Hyderabad vs Lucknow : లఖ్నవూ ఖాతాలో మరో విజయం.. హైదరాబాద్కి వరుసగా రెండో ఓటమి..
టీ20 మెగా టోర్నీలో లఖ్నవూ మరో విజయం సాధించింది. హైదరాబాద్తో జరిగిన మ్యాచులో 12 పరుగుల తేడాతో గెలుపొందింది. 170 పరుగుల లక్ష్యంతో ఛేదనకు దిగిన హైదరాబాద్ నిర్ణీత ఓవర్లలో 157/9 స్కోరుకే పరిమితమైంది..
ఇంటర్నెట్ డెస్క్ : టీ20 మెగా టోర్నీలో లఖ్నవూ మరో విజయం సాధించింది. హైదరాబాద్తో జరిగిన మ్యాచులో 12 పరుగుల తేడాతో గెలుపొందింది. 170 పరుగుల లక్ష్యంతో ఛేదనకు దిగిన హైదరాబాద్ నిర్ణీత ఓవర్లలో 157/9 స్కోరుకే పరిమితమైంది. లఖ్నవూకిది రెండో విజయం కాగా.. హైదరాబాద్కిది వరుసగా రెండో ఓటమి కావడం గమనార్హం. హైదరాబాద్ బ్యాటర్లలో రాహుల్ త్రిపాఠి (44 : 30 బంతుల్లో 5×4, 1×6), నికోలస్ పూరన్ (34 : 24 బంతుల్లో 3×4, 2×6) రాణించారు. వాషింగ్టన్ సుందర్ (18), కెప్టెన్ కేన్ విలియమ్సన్ (16), ఓపెనర్ అభిషేక్ శర్మ (13), మార్క్రమ్ (12) పరుగులు చేశారు. భువనేశ్వర్ కుమార్ (1) పరుగు చేయగా.. అబ్దుల్ సమద్ (0) డకౌటయ్యాడు. ఆఖరు బంతికి రోమెరియో షెఫర్డ్ (8) క్యాచ్ ఔటయ్యాడు. లఖ్నవూ బౌలర్లలో అవేశ్ ఖాన్ నాలుగు, జేసన్ హోల్డర్ మూడు, కృనాల్ పాండ్య రెండు వికెట్లు పడగొట్టారు.
నిలకడగా హైదరాబాద్ బ్యాటింగ్..
కృనాల్ పాండ్య వేసిన 14వ ఓవర్లో తొలి బంతికి రాహుల్ త్రిపాఠి (44).. రవి బిష్ణోయ్కి చిక్కాడు. ఐదో బంతిని నికోలస్ పూరన్ (21) సిక్స్గా మలిచాడు. అంతకు ముందు 11వ ఓవర్లో కృనాల్ ఒక వికెట్ పడగొట్టి ఒక పరుగు ఇవ్వగా.. ఆ తర్వాతి ఓవర్లో 8 పరుగులు వచ్చాయి. 13వ ఓవర్లో రవి బిష్ణోయ్ నాలుగు పరుగులు ఇచ్చాడు. జేసన్ హోల్డర్ వేసిన 15వ ఓవర్లో రెండు ఫోర్లు సహా 15 పరుగులు వచ్చాయి. వాషింగ్టన్ సుందర్ (6) క్రీజులో ఉన్నాడు. దీంతో 15 ఓవర్లకు హైదరాబాద్ 120/4 స్కోరుతో నిలిచింది. హైదరాబాద్ విజయానికి ఇంకా 50 పరుగులు కావాల్సి ఉంది.
మరో వికెట్ కోల్పోయిన హైదరాబాద్..
హైదరాబాద్ మరో కీలక వికెట్ కోల్పోయింది. 10.1 బంతికి మార్క్రమ్ (12) రాహుల్కి చిక్కి క్రీజు వీడాడు. అంతకు ముందు, రవి బిష్ణోయ్ వేసిన ఏడో ఓవర్లో ఓ ఫోర్ బాదిన రాహుల్ త్రిపాఠి (35).. ఆండ్రూ టై వేసిన ఆ తర్వాతి ఓవర్లో మూడు ఫోర్లు బాదాడు. కృనాల్ పాండ్య వేసిన తొమ్మిదో ఓవర్లో రెండో బంతిని రాహుల్ సిక్స్గా మలిచాడు. పదో ఓవర్లో ఐదు పరుగులు వచ్చాయి. దీంతో 10.1 ఓవర్లు పూర్తయ్యే సరికి హైదరాబాద్ 82/3 స్కోరుతో నిలిచింది.
పవర్ ప్లే పూర్తి.. కీలక వికెట్లు కోల్పోయిన హైదరాబాద్..
పవర్ ప్లే పూర్తయ్యే సరికి హైదరాబాద్ రెండు వికెట్లు కోల్పోయి 40 పరుగులు చేసింది. లఖ్నవూ బౌలర్ అవేశ్ ఖాన్ రెండు వికెట్లు పడగొట్టాడు. నాలుగో ఓవర్లో మూడో బంతికి కెప్టెన్ కేన్ విలియమ్సన్ (16) ఆండ్రూ టైకి చిక్కి క్రీజు వీడగా.. ఆరో ఓవర్లో తొలి బంతికి మరో ఓపెనర్ అభిషేక్ శర్మ (13).. మనీశ్ పాండేకు క్యాచ్ ఇచ్చాడు. ప్రస్తుతం రాహుల్ త్రిపాఠి (5), మార్క్రమ్ (1) క్రీజులో ఉన్నారు.
ఛేదనకు దిగిన హైదరాబాద్ బ్యాటర్లు..
హైదరాబాద్ బ్యాటర్లు ఛేదనకు దిగారు. జేసన్ హోల్డర్ వేసిన తొలి ఓవర్లో ఆఖరు బంతిని ఓపెనర్ అభిషేక్ శర్మ (8) బౌండరీకి తరలించాడు. కృనాల్ పాండ్య వేసిన రెండో ఓవర్లో ఐదే పరుగులు ఇచ్చాడు. మూడో ఓవర్లో నాలుగో బంతిని కెప్టెన్ కేన్ విలియమ్సన్ (12) సిక్స్గా మలిచాడు. దీంతో మూడు ఓవర్లకు హైదరాబాద్ వికెట్ నష్టపోకుండా 21 పరుగులు చేసింది.
లఖ్నవూ బ్యాటింగ్ పూర్తి.. రాణించిన రాహుల్, దీపక్ హుడా.. హైదరాబాద్ లక్ష్యం ఎంతంటే.?
టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన లఖ్నవూ జట్టుకు ఆరంభంలోనే హైదరాబాద్ బౌలర్లు వరుస షాకులిచ్చారు. దీంతో పవర్ ప్లేలోనే లఖ్నవూ మూడు వికెట్లు కోల్పోయింది. అయినా కెప్టెన్ కేఎల్ రాహుల్ (68 : 50 బంతుల్లో 6×4, 1×6), దీపక్ హుడా (51 : 33 బంతుల్లో 3×4, 3×6) అర్ధ శతకాలతో రాణించడంతో లఖ్నవూ నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 169 పరుగులు చేసింది. హైదరాబాద్ ముందు 170 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. లఖ్నవూ బ్యాటర్లలో క్వింటన్ డి కాక్ (1), ఎవిన్ లూయిస్ (1), మనీశ్ పాండే (11), కృనాల్ పాండ్య (6) విఫలమయ్యారు. ఆఖరు బంతికి ఆయుష్ బదోని (19) రనౌటయ్యాడు. జేసన్ హోల్డర్ (8) నాటౌట్గా నిలిచాడు. హైదరాబాద్ బౌలర్లలో వాషింగ్టన్ సుందర్, రొమెరియో షెఫర్డ్, నటరాజన్ తలో రెండు వికెట్లు పడగొట్టారు.
వేగం పెంచిన లఖ్నవూ బ్యాటర్లు..
క్రీజులో కుదురుకున్న లఖ్నవూ ఆటగాళ్లు బ్యాట్లు ఝుళిపిస్తున్నారు. నటరాజన్ వేసిన 11వ ఓవర్లో 8 పరుగులు ఇవ్వగా.. రొమెరియో షెఫర్డ్ వేసిన తర్వాతి ఓవర్లో తొలి బంతికి దీపక్ హుడా సిక్స్ బాదాడు. 13వ ఓవర్లో భువనేశ్వర్ ఏడే పరుగులు ఇచ్చాడు. ఉమ్రాన్ మాలిక్ వేసిన తర్వాతి ఓవర్లో దీపక్ హుడా మరో రెండు ఫోర్లు, ఓ సిక్స్ బాదాడు. దీంతో ఈ ఒక్క ఓవర్లోనే 16 పరుగులు వచ్చాయి. ఆ తర్వాత నటరాజన్ వేసిన 15వ ఓవర్లో మూడో బంతికి సింగిల్ తీసిన దీపక్ హుడా (51) అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. కెప్టెన్ కేఎల్ రాహుల్ (49) క్రీజులో ఉన్నాడు. దీంతో 15 ఓవర్లకు లఖ్నవూ మూడు వికెట్లు కోల్పోయి 114 పరుగులు చేసింది.
కట్టుదిట్టంగా హైదరాబాద్ బౌలింగ్.. నిలకడగా లఖ్నవూ బ్యాటింగ్..
పవర్ ప్లేలోనే కీలక వికెట్లు కోల్పోవడంతో లఖ్నవూ ఆటగాళ్లు వికెట్ కాపాడుకుంటూ జాగ్రత్తగా ఆడుతున్నారు. ఉమ్రాన్ మాలిక్ వేసిన ఏడో ఓవర్లో మూడు పరుగులు ఇవ్వగా.. అబ్దుల్ సమద్ వేసిన ఆ తర్వాతి ఓవర్లో తొలి బంతిని కేఎల్ రాహుల్ బౌండరీకి తరలించాడు. నటరాజన్ వేసిన తొమ్మిదో ఓవర్లో ఐదు పరుగులు వచ్చాయి. ఉమ్రాన్ వేసిన పదో ఓవర్లో దీపక్ హుడా (20) ఓ ఫోర్ బాదగా.. కేఎల్ రాహుల్ (41) రెండు ఫోర్లు, ఓ సిక్స్ బాదాడు. దీంతో 10 ఓవర్లు పూర్తయ్యే సరికి లఖ్నవూ 68/3 స్కోరుతో నిలిచింది.
పవర్ ప్లేలోనే కీలక వికెట్లు కోల్పోయిన లఖ్నవూ..
పవర్ ప్లే పూర్తయ్యే సరికి లఖ్నవూ మూడు వికెట్లు కోల్పోయి 32 పరుగులు చేసింది. వాష్టింగ్టన్ సుందర్ వేసిన నాలుగో ఓవర్లో తొలి బంతికి ఎవిన్ లూయిస్ (1).. ఎల్బీగా వెనుదిరిగాడు. రొమెరియో షెఫర్డ్ వేసిన తర్వాతి ఓవర్లో వరుసగా ఓ ఫోర్, ఓ సిక్స్ బాదిన మనీశ్ పాండే (11).. అదే ఊపులో ఐదో బంతిని కూడా బౌండరీకి తరలించే క్రమంలో భువనేశ్వర్ కుమార్కి చిక్కాడు. ఆరో ఓవర్లో ఐదు పరుగులు వచ్చాయి. కెప్టెన్ కేఎల్ రాహుల్ (17), దీపక్ హుడా (2) క్రీజులో ఉన్నారు.
కట్టుదిట్టంగా హైదరాబాద్ బౌలింగ్..
హైదరాబాద్ బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేస్తున్నారు. దీంతో మూడు ఓవర్లు పూర్తయ్యే సరికి లఖ్నవూ ఒక వికెట్ కోల్పోయి 16 పరుగులు చేసింది. భువనేశ్వర్ కుమార్ వేసిన తొలి ఓవర్లో మూడే పరుగులు ఇచ్చాడు. వాషింగ్టన్ సుందర్ వేసిన రెండో ఓవర్లో తొలి బంతిని కెప్టెన్ కేఎల్ రాహుల్ (14) బౌండరీకి తరలించాడు. ఇదే ఓవర్లో నాలుగో బంతికి ఓపెనర్ క్వింటన్ డి కాక్ (1).. కేన్ విలియమ్సన్కి చిక్కి క్రీజు వీడాడు. మూడో ఓవర్లో ఎనిమిది పరుగులు వచ్చాయి. ఎవిన్ లూయిస్ (1) క్రీజులో ఉన్నాడు.
టాస్ నెగ్గిన విలియమ్సన్.. హైదరాబాద్ బోణీ కొట్టేనా.?
టీ20 మెగా టోర్నీలో భాగంగా మరి కాసేపట్లో హైదరాబాద్, లఖ్నవూ జట్లు తలపడనున్నాయి. టాస్ గెలిచిన విలియమ్సన్ బౌలింగ్ ఎంచుకున్నాడు. లఖ్నవూకి బ్యాటింగ్ అప్పగించాడు. ఇప్పటి వరకు రెండు మ్యాచులు ఆడిన లఖ్నవూ జట్టు.. గుజరాత్తో జరిగిన తొలి మ్యాచులో ఓటమి పాలైంది. ఆ తర్వాత చెన్నైతో జరిగిన రెండో మ్యాచులో విజయాన్ని అందుకుంది. తాజాగా, హైదరాబాద్తో పోరుకు సిద్ధమైంది. మరోవైపు, రాజస్థాన్తో జరిగిన తొలి మ్యాచులో పరాజయం పాలైన హైదరాబాద్ జట్టు.. ఈ మ్యాచులోనైనా బోణీ కొడుతుందేమో చూడాలి. ముంబయిలోని డీవై పాటిల్ స్టేడియం వేదికగా ఈ మ్యాచు జరుగనుంది.
తుది జట్ల వివరాలు..
హైదరాబాద్ : కేన్ విలియమ్సన్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠి, మార్క్రమ్, నికోలస్ పూరన్ (వికెట్ కీపర్), అబ్దుల్ సమద్, వాషింగ్టన్ సుందర్, రొమెరియో షెఫర్డ్, భువనేశ్వర్ కుమార్, టి. నటరాజన్, ఉమ్రాన్ మాలిక్
లఖ్నవూ : కేఎల్ రాహుల్ (కెప్టెన్), క్వింటన్ డి కాక్ (వికెట్ కీపర్), మనీశ్ పాండే, ఎవిన్ లూయిస్, దీపక్ హుడా, ఆయుష్ బదోని, కృనాల్ పాండ్య, జేసన్ హోల్డర్, రవి బిష్ణోయ్, ఆండ్రూ టై, అవేశ్ ఖాన్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ధోనీని అంత కోపంగా నేనెప్పుడూ చూడలేదు: సురేశ్ రైనా
ఎప్పుడూ కూల్గా కనిపించే ఎంఎస్ ధోనీ (MS Dhoni) గురించి ఎవరికీ తెలియని ఓ విషయాన్ని సురేశ్ రైనా ఇటీవల బయటపెట్టాడు. -
టీ20 వరల్డ్ కప్తో రీ ఎంట్రీ?.. తలుపులు మూసుకుపోయాయన్న సునీల్ నరైన్
మళ్లీ అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టే ఆలోచన లేదని వెస్టిండీస్ మాజీ ఆటగాడు సునీల్ నరైన్ (Sunil Narine) అన్నాడు. -
కొంతమంది ముంబయి ఆటగాళ్లు రోహిత్ శర్మనే కెప్టెన్ అనుకుంటున్నారు: ఇర్ఫాన్ పఠాన్
ముంబయి ఇండియన్స్ గురించి భారత మాజీ ఆల్రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఆ జట్టులోని కొంతమంది ఆటగాళ్లు ఇప్పటికీ రోహిత్ శర్మ (Rohit Sharma)నే కెప్టెన్గా భావిస్తున్నారని వ్యాఖ్యానించాడు. -
రోహిత్తో ఓపెనింగ్ చేసేది ఎవరు? మీ ఛాయిస్ ఎవరు?
త్వరలో జరగబోయే టీ20 ప్రపంచకప్లో రోహిత్ శర్మకు ఓపెనింగ్ జోడీగా ఎవరైతే బాగుంటారు. -
దాని గురించి మాట్లాడటానికి ఇది సరైన సమయం కాదు: హార్దిక్ పాండ్య
రాజస్థాన్తో జరిగిన మ్యాచ్లో ముంబయి తొమ్మిది వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. అనంతరం ముంబయి కెప్టెన్ హార్దిక్ పాండ్య (Hardik Pandya) మాట్లాడాడు. -
టీ20 వరల్డ్ కప్లో ఓపెనర్లుగా గంగూలీ ఛాయిస్ వీళ్లే..!
T20 World Cup: రాబోయే టీ20 వరల్డ్ కప్ను దృష్టిలో ఉంచుకొని సౌరభ్ గంగూలీ పలు సూచనలు చేశాడు. ఓపెనర్లుగా ఎవరు ఆడితే బాగుంటుందో తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు. అలాగే జట్టు ఎంపిక ఎలా ఉండాలో కూడా సూచించాడు. -
చెపాక్లో చూసుకుందాం.. లఖ్నవూపై చెన్నై ప్రతీకారం తీరేనా?
మళ్లీ మ్యాచ్ చెపాక్కు వచ్చేసింది. లఖ్నవూతో తలపడేందుకు చెన్నై సిద్ధమవుతోంది. ఇరు జట్ల మధ్య జరిగిన గత మ్యాచ్లో కేఎల్ రాహుల్ నాయకత్వంలోని లఖ్నవూ విజయం సాధించింది. -
ఈ కుర్రాడు.. అసామాన్యుడు
కాదు అనుకున్నది చేసి చూపించడం.. ఓటమి తప్పదు అనుకున్న చోట గెలిచి రావడం ఆ కుర్రాడి నైజం. అంచనాలకు మించి రాణించడం.. అద్భుతమైన ఆటతీరుతో అబ్బురపరచడం అతనికి అలవాటు. -
యువరాజు వచ్చేశాడు
భారత్లో ఆదివారం అర్ధరాత్రి. అందరూ గాఢ నిద్రలో ఉండగా.. అక్కడ కెనడాలో ఓ యువరాజు ప్రతిష్ఠాత్మకమైన కిరీటాన్ని ధరించాడు. -
ఆ ఓటమి కసిని పెంచింది
భారత చదరంగ చరిత్రలో అత్యుత్తమ విజయాలు, అసాధారణ ప్రదర్శన అంటే దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ గుర్తుకొస్తాడు. ప్రపంచ చెస్ యవనికపై విషీ ముద్ర అలాంటిది. -
రాయల్స్.. తగ్గేదేలే
ఐపీఎల్-17లో పెద్దగా అంచనాల్లేకుండా బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్.. మ్యాచ్ మ్యాచ్కూ బలపడుతూ వరుస విజయాలతో దూసుకెళ్తోంది. సీజన్లో ఒక్కసారే ఓడిన రాయల్స్.. ఏడో విజయాన్ని నమోదు చేసింది. -
దూకుడు ఫలితాన్నిచ్చింది
క్యాండిడేట్స్ చెస్ టోర్నీలో మునుపెన్నడూ లేనంత పోటీ ఎదురైనట్లు భారత గ్రాండ్మాస్టర్ కోనేరు హంపి తెలిపింది. క్రీడాకారులంతా అత్యుత్తమ సన్నద్ధతతో బరిలో దిగినట్లు చెప్పింది. -
కోహ్లికి జరిమానా
కోల్కతాతో ఐపీఎల్ మ్యాచ్లో అనుచితంగా ప్రవర్తించినందుకు బెంగళూరు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లికి మ్యాచ్ ఫీజులో 50 శాతం కోత పడింది. -
ఇషాకు మూడో స్థానం
ఒలింపిక్ షూటింగ్ సెలక్షన్ ట్రయల్స్లో హైదరాబాదీ అమ్మాయి ఇషాసింగ్ మూడో స్థానంలో నిలిచింది. -
కష్ట కాలంలో కోహ్లి మాటలే..
ఒకప్పుడు ఐపీఎల్లో పేలవ ప్రదర్శనతో విమర్శలెదుర్కొన్న రాజస్థాన్ రాయల్స్ ఆల్రౌండర్ రియాన్ పరాగ్.. ఈ సీజన్లో నిలకడగా రాణిస్తూ ఆశ్చర్యపరుస్తున్నాడు. -
శతకం బాదిన జైస్వాల్.. ముంబయిపై రాజస్థాన్ ఘన విజయం
ముంబయితో జరిగిన పోరులో రాజస్థాన్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 180 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ 18.4 ఓవర్లలో కేవలం ఒక వికెట్ కోల్పోయి ఛేదించింది. ఆజట్టు ఆటగాడు యశస్వి జైస్వాల్ (104*) శతకంతో అదరగొట్టాడు.
తాజా వార్తలు (Latest News)
-
ఏపీలో ఇద్దరు సీనియర్ ఐపీఎస్లపై బదిలీ వేటు
-
కియారా ‘టీ’ ముచ్చట.. సోనాల్ బ్రేక్ఫాస్ట్ సంగతులు
-
సోషల్మీడియాలో ‘లుక్ బిట్వీన్ కీబోర్డ్’ ట్రెండ్.. ఇంతకీ ఏమిటిది..?
-
బ్రిటన్కు అక్రమంగా వస్తే రువాండాకే.. అసలేమిటీ బిల్లు?
-
ఓటీపీ రూటు మారితే అలర్ట్.. సైబర్ మోసాలకు చెక్ పెట్టేందుకు కొత్త అస్త్రం!
-
ధోనీని అంత కోపంగా నేనెప్పుడూ చూడలేదు: సురేశ్ రైనా