T20 League: గుజరాత్ జట్టు గెలవడానికి కారణం అదే: సునీల్ గావస్కర్
టీ20 లీగ్లో అదరగొడుతున్న గుజరాత్ జట్టుపై భారత మాజీ కెప్టెన్ సునీల్ గావస్కర్ ప్రశంసల వర్షం కురిపించారు. గుజరాత్ తొలి 9 మ్యాచ్ల్లో 8 విజయాలు సాధించి దిగ్విజయంగా ముందుకు సాగింది.
ఇంటర్నెట్ డెస్క్: టీ20 లీగ్లో అదరగొడుతున్న గుజరాత్ జట్టుపై భారత మాజీ కెప్టెన్ సునీల్ గావస్కర్ ప్రశంసల వర్షం కురిపించారు. గుజరాత్ తొలి 9 మ్యాచ్ల్లో 8 విజయాలు సాధించి దిగ్విజయంగా ముందుకు సాగింది. కానీ, తన చివరి రెండు మ్యాచ్ల్లో ఓటమిపాలైంది. అయినా, గుజరాత్ పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే.. ఇప్పటికే గుజరాత్ 16 పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతోంది. ఇంకా ఆ జట్టు మూడు మ్యాచ్లు ఆడాల్సి ఉంది. వీటిల్లో ఏ ఒక్క మ్యాచ్లో విజయం సాధించిన ఆ జట్టు అధికారికంగా ప్లే ఆఫ్స్ బెర్త్ ఖాయం చేసుకుంటుంది. ఈ నేపథ్యంలోనే గుజరాత్ జట్టు ఆటతీరుపై సునీల్ గావస్కర్ మాట్లాడాడు. గుజరాత్ ఆటగాళ్లు భయం లేకుండా ఆడుతున్నారని ఆయన అన్నారు.
‘గుజరాత్ ఆటగాళ్లు బాగా రాణిస్తున్నారు. ఎందుకంటే వాళ్లు స్వేచ్ఛగా, భయం అనేది లేకుండా ఆడుతున్నారు. ఫలితం గురించి కూడా పెద్దగా ఆలోచించడం లేదు. తమ ఆట గురించి ప్రపంచం ఏమనుకుంటుందో అనే భయం వారిలో లేదు. అందుకే ఆ జట్టు విజయాలు సాధిస్తోంది. గుజరాత్ ఆటగాళ్లు తమ ఆటను ఆస్వాదిస్తూ పాజిటివ్ క్రికెట్ ఆడుతున్నారు ’ అని సునీల్ గావస్కర్ వివరించారు. ఇదిలా ఉండగా.. నేడు లఖ్నవూ, గుజరాత్ జట్లు తలపడనున్నాయి. రెండు జట్లు ప్రస్తుతం 16 పాయింట్లతో ఉన్నాయి. ఈ మ్యాచ్లో విజేతగా నిలిచిన జట్టు.. ఈ సీజన్లో ప్లే ఆఫ్స్కు అర్హత సాధించిన తొలి జట్టుగా నిలుస్తుంది.
మరోవైపు.. హార్దిక్ పాండ్య నాయకత్వం వహిస్తున్న గుజరాత్ జట్టుకు భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ మద్దతు పలికాడు. ‘గుజరాత్ జట్టు చాలా బలంగా ఉంది. రషీద్ఖాన్ మంచి ఫామ్లో ఉన్నాడు. లఖ్నవూతో జరిగే మ్యాచ్లో గుజరాత్ గెలుపొంది ఈ సీజన్లో ప్లే ఆఫ్స్కు అర్హత సాధించిన తొలి జట్టుగా నిలుస్తుంది. ఈ జట్టుని ఓడించడం కష్టం’ అని హర్భజన్ సింగ్ పేర్కొన్నాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
లఖ్నవూ.. అక్కడా ఇక్కడా!
ఐపీఎల్లో ఎంతో నిలకడగా ఆడే జట్లలో చెన్నై సూపర్కింగ్స్ ఒకటి. లఖ్నవూతో మ్యాచ్ అంటే చెన్నైనే ఎక్కువమంది ఫేవరెట్గా పరిగణిస్తారు. కానీ ఆ జట్టు చేతిలో సూపర్కింగ్స్కు వరుసగా రెండు ఓటములు తప్పలేదు. -
మెరిసిన జ్యోతి సురేఖ
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ మెరిసింది. మంగళవారం మహిళల కాంపౌండ్ అర్హత రౌండ్లో సురేఖ (711) రెండో స్థానం సాధించింది. ఆండ్రియా బెకెరా (713- మెక్సికో) అగ్రస్థానంలో నిలిచింది. -
శ్రీజ నం.1
అంతర్జాతీయ స్థాయిలో వరుస విజయాలతో సత్తా చాటుతున్న తెలుగమ్మాయి ఆకుల శ్రీజ మరో ఘనత అందుకుంది. టీటీ మహిళల సింగిల్స్లో కెరీర్లో అత్యుత్తమంగా 38వ ర్యాంకు సాధించిన శ్రీజ.. -
ఆసియా జూనియర్ అథ్లెటిక్స్కు ‘లక్ష్య’ హిమతేజ
ఈనాడు సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ క్రీడాకారుడు వల్లిపి హిమతేజ అంతర్జాతీయ వేదికపై సత్తాచాటేందుకు సిద్ధమయ్యాడు. బుధవారం ప్రారంభంకానున్న ఆసియా జూనియర్ (అండర్-20) అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో తన అదృష్టం పరీక్షించుకోనున్నాడు. -
టొరంటోలో భారత భూకంపం
అంచనాలను తలకిందులు చేస్తూ క్యాండిడేట్స్ చెస్ టోర్నీలో విజేతగా నిలిచిన భారత టీనేజ్ సంచలనం, గ్రాండ్మాస్టర్ గుకేశ్పై రష్యా దిగ్గజ క్రీడాకారుడు గ్యారీ కాస్పరోవ్ ప్రశంసల జల్లు కురిపించాడు. -
విండీస్కు ఆడను
టీ20 ప్రపంచకప్ కోసం రిటైర్మెంట్ వీడి తిరిగి అంతర్జాతీయ క్రికెట్లోకి రాబోనని వెస్టిండీస్ మాజీ బౌలింగ్ ఆల్రౌండర్ సునీల్ నరైన్ స్పష్టం చేశాడు. ఐపీఎల్లో కోల్కతా తరఫున అతడు విశేషంగా రాణిస్తున్న సంగతి తెలిసిందే. -
జకోవిచ్కు లారియస్ అవార్డు
టెన్నిస్ స్టార్ నొవాక్ జకోవిచ్.. లారియస్ స్పోర్ట్స్పర్సన్ ఆఫ్ ద ఇయర్ అవార్డును అందుకున్నాడు. మాడ్రిడ్లో జరిగిన లారియస్ అవార్డుల కార్యక్రమంలో అమెరికా జిమ్నాస్ట్ సిమోన్ బైల్స్.. కమ్బ్యాక్ ఆఫ్ ద ఇయర్ పురస్కారాన్ని గెలుచుకుంది. -
జుట్టు కత్తిరించడమే మార్గమనుకుని..
పారిస్ ఒలింపిక్స్ క్వాలిఫయర్స్ ఆరంభానికి ముందు రోజు బరువును తగ్గించుకోవడం కోసం చాలా ఇబ్బందిపడ్డానని వినేశ్ తెలిపింది. 50 కేజీల విభాగంలో పోటీపడాల్సి ఉండగా నిర్ణీత బరువు కంటే కాస్త ఎక్కువ ఉండడంతో కలవరం రేగిందని ఆమె తెలిపింది. -
అక్కడ బుర్ర పగిలిపోతుంది
చెన్నై సూపర్ కింగ్స్, ముంబయి ఇండియన్స్ జట్లలో పూర్తిగా భిన్నమైన సంస్కృతి ఉంటుందని భారత మాజీ ఆటగాడు అంబటి రాయుడు అన్నాడు. ముంబయికి గెలుపే లక్ష్యంగా ఉంటుందని.. చెన్నై మాత్రం ప్రక్రియపై నమ్మకం ఉంచుతుందని రాయుడు తెలిపాడు.