T20 League : టీ20 లీగ్.. ఆ రెండు జాబితాల టాపర్లు ఒకే జట్టు క్రికెటర్లు
టీ20 లీగ్లో లీగ్ దశ మ్యాచ్లు రసవత్తరంగా సాగుతున్నాయి. గత ఛాంపియన్లు ఢీలా...
బ్యాటింగ్లో బట్లర్.. బౌలింగ్లో చాహల్
(ఫొటో సోర్స్: బట్లర్ ట్విటర్)
ఇంటర్నెట్ డెస్క్: టీ20 లీగ్లో లీగ్ దశ మ్యాచ్లు రసవత్తరంగా సాగుతున్నాయి. గత ఛాంపియన్లు ఢీలా పడుతుండగా.. కొత్త జట్లు చెలరేగుతున్నాయి. ఆరంభంలో ఓటములతో లీగ్ను ప్రారంభించిన టీమ్లు వరుస విజయాలతో పాయింట్ల పట్టికలో దూసుకెళ్తున్నాయి. ఈ క్రమంలో టీ20 లీగ్లో ఇప్పటి వరకు జరిగిన 29 మ్యాచుల్లో భారీగా పరుగులు చేస్తున్న బ్యాటర్లు.. వికెట్లను కుప్పకూలుస్తున్న బౌలర్లు ఎవరో ఓసారి పరిశీలిద్దాం.. అలానే ఇప్పటి వరకు నమోదైన సిక్సర్లు, ఫోర్లలో ఏ బ్యాటర్ అధికంగా బాదారో కూడా తెలుసుకుందాం..
సెంచరీలు.. అత్యధిక పరుగుల వీరులు వీరే..
(ఫొటో సోర్స్: కేఎల్ రాహుల్ ట్విటర్)
మంచి ఫామ్లో ఉన్న బ్యాటర్లలో జోస్ బట్లర్ (రాజస్థాన్), కేఎల్ రాహుల్ (లఖ్నవూ) ముందున్నారు. వీరిద్దరే ఈ సీజన్లో ఇప్పటి వరకు సెంచరీలు నమోదు చేశారు. బట్లర్ (100) ముంబయి మీద శతకం చేయగా.. కేఎల్ రాహుల్ (103) కూడా రోహిత్ సేనపైనే సెంచరీ బాదడం విశేషం. ఇప్పటి వరకు జోస్ బట్లర్ ఐదు మ్యాచుల్లో ఒక శతకం, రెండు అర్ధశతకాలతో 272 పరుగులు చేసి అత్యధిక రన్స్ చేసిన జాబితాలో తొలి స్థానంలో ఉన్నాడు. బట్లర్ తర్వాత కేఎల్ రాహుల్ (235), హార్దిక్ పాండ్య (228), శివమ్ దూబే (226), లియామ్ లివింగ్స్టోన్ (224), డికాక్ (212), రాహుల్ త్రిపాఠి (205), ధావన్ (205), సూర్యకుమార్ (200), గిల్ (200) ఉన్నారు.
భారీగా సిక్సర్లు.. బౌండరీలు బాదేశారు
(ఫొటో సోర్స్: హార్దిక్ ట్విటర్)
అత్యధిక సిక్సర్లు బాదిన వారిలోనూ జోస్ బట్లర్ (రాజస్థాన్) అందరికంటే ముందున్నాడు. బట్లర్ 18 సిక్సర్లను కొట్టగా.. భారీ హిట్టర్ ఆండ్రూ రస్సెల్ (16), లియామ్ లివింగ్స్టోన్ (16), హెట్మయేర్ (15), దినేశ్ కార్తిక్ (14), శివమ్ దూబే (13), సూర్యకుఆమర్ యాదవ్ (12), రాబిన్ ఉతప్ప (12), రాహుల్ త్రిపాఠి (11), సంజూ శాంసన్ (10), కేఎల్ రాహుల్ (10) తర్వాతి స్థానాల్లో ఉన్నారు. సిక్సర్లు జాబితాలో టాప్- 10లోనే లేని హార్దిక్ పాండ్య అత్యధిక ఫోర్లు సాధించిన బ్యాటర్గా నిలిచాడు. హార్దిక్ ఇప్పటి వరకు 26 బౌండరీలను దంచేశాడు. తర్వాత డికాక్ (25), బట్లర్ (23), పృథ్వీ షా (22), ఇషాన్ కిషన్ (22), శిఖర్ ధావన్ (20), శుభ్మన్ గిల్ (20) భారీగా ఫోర్లను కొట్టారు.
వికెట్ల జాబితాకు తీవ్ర పోటీ
(ఫొటో సోర్స్: చాహల్, నటరాజన్ ట్విటర్)
ఈసారి బౌలర్ల ప్రదర్శన అద్భుతమనే చెప్పాలి. పిచ్ నుంచి పూర్తిగా సహకారం లభించకపోయినా మంచి లెంగ్త్లో బౌలింగ్ చేస్తున్నారు. అత్యధిక వికెట్ల జాబితాలో రాజస్థాన్ బౌలర్ యుజ్వేంద్ర చాహల్, హైదరాబాద్ యార్కర్ స్పెషలిస్ట్ టి.నటరాజన్ సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్నారు. వీరిద్దరూ ఇప్పటి వరకు చెరో 12 వికెట్లు తీశారు. అయితే చాహల్ ఎకానమీ (6.80) కంటే నటరాజన్ (8.66) ఎకానమీ ఎక్కవైనా కీలక సమయాల్లో వికెట్లు తీస్తూ హైదరాబాద్ విజయంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. వీరి తర్వాత కుల్దీప్ యాదవ్ (11), అవేశ్ ఖాన్ (11), వహిండు హసరంగ (11), ఉమేశ్ యాదవ్ (10), డ్వేన్ బ్రావో (10) ఉన్నారు. టీ20 లీగ్ బౌలర్లలో హర్షల్ పటేల్ మాత్రమే అధికంగా రెండు ఓవర్లను మెయిడిన్గా వేశాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పవర్ప్లేలో రెండు ఓవర్లు వేస్తేనే..: జస్ప్రీత్ బుమ్రా
పంజాబ్పై ముంబయి విజయం సాధించడంలో బుమ్రా కీలక పాత్ర పోషించాడు. తన తొలి ఓవర్లోనే రెండు వికెట్లను పడగొట్టి ముంబయి పైచేయి సాధించేలా చేశాడు. -
ఆలస్యమైన మ్యాచ్.. హార్దిక్ పాండ్యకు జరిమానా
ఎట్టకేలకు ముంబయి మళ్లీ మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్లో పంజాబ్పై కేవలం 9 పరుగుల తేడాతో విజయం సాధించింది. -
అంపైర్గా పని చేసి.. ఐపీఎల్లో అదరగొట్టి... నయా సంచలనం అశుతోష్ కథ ఇది!
ధనాధన్ షాట్లతో ముంబయి మీద విరుచుకుపడి ఓటమి భయం చూపించిన అశుతోష్ శర్మ గురించి ఆసక్తికర విషయాలు... -
ఇంపాక్ట్ ప్లేయర్తో నష్టమే
ఐపీఎల్ గతేడాది ప్రవేశ పెట్టిన ఇంపాక్ట్ ప్లేయర్ విధానం కారణంగా ఆల్రౌండర్లకు నష్టం కలుగుతోందని టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అభిప్రాయపడ్డాడు. -
ఆల్రౌండర్లకు దెబ్బ
టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ చెప్పినట్లు ఐపీఎల్లో ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన భారత ఆల్రౌండర్లకు చేటు చేస్తోంది. టీ20 ప్రపంచకప్లో తలపడే టీమ్ఇండియా ఎంపిక కోసం ఐపీఎల్ ప్రదర్శన కూడా పరిగణలోకి తీసుకుంటారనే చెప్పాలి. -
ప్చ్.. పంజాబ్
13 బంతులు.. 14 పరుగులు.. 4 వికెట్లు! 193 పరుగుల ఛేదనలో పంజాబ్ పరిస్థితిది! బుమ్రా లాంటి మేటి బౌలర్.. బెంబేలెత్తిస్తున్న నేపథ్యంలో ఆ జట్టు కనీసం పోటీలో ఉన్నట్లు కూడా కనపడలేదు. ముంబయి విజయం లాంఛనమేనని తీర్మానించారంతా! కానీ అశుతోష్ శర్మ అసాధారణ బ్యాటింగ్తో పంజాబ్ అద్భుతం చేసినంత పని చేసింది. -
అశుతోష్.. నయా మెరుపు
గుజరాత్తో పంజాబ్ మ్యాచ్.. లక్ష్యం 200.. 150కే 6 వికెట్లు పడిపోయాయి.. ఉన్న ఓవర్లు కూడా తక్కువే! అయినా చివరికి పంజాబ్ గెలిచింది! -
చమరి 195 నాటౌట్
మహిళల క్రికెట్లో శ్రీలంక నయా రికార్డు సృష్టించింది. చమరి ఆటపట్టు (195 నాటౌట్; 139 బంతుల్లో 26×4, 5×6) భారీ శతకంతో అదరగొట్టడంతో దక్షిణాఫ్రికాతో మ్యాచ్లో 302 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. -
ఇషా సత్తా చాటేనా!
హైదరాబాదీ షూటర్ ఇషా సింగ్కు సవాల్. పారిస్ ఒలింపిక్స్ టికెట్ కోసం ఆమె పోటీకి సిద్ధమైంది. శుక్రవారం కర్ణిసింగ్ రేంజ్లో ఆరంభమయ్యే సెలక్షన్ ట్రయల్స్లో మహిళల 25 మీటర్ల పిస్టల్ విభాగంలో ఇషా బరిలో దిగనుంది. -
కళ్లన్నీ వినేశ్ పైనే
పారిస్ ఒలింపిక్స్ కోటా స్థానాల వేటకు భారత రెజ్లర్లు సిద్ధమయ్యారు. శుక్రవారం ప్రారంభమయ్యే ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో అత్యుత్తమ ప్రదర్శనే లక్ష్యంగా బరిలో దిగుతున్నారు. -
నదిలో నాలుగు గంటలు
ఒలింపిక్స్ చరిత్రలోనే మొట్టమొదటిగా ఈ మెగా క్రీడల ఆరంభోత్సవ వేడుకలను ఆరుబయట నిర్వహించేందుకు పారిస్ సిద్ధమవుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
నేడు చంద్రబాబు తరఫున నామినేషన్.. నారా భువనేశ్వరి ప్రత్యేక పూజలు
-
ఓటేయకపోయినా పర్లేదు.. మీ కుమారుడిని ఆశీర్వదించండి: ఏకే ఆంటోనీకి రాజ్నాథ్ సూచన
-
పవర్ప్లేలో రెండు ఓవర్లు వేస్తేనే..: జస్ప్రీత్ బుమ్రా
-
భారాసకు మరో ఎమ్మెల్యే గుడ్బై!
-
రివ్యూ: పారిజాత పర్వం.. క్రైమ్ కామెడీ థ్రిల్లర్ ఎలా ఉంది?
-
‘రాకెట్లను అక్కడకు పంపిద్దాం’.. ఇరాన్-ఇజ్రాయెల్ ఘర్షణ వేళ మస్క్ పోస్ట్