Lucknow Vs Rajasthan : లఖ్నవూపై అద్భుత విజయం.. రెండో స్థానానికి రాజస్థాన్
టీ20 లీగ్లో సన్డే రోజున మరో ఆసక్తికర పోరుకు తెరలేవనుంది. ఒక జట్టేమో ఇప్పటికే ప్లేఆఫ్స్ బెర్తును దాదాపు ఖరారు చేసుకుంది. మరొకటేమో ఈ మ్యాచ్లో...
ముంబయి: కీలకమైన మ్యాచ్లో రాజస్థాన్ అద్భుత విజయం సాధించింది. లఖ్నవూపై 24 పరుగుల తేడాతో రాజస్థాన్ గెలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ 178/6 స్కోరు చేసింది. అనంతరం లఖ్నవూ నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 154 పరుగులే చేసింది. దీపక్ హుడా (59) అర్ధశతకం సాధించాడు. కృనాల్ పాండ్య (25), మార్కస్ స్టొయినిస్ (27) ఫర్వాలేదనింపించారు. మిగతా బ్యాటర్లలో డికాక్ 7, కేఎల్ రాహుల్ 10, ఆయుష్ బదోని డకౌట్, జాసన్ హోల్డర్ 1, మోహ్సిన్ ఖాన్ 9* పరుగులు చేశారు. రాజస్థాన్ బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్ 2, ప్రసిధ్ కృష్ణ 2, మెక్కాయ్ 2.. చాహల్, అశ్విన్ చెరో వికెట్ తీశారు.
ఈ విజయంతో రాజస్థాన్ (16, +0.304) పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరుకుంది. నెట్ రన్రేట్ కాస్త తగ్గడంతో లఖ్నవూ (16, +0.262) మూడో స్థానానికి పడిపోయింది. ఇక మిగిలిన జట్ల మ్యాచుల్లో అద్భుతాలు జరిగితే తప్పితే ఈ రెండు టీమ్లు దాదాపు ప్లేఆఫ్స్కు చేరుకున్నట్లే. లీగ్ దశలో లఖ్నవూ తన ఆఖరి మ్యాచ్ను కోల్కతాతో మే 18న, చెన్నైతో రాజస్థాన్ మే 20న తలపడతాయి.
దూకుడుగా దీపక్ హుడా
లఖ్నవూ ఆటగాడు దీపక్ హుడా దూకుడుగా ఆడుతున్నాడు. మెకాయ్ వేసిన తొమ్మిదో ఓవర్లో ఓ సిక్సర్ బాదిన హుడా.. చాహల్ వేసిన 11వ ఓవర్లో వరుసగా సిక్స్, ఫోర్ బాదాడు. అశ్విన్ వేసిన తర్వాతి ఓవర్లో దీపక్ మరో ఫోర్ కొట్టాడు. మరోవైపు, అశ్విన్ వేసిన 14 ఓవర్లో తొలి బంతికి కృనాల్ పాండ్య (25).. రియాన్ పరాగ్కి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. 14 ఓవర్లకు లఖ్నవూ నాలుగు వికెట్ల నష్టానికి 98 పరుగులు చేసింది. దీపక్ హుడా (44), స్టొయినిస్ (3) క్రీజులో ఉన్నారు. లఖ్నవూ విజయానికి 36 బంతుల్లో 81 పరుగులు కావాలి.
కీలక వికెట్లను చేజార్చుకున్న లఖ్నవూ
రాజస్థాన్ బౌలింగ్ కట్టుదిట్టంగా ఉండటంతో లఖ్నవూ కీలక వికెట్లను కోల్పోయింది. ఒకే ఓవర్లో ఆయుష్ బదోని (0), డికాక్ (7) ఔట్ కాగా.. మరికాసేపటికే కెప్టెన్ కేఎల్ రాహుల్ (10) పెవిలియన్కు చేరాడు. ప్రస్తుతం 8 ఓవర్లు ముగిసేసరికి లఖ్నవూ మూడు వికెట్ల నష్టానికి 50 పరుగులు చేసింది. క్రీజ్లో దీపక్ హుడా (11*), కృనాల్ పాండ్య (14*) ఉన్నారు. లఖ్నవూ విజయం సాధించాలంటే 72 బంతుల్లో 129 పరుగులు చేయాలి.
ఒకే ఓవర్లో రెండు వికెట్లు
లఖ్నవూ ఛేదన ప్రారంభించింది. అయితే రాజస్థాన్ పేసర్ బౌల్ట్ ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీసి దెబ్బ కొట్టాడు. మూడో ఓవర్ తొలి బంతికే డికాక్ (7) పెవిలియన్కు చేరాడు. షార్ట్ లెగ్లో నీషమ్ అద్భుత క్యాచ్ పట్టడంతో ఔటయ్యాడు. అనంతరం క్రీజ్లోకి వచ్చిన ఆయుష్ బదోని (0) గోల్డెన్ డక్గా వెనుదిరిగాడు. అతడు ఎదుర్కొన్న తొలి బంతికే వికెట్ల ముందు దొరికిపోయాడు. ప్రస్తుతం మూడు ఓవర్లు ముగిసేసరికి రెండు వికెట్ల నష్టానికి 21 పరుగులు చేసింది. క్రీజ్లో కేఎల్ రాహుల్ (2*), దీపక్ హుడా (6*) ఉన్నారు. తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ 178/6 స్కోరు సాధించింది.
లఖ్నవూ లక్ష్యం ఎంతంటే?
బ్యాటర్లు సమష్టిగా రాణించడంతో లఖ్నవూకు రాజస్థాన్ 179 పరుగులను లక్ష్యంగా నిర్దేశించింది. తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్ 41, దేవదుత్ పడిక్కల్ 39, సంజూ శాంసన్ 32, రియాన్ పరాగ్ 17, నీషమ్ 14, అశ్విన్ 10*, ట్రెంట్ బౌల్ట్ 17* పరుగులు చేశారు. జోస్ బట్లర్ (2) విఫలమయ్యాడు. లఖ్నవూ బౌలర్లలో రవి బిష్ణోయ్ 2.. అవేశ్ఖాన్, జాసన్ హోల్డర్, ఆయుష్ బదోని తలో వికెట్ తీశారు.
కట్టుదిట్టంగా లఖ్నవూ బౌలింగ్
కీలకమైన సమయంలో వికెట్లను పడగొడుతూ లఖ్నవూ బౌలర్లు రాజస్థాన్ దూకుడును అడ్డుకుంటున్నారు. ప్రస్తుతం 14 ఓవర్లు ముగిసేసరికి నాలుగు వికెట్ల నష్టానికి 123 పరుగులు చేసింది. క్రీజ్లో రియాన్ పరాగ్ (5*), జేమ్స్ నీషమ్ (1*) ఉన్నారు. అంతకుముందు కాసేపు ధాటిగా ఆడిన యశస్వి జైస్వాల్ (41), సంజూ శాంసన్ (32), దేవదుత్ పడిక్కల్ (39) వికెట్లను రాజస్థాన్ కోల్పోయింది.
దూకుడుగానే ఇన్నింగ్స్
ఓపెనర్ జోస్ బట్లర్ (2) ఘోరంగా విఫలమైనా సరే.. రాజస్థాన్ ఇన్నింగ్స్ దూకుడుగానే సాగింది. అయితే వేగంగా పరుగులు చేస్తున్న సంజూ శాంసన్ (32) జాసన్ హోల్డర్ బౌలింగ్లో భారీ షాట్కు యత్నించి పెవిలియన్కు చేరాడు. ప్రస్తుతం 9 ఓవర్లు ముగిసేసరికి రాజస్థాన్ రెండు వికెట్ల నష్టానికి 75 పరుగులు చేసింది. క్రీజ్లో యశస్వి జైస్వాల్ (39*), దేవదుత్ పడిక్కల్ ఉన్నారు. ఆరంభంలో ఆచితూచి ఆడిన యశస్వి జైస్వాల్ పవర్ ప్లే ఓవర్లలో ధాటిగా ఆడేశాడు. సంజూతో కలిసి 64 పరుగులు జోడించాడు.
బట్లర్ క్లీన్బౌల్డ్
లఖ్నవూతో జరుగుతున్న మ్యాచ్లో రాజస్థాన్ బ్యాటింగ్ ప్రారంభించింది. అయితే మంచి ఫామ్లో ఉన్న జోస్ బట్లర్ (2)ను లఖ్నవూ బౌలర్ అవేశ్ ఖాన్ క్లీన్బౌల్డ్ చేశాడు. దీంతో రాజస్థాన్ తొలి వికెట్ను చేజార్చుకుంది. ప్రస్తుతం మూడు ఓవర్లు ముగిసేసరికి రాజస్థాన్ వికెట్ నష్టానికి 16 పరుగులు చేసింది. క్రీజ్లో యశస్వి జైస్వాల్ (9*), సంజూ శాంసన్ (5*) ఉన్నారు.
టాస్ నెగ్గి బ్యాటింగ్ ఎంచుకున్న రాజస్థాన్
టీ20 లీగ్లో సన్డే రోజున మరో ఆసక్తికర పోరుకు తెరలేవనుంది. ఒక జట్టేమో ఇప్పటికే ప్లేఆఫ్స్ బెర్తును దాదాపు ఖరారు చేసుకుంది. మరొకటేమో ఈ మ్యాచ్లో విజయం సాధిస్తే బెర్తు ఖాయమైపోతుంది. మరి ఆ జట్లేవో ఇప్పటికే అర్థమయ్యే ఉంటుందిగా.. లఖ్నవూ, రాజస్థాన్.. మరికాసేపట్లో ఇరు జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. బలాల ప్రకారం సరిసమానంగా ఉండే రెండు టీమ్ల సమరం ఎలా ఉంటుందో చూడాలంటే కాసేపు వేచి చూడాల్సిందే. ఈ క్రమంలో టాస్ నెగ్గిన రాజస్థాన్ సారథి సంజూ శాంసన్ బ్యాటింగ్ ఎంచుకుని లఖ్నవూకు బౌలింగ్ అప్పగించాడు. ప్రస్తుతం కేఎల్ రాహుల్ నాయకత్వంలోని లఖ్నవూ 12 మ్యాచులకుగాను ఎనిమిది విజయాలతో 16 పాయింట్లు సాధించి రెండో స్థానంలో కొనసాగుతోంది. ఇక రాజస్థాన్ విషయానికొస్తే.. 12 మ్యాచులకుగాను ఏడు విజయాలతో 14 పాయింట్లు సాధించి మూడో స్థానంలో ఉంది.
జట్ల వివరాలు :
లఖ్నవూ : క్వింటన్ డికాక్, కేఎల్ రాహుల్ (కెప్టెన్), దీపక్ హుడా, కృనాల్ పాండ్య, ఆయుష్ బదోని, మార్కస్ స్టొయినిస్, జాసన్ హోల్డర్, మోహ్సిన్ ఖాన్, రవి బిష్ణోయ్, దుష్మంత చమీర, అవేశ్ ఖాన్
రాజస్థాన్ : యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్, సంజూ శాంసన్ (కెప్టెన్), దేవదుత్ పడిక్కల్, జేమ్స్ నీషమ్, రియాన్ పరాగ్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, ప్రసిధ్ కృష్ణ, చాహల్, మెక్కాయ్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అప్పుడు ధోనీ నన్ను ఎత్తుకోవడం ఎంతో ఆనందం కలిగించింది..: రవీంద్ర జడేజా
ధోనీతో తనకున్న అనుబంధాన్ని ఓ ఇంటర్వ్యూలో రవీంద్ర జడేజా గుర్తు చేసుకున్నాడు. -
మాకు కొత్త కెప్టెన్ ఉన్నాడు..: యాంకర్ ప్రశ్నకు ధోనీ సమాధానం
సమయస్ఫూర్తి ప్రదర్శించడంలో ధోనీ తర్వాతే ఎవరైనా. తాజాగా ఓ ఇంటర్వ్యూలో అతడు ఇచ్చిన సమాధానమే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ. -
హెన్రిచ్ క్లాసెన్.. సన్రైజర్స్కు భలే దొరికాడు
ఐపీఎల్ 17వ సీజన్లో హైదరాబాద్ వరుసగా రెండు మ్యాచుల్లోనూ దూకుడైన బ్యాటింగ్ చేసింది. అందుకు ప్రధాన కారణం హెన్రిచ్ క్లాసెన్. -
‘మిలిటరీ తరహా కోచ్’ అంటూ వీజ్ వ్యాఖ్యలు.. ఆండ్రి రస్సెల్ కౌంటర్
భారత్లో అత్యుత్తమ కోచ్ల్లో ఒకరైన చంద్రకాంత్ పండిత్పై నమీబియా ఆటగాడు చేసిన కామెంట్లు సంచలనంగా మారాయి. వాటిని కొట్టిపడేస్తూ ఆండ్రి రస్సెల్ కీలక వ్యాఖ్యలు చేశాడు. -
కేరళలోనూ రియాన్ గురించే అడిగేవారు.. ఇప్పుడు 15 మంది కీలకమే: సంజూ
ఐపీఎల్ 17వ సీజన్లో రాజస్థాన్ దూకుడు ప్రదర్శిస్తోంది. వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసి పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరుకుంది. -
మా అమ్మ ఇక్కడే ఉన్నారు.. 4 ఏళ్లుగా నా కష్టాలను చూశారు: రియాన్ పరాగ్
రాజస్థాన్ ఆటగాడు రియాన్ పరాగ్ ఈ ఐపీఎల్ సీజన్లో అదరగొట్టేస్తున్నాడు. దిల్లీపై భారీ ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నాడు. -
హార్దిక్ సవాళ్ల ప్రయాణం..
ముంబయి ఇండియన్స్ నుంచి గుజరాత్ టైటాన్స్కు వెళ్లి కెప్టెన్గా నిరూపించుకున్నాడు హార్దిక్ పాండ్య. -
పరాగ్ ఫటాఫట్
ఆరంభంలో దిల్లీ అదరహో.. రాజస్థాన్ పరిస్థితి చూసి జాలి పడే పరిస్థితి.. కానీ ఇన్నింగ్స్ అయ్యేసరికి రాయల్స్దే పైచేయి! ఛేదన ఆరంభంలో దిల్లీదే ఆధిపత్యం.. తర్వాత రాజస్థాన్ జోరు.. మళ్లీ డీసీ పైచేయి.. అంతలోనే రాయల్స్ దూకుడు! -
క్వార్టర్స్లో సింధు
మాడ్రిడ్ స్పెయిన్ మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో పీవీ సింధు జోరు కొనసాగుతోంది. -
విహారికి షోకాజ్ నోటీసు
టీమ్ఇండియా టెస్టు క్రికెటర్ హనుమ విహారికి ఆంధ్ర క్రికెట్ సంఘం (ఏసీఏ) షోకాజ్ నోటీసు జారీ చేసిన విషయం వెలుగులోకి వచ్చింది. -
ఐపీఎల్ అంటే క్రికెట్టేనా!
ఐపీఎల్ ఊహించని స్థాయిలో వృద్ధి చెందిందని, కొన్ని సార్లు ఈ లీగ్ అంటే క్రికెట్టేనా! అనే ఆశ్చర్యమూ కలుగుతుందని రాజస్థాన్ రాయల్స్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అభిప్రాయపడ్డాడు. -
నితిన్ అయిదోసారి..
భారత అంపైర్ నితిన్ మేనన్ అయిదోసారి ఐసీసీ ఎలైట్ ప్యానల్లో చోటు దక్కించుకున్నాడు. ఇం -
అమ్మో నైట్రైడర్స్ కోచ్
కోల్కతా నైట్రైడర్స్ కోచ్ చంద్రకాంత్ పండిత్ కోచింగ్ విధానాలపై ఆ జట్టు మాజీ ఆటగాడు, నమీబియా ఆల్రౌండర్ డేవిడ్ వీజ్ అసహనం వ్యక్తం చేశాడు. -
నీరజ్.. దోహా టోర్నీతో షూరూ
ఒలింపిక్ ఛాంపియన్ నీరజ్ చోప్రా ఈ సీజన్ను మే 10న ఆరంభమయ్యే డైమండ్ లీగ్ దోహా అంచె టోర్నీతో షురూ చేయనున్నాడు. -
బుమ్రాను ఎందుకు కొనసాగించలేదో?
సన్రైజర్స్ హైదరాబాద్తో మ్యాచ్లో ముంబయి ఇండియన్స్ హార్దిక్ పాండ్య బౌలింగ్ వ్యూహాలు అంతుచిక్కని విధంగా సాగాయని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ అన్నాడు. -
సూర్య ఇంకొన్ని రోజులు!
సూర్యకుమార్ యాదవ్ ఐపీఎల్-17లో ముంబయి ఇండియన్స్కు అందుబాటులోకి రావడానికి ఇంకొన్ని రోజులు సమయం పడుతుందని సమాచారం. -
కోల్కతా జట్టులోకి 16 ఏళ్ల స్పిన్నర్
గాయంతో ఈ ఐపీఎల్ సీజన్కు దూరమైన ముజీబ్ ఉర్ రెహ్మాన్ స్థానాన్ని మరో అఫ్గాన్ స్పిన్నర్ అల్లా గజన్ఫర్తో కోల్కతా నైట్రైడర్స్ భర్తీ చేసింది. -
ఐపీఎల్ తొలిరోజు వీక్షకులు 16.8 కోట్లు
వీక్షణలో ఐపీఎల్-17 కొత్త రికార్డు నెలకొల్పింది. -
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు జరిగింది. ముజీబ్ స్థానంలో అల్లాహ్ ఘజన్ఫర్, ప్రసీధ్ కృష్ణ స్థానంలో కేశవ్ మహరాజ్ జట్టులోకి వచ్చారు.
తాజా వార్తలు (Latest News)
-
బిహార్లో తేలిన సీట్ల లెక్క.. 26 స్థానాల్లో ఆర్జేడీ, 9 చోట్ల కాంగ్రెస్
-
జనసేనలో చేరతానని నేను చెప్పలేదు: అనసూయ
-
కేజ్రీవాల్ కోసం మెసేజ్లు పంపండి.. వాట్సప్ నంబరు షేర్ చేసిన సతీమణి
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
అప్పుడు ధోనీ నన్ను ఎత్తుకోవడం ఎంతో ఆనందం కలిగించింది..: రవీంద్ర జడేజా
-
కేసీఆర్ చేసిన మొదటి తప్పు అదే: మంత్రి కోమటిరెడ్డి