Mumbai Vs Hyderabad : వరుస ఓటములకు బ్రేక్.. ఉత్కంఠ పోరులో హైదరాబాద్ విజయం
సాంకేతికతంగా మాత్రమే ప్లేఆఫ్స్ అవకాశాలు ఉన్న హైదరాబాద్ మరికాసేపట్లో ముంబయితో తలపడనుంది. టాస్ నెగ్గిన ..
ముంబయి: వరుసగా ఐదు ఓటముల తర్వాత ఎట్టకేలకు హైదరాబాద్ విజయం సాధించింది. ఆఖరి ఓవర్ వరకు ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్లో ముంబయిపై హైదరాబాద్ 3 పరుగుల తేడాతో గెలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ 193/6 స్కోరు సాధించింది. అనంతరం ముంబయి నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 190 పరుగులకే పరిమితమైంది. రోహిత్ శర్మ (48), ఇషాన్ కిషన్ (43), టిమ్ డేవిడ్ (46) ధాటిగా ఆడటంతో ఓ దశలో ముంబయి గెలిచేలా కనిపించింది. అయితే భువనేశ్వర్ కుమార్ (1/26), ఉమ్రాన్ మాలిక్ (3/23) పొదుపుగా బౌలింగ్ చేయడంతో హైదరాబాద్ విజయం సాధించింది. మిగతా బౌలర్లలో వాషింగ్టన్ సుందర్ ఒక వికెట్ తీశాడు. టి. నటరాజన్ (0/60) భారీగా పరుగులు సమర్పించుకున్నాడు.
ప్రస్తుతం ఆరో విజయం సాధించిన హైదరాబాద్ (12) స్థానం మాత్రం పాయింట్ల పట్టికలో మారలేదు. ఇప్పటివరకు 13 మ్యాచులకుగాను ఆరు విజయాలు, ఏడు ఓటములతో ఎనిమిదో స్థానంలో ఉంది. హైదరాబాద్ తన ఆఖరి మ్యాచ్లో పంజాబ్ (మే 22)తో తలపడనుంది. మరోవైపు ముంబయి తన చివరి మ్యాచ్లో దిల్లీతో మే 21న ఢీకొట్టనుంది. దిల్లీకి ప్లేఆఫ్స్ బెర్తు దక్కాలంటే తప్పక గెలవాలి.
స్వల్ప వ్యవధిలో వికెట్లు
స్వల్ప వ్యవధిలో ముంబయి రెండు వికెట్లను చేజార్చుకుంది. హైదరాబాద్ బౌలర్లు కాస్త కట్టుదిట్టంగా వేస్తున్నప్పటికీ ముంబయి బ్యాటర్లు పరుగులు రాబడుతున్నారు. ప్రస్తుతం 14 ఓవర్లు ముగిసేసరికి ముంబయి రెండు వికెట్ల నష్టానికి 123 పరుగులు చేసింది. క్రీజ్లో డానియల్ సామ్స్ (14*), తిలక్ వర్మ (8*) ఉన్నారు. మంబయి విజయం సాధించాలంటే 36 బంతుల్లో ఇంకా 71 పరుగులు చేయాలి.
దూకుడుగా బ్యాటింగ్
హైదరాబాద్ బౌలర్లు పెద్దగా ప్రభావం చూపలేకపోతున్నారు. దీంతో ముంబయి బ్యాటర్లు అడపాదడపా బౌండరీలు బాదుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టిస్తున్నారు. ప్రస్తుతం 9 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టపోకుండా 78 పరుగులు చేసింది. క్రీజ్లో ఓపెనర్లు రోహిత్ శర్మ (35*), ఇషాన్ కిషన్ (35*) ఉన్నారు. ముంబయి విజయానికి ఇంకా 66 బంతుల్లో 116 పరుగులు కావాలి.
ఛేదన ప్రారంభం
ముంబయి ఛేదన ప్రారంభించింది. ఓపెనర్లు నిలకడగా ఆడుతూ పరుగులు రాబడుతున్నారు. తొలి రెండు ఓవర్లలో ఆచితూచి ఆడారు. అయితే వాషింగ్టన్ సుందర్ వేసిన మూడో ఓవర్లో రెండు ఫోర్లను బాదారు. ప్రస్తుతం 3 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టపోకుండా 20 పరుగులు చేసింది. క్రీజ్లో ఇషాన్ కిషన్ (10*), రోహిత్ శర్మ (9*) ఉన్నారు. తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ 193/6 స్కోరు చేసింది.
ముంబయి లక్ష్యం ఎంతంటే?
స్వల్ప వ్యవధిలో వికెట్లు పడటంతో హైదరాబాద్ అనుకున్నంత స్కోరును సాధించలేకపోయింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 193 పరుగులు చేసింది. దీంతో ముంబయికి 194 పరుగులను లక్ష్యంగా నిర్దేశించింది. రాహుల్ త్రిపాఠి (76) అర్ధశతకం సాధించగా.. ప్రియమ్ గార్గ్ (42), నికోలస్ పూరన్ (38) ఫర్వాలేదనిపించారు. మిగిలిన బ్యాటర్లలో అభిషేక్ శర్మ 9, మార్క్రమ్ 2 కేన్ విలియ్సన్ 8*, సుందర్ 9 పరుగులు చేశారు. ముంబయి బౌలర్లలో రమణ్దీప్ 3.. డానియల్ సామ్స్, రిలే మెరిడెత్, బుమ్రా తలో వికెట్ తీశారు. టీ20 ఫార్మాట్లో బుమ్రా 250 వికెట్లను తీసిన బౌలర్గా అవతరించాడు.
పోటాపోటీగా బౌండరీలు
హైదరాబాద్ బ్యాటర్లు పోటాపోటీగా బౌండరీలు బాదేశారు. ముంబయి బౌలర్లకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా పరుగులు రాబడుతున్నారు. ప్రస్తుతం 14 ఓవర్లు ముగిసేసరికి రెండు వికెట్ల నష్టానికి 145 పరుగులు చేసింది. క్రీజ్లో రాహుల్ త్రిపాఠి (50*), నికోలస్ పూరన్ (35*) ఉన్నారు. ఈ క్రమంలో త్రిపాఠి అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. అంతకుముందు ధాటిగా ఆడిన ప్రియమ్ గార్గ్ (42) పెవిలియన్కు చేరాడు.
దూకుడుగా బ్యాటింగ్
ఆరంభంలోనే వికెట్ కోల్పోయినా హైదరాబాద్ స్కోరు బోర్డు వేగం మాత్రం తగ్గలేదు. బ్యాటర్లు ప్రియమ్ గార్గ్ (37*), రాహుల్ త్రిపాఠి (33*) ఆచితూచి ఆడుతూనే భారీ షాట్లు కొట్టారు. దీంతో ప్రస్తుతం 9 ఓవర్లు ముగిసేసరికి హైదరాబాద్ వికెట్ నష్టానికి 89 పరుగులు చేసింది. ముంబయి బౌలర్లను చక్కగా ఎదుర్కొని మరీ ఇద్దరు బ్యాటర్లు అర్ధశతక (71) భాగస్వామ్యం నిర్మించారు.
అభిషేక్ ఔట్
హైదరాబాద్ బ్యాటింగ్ ప్రారంభించింది. తొలి రెండు ఓవర్లలో ముంబయి బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో పరుగులు చేసేందుకు హైదరాబాద్ బ్యాటర్లు ఇబ్బంది పడ్డారు. అయితే మూడో ఓవర్లో కాస్త వేగం పెంచేందుకు ప్రయత్నించే క్రమంలో అభిషేక్ శర్మ (9) పెవిలియన్కు చేరాడు. అయితే ప్రియమ్ గార్గ్ (9*) రెండు ఫోర్లు కొట్టాడు. దీంతో ప్రస్తుతం మూడు ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 23 పరుగులు చేసింది. క్రీజ్లో ప్రియమ్ గార్గ్తోపాటు రాహుల్ త్రిపాఠి (1*) ఉన్నారు.
టాస్ నెగ్గిన ముంబయి
సాంకేతికతంగా మాత్రమే ప్లేఆఫ్స్ అవకాశాలు ఉన్న హైదరాబాద్ మరికాసేపట్లో ముంబయితో తలపడనుంది. టాస్ నెగ్గిన ముంబయి కెప్టెన్ రోహిత్ శర్మ బౌలింగ్ ఎంచుకుని హైదరాబాద్కి బ్యాటింగ్ అప్పగించాడు. ప్రస్తుతం హైదరాబాద్ 12 మ్యాచులకుగాను ఐదు విజయాలతో 10 పాయింట్లు సాధించి పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానంలో ఉంది. ఇక మిగిలిన రెండు మ్యాచుల్లోనూ విజయం సాధిస్తే.. ఇతర జట్ల ఫలితాలపై ఏమైనా అవకాశాలు కొద్దో గొప్పో ఉంటాయి. ఇప్పుడు ముంబయి చేతిలో ఓటమిపాలైతే మాత్రం ఇంటిముఖం పట్టక తప్పదు. మరోవైపు ముంబయికి ఇప్పటికే దారులు మూసుకుపోయాయి. కేవలం మూడు విజయాలను మాత్రమే నమోదు చేసింది. అయితే ఇతర జట్ల ఫలితాలను ప్రభావితం చేసే ఛాన్స్ మాత్రం ముంబయి ఎదుట ఉంది. అంతేకాకుండా మిగిలిన మ్యాచుల్లో విజయం సాధించి కాస్త గౌరవంగా టోర్నీ ముగించాలని ముంబయి అభిమానులు ఆశిస్తున్నారు.
జట్ల వివరాలు:
హైదరాబాద్ : అభిషేక్ శర్మ, ప్రియమ్ గార్గ్, కేన్ విలియమ్సన్ (కెప్టెన్), రాహుల్ త్రిపాఠి, మార్క్రమ్, నికోలస్ పూరన్, వాషింగ్టన్ సుందర్, భువనేశ్వర్ కుమార్, ఫరూఖి, ఉమ్రాన్ మాలిక్, నటరాజన్
ముంబయి : ఇషాన్ కిషన్, రోహిత్ శర్మ (కెప్టెన్), డానియల్ సామ్స్, తిలక్ వర్మ, రమణ్దీప్ సింగ్, త్రిస్టాన్ స్టబ్స్, టిమ్ డేవిడ్, సంజయ్ యాదవ్, బుమ్రా, రిలే మెరెడిత్, మయాంక్ మార్కండే
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
డేవిడ్, పొలార్డ్కు భారీ జరిమానా.. ‘డీఆర్ఎస్ సిగ్నల్’ వివాదమేనా కారణం?
ముంబయి ఆటగాడు, కోచ్పై ఐపీఎల్ అడ్వైజరీ కమిటీ కొరడా ఝళిపించింది. వారు చేసిన చర్యలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తీవ్ర నిర్ణయం తీసుకుంది. -
Ravindra Jadeja: గాల్లోకి ఎగిరి.. ఒంటిచేత్తో జడేజా క్యాచ్!
లఖ్నవూతో శుక్రవారం జరిగిన మ్యాచ్లో చెన్నై ఆటగాడు రవీంద్ర జడేజా.. గాల్లోకి ఎగిరి ఒంటి చేత్తో క్యాచ్ ఒడిసిపట్టాడు.
-
దిల్లీ కోటలో తొలి మ్యాచ్.. హైదరాబాద్ దూకుడు కొనసాగేనా?
అభిమానుల ఊహకు అందనిరీతిలో.. సంచలన ఆటతో ఐపీఎల్ 17వ సీజన్లో హైదరాబాద్ జట్టు అదరగొట్టేస్తోంది. ఇవాళ మరో మ్యాచ్లో తలపడేందుకు సిద్ధమవుతోంది. -
ధోనీ ఆటే స్ఫూర్తి.. లేటుగా బ్యాటింగ్కు రావడానికి కారణముంది: ఫ్లెమింగ్
ప్రస్తుత సీజన్లో దూకుడుగా ఆడుతున్న క్రికెటర్లలో ధోనీ ముందువరుసలో ఉంటాడు. ఆడేది పది బంతుల్లోపే అయినా ప్రత్యర్థి బౌలర్లకు వణుకు పుట్టిస్తున్నాడు. -
ఆ ముగ్గురిని చూస్తే ముచ్చటేసింది.. రోహిత్ ఈజ్ బ్యాక్: హర్భజన్
పంజాబ్తో జరిగిన మ్యాచ్లో ముంబయి జట్టుకు కాసేపు యాక్టివ్ కెప్టెన్గా రోహిత్ శర్మ వ్యవహరించాడు. ఇది సోషల్ మీడియాలో వైరల్గా మారింది. -
చెరో రూ. 12 లక్షలు కట్టండి.. కెప్టెన్లకు జరిమానా
లఖ్నవూ కెప్టెన్ కేఎల్ రాహుల్, చెన్నై సారథి రుతురాజ్ గైక్వాడ్కు ఐపీఎల్ అడ్వైజరీ కమిటీ జరిమానా విధించింది. -
ధోనీ ఎంట్రీ ఎఫెక్ట్.. వామ్మో వినికిడి కోల్పోమా..? : లఖ్నవూ స్టార్ వైఫ్
సొంత మైదానంలో లఖ్నవూ విజయం సాధించింది. ఆ జట్టు గెలుపు కంటే మరొక అంశం అభిమానులను ఆకట్టుకుంది. అదే ఎంఎస్ ధోనీ (MS Dhoni) బ్యాటింగ్ వీరవిహారం. -
ధోని.. ఇంకా నాటౌటే
చివరి సీజన్గా భావిస్తున్న ఈ ఐపీఎల్లో బ్యాటింగ్ చేస్తోంది తక్కువసేపే అయినా అభిమానులను ఉర్రూతలూగిస్తున్నాడు ధోని. -
కేఎల్ రాహుల్ కెప్టెన్ ఇన్నింగ్స్.. చెన్నైకి చెక్
ఏక్నా స్టేడియంలోని నెమ్మదైన పిచ్పై స్కోరు 160 దాటిందంటే ఛేదన కష్టమే. ఓ దశలో చెన్నై 150 అయినా చేస్తుందా అనుకుంటే.. గత మ్యాచ్లో ముంబయిపై చెలరేగినట్లే మహేంద్రసింగ్ ధోని ఈ మ్యాచ్లోనూ ఆఖర్లో మెరుపు ఇన్నింగ్స్ ఆడడంతో చెన్నై స్కోరు 176కు చేరుకుంది. -
కుర్రాళ్లు కుమ్మేస్తున్నారు
ఛేదనలో నాలుగైదు వికెట్లు పడ్డాయా? అయినా భయం లేదు తామున్నామంటూ సత్తాచాటుతున్నారు. -
బుమ్రా బౌలింగ్లో స్వీప్ షాట్.. నా కల!
అశుతోష్ శర్మ.. ఈ ఐపీఎల్లో గట్టిగా వినిపిస్తున్న కొత్త పేరు. -
రేసులో గుకేశ్ ఒక్కడే..
క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్లో భారత యువ కెరటం గుకేశ్ మళ్లీ ఆధిక్యంలోకి వచ్చాడు. -
మెరిసిన ఇషా, భవేష్
ఒలింపిక్స్ సెలెక్షన్ ట్రయల్స్లో అగ్రశ్రేణి షూటర్లు ఇషా సింగ్, భవేష్ షెకావత్ మెరిశారు. -
దీపకు నాలుగో స్థానం
దోహాలో జరిగిన జిమ్నాస్టిక్స్ ప్రపంచకప్ను భారత స్టార్ దీప కర్మాకర్ నాలుగో స్థానంతో ముగించింది. -
భారత రెజ్లర్లు విఫలం
ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో భారత పురుష రెజ్లర్లు విఫలమయ్యారు. -
విమానం ఆలస్యమై...
భారత ఉత్తమ రెజ్లర్లలో ఇద్దరైన దీపక్ పునియా (86 కేజీలు), సుజీత్ కలాకల్ (65 కేజీలు)కు నిరాశ తప్పలేదు. -
రాకెట్ వదిలేద్దాం అనుకున్నా
గత కొన్నేళ్లలో కెరీర్లో ఎంతో క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొన్నానని.. ఒకటికి రెండుసార్లు బ్యాడ్మింటన్కు వీడ్కోలు చెప్పాలని భావించానని భారత డబుల్స్ స్టార్ అశ్విని పొన్నప్ప తెలిపింది. -
చెరువుల సంరక్షణ కోసం ఆర్సీబీ
ఐపీఎల్ జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టింది.
తాజా వార్తలు (Latest News)
-
‘నానమ్మా.. మీ కోడలు పచ్చళ్లు సరిగ్గా చేయట్లేదా?’: ఉపాసన ఫన్నీ వీడియో
-
డేవిడ్, పొలార్డ్కు భారీ జరిమానా.. ‘డీఆర్ఎస్ సిగ్నల్’ వివాదమేనా కారణం?
-
పాకిస్థాన్కు ‘క్షిపణి’ సాయం.. చైనా సంస్థలపై అగ్రరాజ్యం ఆంక్షల కొరడా!
-
పవన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలి.. పిఠాపురంలో నేతల సంకల్పం
-
భారత విద్యార్థి మృతి.. మరోసారి చర్చలోకి బ్లూవేల్ ఛాలెంజ్..!
-
చిలుకూరు ఆలయంలో ‘వివాహ ప్రాప్తి’ రద్దు: ప్రధాన అర్చకులు రంగరాజన్