేసిన నాలుగో ఓవర్లో గ్లెన్ మ్యాక్స్ వెల్ (19) ఓ ఫోర్ బాదగా.. ఖలీల్ అహ్మద్ వేసిన ఆ తర్వాతి ఓవర్లో కోహ్లీ (12) మరో ఫోర్ కొట్టాడు. ఆరో ఓవర్లో మ్యాక్స్వెల్ మరో రెండు ఫోర్లు కొట్టాడు. దీంతో పవర్ ప్లే పూర్తయ్యే సరికి బెంగళూరు రెండు వికెట్లు కోల్పోయి 40 పరుగులు చేసింది.
ఆరంభంలోనే శార్దూల్ ఠాకూర్ బెంగళూరును దెబ్బ కొట్టాడు. తన ఓవర్ రెండో బంతికే వికెట్ తీసుకున్నాడు. అనుజ్ రావత్ (0)ను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. దీంతో ఐదు పరుగుల వద్ద బెంగళూరు తొలి వికెట్ను కోల్పోయింది. ఖలీల్ అహ్మద్ వేసిన మూడో ఓవర్లో డుప్లెసిస్ (8) వికెట్ను బెంగళూరు కోల్పోయింది. ప్రస్తుతం మూడు ఓవర్లు ముగిసేసరికి బెంగళూరు రెండు వికెట్ల నష్టానికి 17 పరుగులు చేసింది. క్రీజ్లో విరాట్ కోహ్లీ (4*), మ్యాక్స్వెల్ (4*) ఉన్నారు.
డబుల్ ధమాకాలో భాగంగా ఇవాళ రెండో మ్యాచ్ మరికాసేపట్లో దిల్లీ, బెంగళూరు జట్ల మధ్య జరగనుంది. టాస్ నెగ్గిన దిల్లీ సారథి రిషభ్ పంత్ బౌలింగ్ ఎంచుకుని బెంగళూరును బ్యాటింగ్కు ఆహ్వానించాడు. పాయింట్ల పట్టికలో పైకి ఎగబాకాలంటే ఇరు జట్లూ తప్పనిసరిగా గెలవాల్సిందే. బ్యాటింగ్లో రాణిస్తున్నప్పటికీ.. బెంగళూరు బౌలింగ్లో సరైన ప్రదర్శన ఇవ్వలేకపోతుంది. అద్బుతమైన బౌలర్లు ఉన్నప్పటికీ కీలక సమయాల్లో తేలిపోతున్నారు. మరోవైపు దిల్లీ బౌలర్ల ప్రదర్శన కూడా అంతంత మాత్రమే. ఈ క్రమంలో విజయం ఎవరి వైపు మొగ్గు చూపుతుందో వేచి చూద్దాం..
జట్ల వివరాలు:
దిల్లీ: పృథ్వీ షా, డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, రిషభ్ పంత్ (కెప్టెన్), రోవ్మన్ పావెల్, లలిత్ యాదవ్, అక్షర్ పటేల్, శార్దూల్ పటేల్, ముస్తాఫిజర్ రహ్మాన్, ఖలీల్ అహ్మద్
బెంగళూరు: డు ప్లెసిస్ (కెప్టెన్), అనుజ్ రావత్, విరాట్ కోహ్లీ, గ్లెన్ మ్యాక్స్వెల్, షాహ్బాజ్ అహ్మద్, దినేశ్ కార్తిక్, సూయష్ ప్రభుదేశాయ్, హసరంగ, హర్షల్ పటేల్, హేజిల్వుడ్, సిరాజ్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అంపైర్గా పని చేసి.. ఐపీఎల్లో అదరగొట్టి... నయా సంచలనం అశుతోష్ కథ ఇది!
ధనాధన్ షాట్లతో ముంబయి మీద విరుచుకుపడి ఓటమి భయం చూపించిన అశుతోష్ శర్మ గురించి ఆసక్తికర విషయాలు... -
ఇంపాక్ట్ ప్లేయర్తో నష్టమే
ఐపీఎల్ గతేడాది ప్రవేశ పెట్టిన ఇంపాక్ట్ ప్లేయర్ విధానం కారణంగా ఆల్రౌండర్లకు నష్టం కలుగుతోందని టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అభిప్రాయపడ్డాడు. -
ఆల్రౌండర్లకు దెబ్బ
టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ చెప్పినట్లు ఐపీఎల్లో ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన భారత ఆల్రౌండర్లకు చేటు చేస్తోంది. టీ20 ప్రపంచకప్లో తలపడే టీమ్ఇండియా ఎంపిక కోసం ఐపీఎల్ ప్రదర్శన కూడా పరిగణలోకి తీసుకుంటారనే చెప్పాలి. -
ప్చ్.. పంజాబ్
13 బంతులు.. 14 పరుగులు.. 4 వికెట్లు! 193 పరుగుల ఛేదనలో పంజాబ్ పరిస్థితిది! బుమ్రా లాంటి మేటి బౌలర్.. బెంబేలెత్తిస్తున్న నేపథ్యంలో ఆ జట్టు కనీసం పోటీలో ఉన్నట్లు కూడా కనపడలేదు. ముంబయి విజయం లాంఛనమేనని తీర్మానించారంతా! కానీ అశుతోష్ శర్మ అసాధారణ బ్యాటింగ్తో పంజాబ్ అద్భుతం చేసినంత పని చేసింది. -
అశుతోష్.. నయా మెరుపు
గుజరాత్తో పంజాబ్ మ్యాచ్.. లక్ష్యం 200.. 150కే 6 వికెట్లు పడిపోయాయి.. ఉన్న ఓవర్లు కూడా తక్కువే! అయినా చివరికి పంజాబ్ గెలిచింది! -
చమరి 195 నాటౌట్
మహిళల క్రికెట్లో శ్రీలంక నయా రికార్డు సృష్టించింది. చమరి ఆటపట్టు (195 నాటౌట్; 139 బంతుల్లో 26×4, 5×6) భారీ శతకంతో అదరగొట్టడంతో దక్షిణాఫ్రికాతో మ్యాచ్లో 302 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. -
ఇషా సత్తా చాటేనా!
హైదరాబాదీ షూటర్ ఇషా సింగ్కు సవాల్. పారిస్ ఒలింపిక్స్ టికెట్ కోసం ఆమె పోటీకి సిద్ధమైంది. శుక్రవారం కర్ణిసింగ్ రేంజ్లో ఆరంభమయ్యే సెలక్షన్ ట్రయల్స్లో మహిళల 25 మీటర్ల పిస్టల్ విభాగంలో ఇషా బరిలో దిగనుంది. -
కళ్లన్నీ వినేశ్ పైనే
పారిస్ ఒలింపిక్స్ కోటా స్థానాల వేటకు భారత రెజ్లర్లు సిద్ధమయ్యారు. శుక్రవారం ప్రారంభమయ్యే ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో అత్యుత్తమ ప్రదర్శనే లక్ష్యంగా బరిలో దిగుతున్నారు. -
నదిలో నాలుగు గంటలు
ఒలింపిక్స్ చరిత్రలోనే మొట్టమొదటిగా ఈ మెగా క్రీడల ఆరంభోత్సవ వేడుకలను ఆరుబయట నిర్వహించేందుకు పారిస్ సిద్ధమవుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతల ఎఫెక్ట్.. భారీ నష్టాల్లో మార్కెట్ సూచీలు
-
అంపైర్గా పని చేసి.. ఐపీఎల్లో అదరగొట్టి... నయా సంచలనం అశుతోష్ కథ ఇది!
-
20 లక్షల పేద కుటుంబాల ‘ఉపాధి’పై జగన్ వేటు
-
ఇరాన్లో భారీ పేలుళ్లు.. అన్నంత పని చేసిన ఇజ్రాయెల్!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
వలకు చిక్కిన 30 కిలోల చేప