T20 World Cup 2022: టీ20 ప్రపంచకప్ విజేతకు దక్కే ప్రైజ్మనీ ఎంతంటే?
ఆస్ట్రేలియా వేదికగా అక్టోబర్ 16వ తేదీ నుంచి ప్రారంభమయ్యే టీ20 ప్రపంచకప్ ప్రైజ్మనీని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ప్రకటించింది. గతేడాది మాదిరిగానే ప్రైజ్మనీ ఉండటం గమనార్హం.
ఇంటర్నెట్ డెస్క్: ఆస్ట్రేలియా వేదికగా అక్టోబర్ 16వ తేదీ నుంచి ప్రారంభమయ్యే టీ20 ప్రపంచకప్ ప్రైజ్మనీని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ప్రకటించింది. గతేడాది ప్రైజ్మనీకి.. ఈసారి విజేతలకు దక్కే ప్రైజ్మనీకి తేడా లేదు. దాదాపు నెల రోజులపాటు జరిగే మెగా టోర్నీలో విజేతగా నిలిచే జట్టుకు 1.6 మిలియన్ డాలర్లు (దాదాపు రూ.13 కోట్లు) అందనుంది. అలాగే రన్నరప్నకు 0.8 మిలియన్ డాలర్లు (దాదాపు రూ.6.5 కోట్లు) దక్కనుంది. మొత్తం ప్రైజ్ మనీ కోసం 5.6 మిలియన్ డాలర్లు (దాదాపు 45.68 కోట్లు) వెచ్చిస్తున్నట్లు ఐసీసీ వెల్లడించింది.
ఇక సెమీఫైనల్లో ఓడిన ఒక్కో జట్టు 4 లక్షల డాలర్లను(రూ. 3.25 కోట్లు) సొంతం చేసుకుంటుంది. సూపర్-12లో నిష్క్రమించిన ఒక్కో టీమ్కు 70వేల డాలర్లు (రూ. 57 లక్షలు) అందుతాయి. అలాగే గత టీ20 ప్రపంచకప్ తరహాలోనే.. ఈసారి కూడా సూపర్-12 దశలో ఒక్కో విజయానికి అదనంగా 40వేల డాలర్లను (రూ.32 లక్షలు) ఆయా టీమ్లు అందుకుంటాయని ఐసీసీ పేర్కొంది. సూపర్-12 స్టేజ్లో మొత్తం 30 మ్యాచ్లు జరుగుతాయి. మొత్తం రూ. 9.60 కోట్లు బహుమతిగా అందుతుంది.
భారత్, అఫ్గానిస్థాన్, పాకిస్థాన్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా నేరుగా సూపర్-12 దశలో తలపడతాయి. నమీబియా, శ్రీలంక, నెదర్లాండ్స్, యూఏఈ, వెస్టిండీస్, స్కాట్లాండ్, ఐర్లాండ్, జింబాబ్వే టీమ్ల మధ్య జరిగే మ్యాచుల్లో విజేతలుగా నిలిచిన నాలుగు జట్లు సూపర్-12 దశకు అర్హత సాధిస్తాయి. మొదటి దశలో ఒక్కో మ్యాచ్లో విజేతగా నిలిచిన జట్టూ 40వేల డాలర్లను (రూ. 32 లక్షలు) సొంతం చేసుకుంటుంది. రౌండ్-1లో జరిగే 12 మ్యాచ్లకు 4.8 లక్షల డాలర్లను (రూ.3.84 కోట్లు) ప్రైజ్మనీగా ఐసీసీ ఇవ్వనుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘మిలిటరీ తరహా కోచ్’ అంటూ వీజ్ వ్యాఖ్యలు.. ఆండ్రి రస్సెల్ కౌంటర్
భారత్లో అత్యుత్తమ కోచ్ల్లో ఒకరైన చంద్రకాంత్ పండిత్పై నమీబియా ఆటగాడు చేసిన కామెంట్లు సంచలనంగా మారాయి. వాటిని కొట్టిపడేస్తూ ఆండ్రి రస్సెల్ కీలక వ్యాఖ్యలు చేశాడు. -
కేరళలోనూ రియాన్ గురించే అడిగేవారు.. ఇప్పుడు 15 మంది కీలకమే: సంజూ
ఐపీఎల్ 17వ సీజన్లో రాజస్థాన్ దూకుడు ప్రదర్శిస్తోంది. వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసి పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరుకుంది. -
మా అమ్మ ఇక్కడే ఉన్నారు.. 4 ఏళ్లుగా నా కష్టాలను చూశారు: రియాన్ పరాగ్
రాజస్థాన్ ఆటగాడు రియాన్ పరాగ్ ఈ ఐపీఎల్ సీజన్లో అదరగొట్టేస్తున్నాడు. దిల్లీపై భారీ ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నాడు. -
హార్దిక్ సవాళ్ల ప్రయాణం..
ముంబయి ఇండియన్స్ నుంచి గుజరాత్ టైటాన్స్కు వెళ్లి కెప్టెన్గా నిరూపించుకున్నాడు హార్దిక్ పాండ్య. -
పరాగ్ ఫటాఫట్
ఆరంభంలో దిల్లీ అదరహో.. రాజస్థాన్ పరిస్థితి చూసి జాలి పడే పరిస్థితి.. కానీ ఇన్నింగ్స్ అయ్యేసరికి రాయల్స్దే పైచేయి! ఛేదన ఆరంభంలో దిల్లీదే ఆధిపత్యం.. తర్వాత రాజస్థాన్ జోరు.. మళ్లీ డీసీ పైచేయి.. అంతలోనే రాయల్స్ దూకుడు! -
క్వార్టర్స్లో సింధు
మాడ్రిడ్ స్పెయిన్ మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో పీవీ సింధు జోరు కొనసాగుతోంది. -
విహారికి షోకాజ్ నోటీసు
టీమ్ఇండియా టెస్టు క్రికెటర్ హనుమ విహారికి ఆంధ్ర క్రికెట్ సంఘం (ఏసీఏ) షోకాజ్ నోటీసు జారీ చేసిన విషయం వెలుగులోకి వచ్చింది. -
ఐపీఎల్ అంటే క్రికెట్టేనా!
ఐపీఎల్ ఊహించని స్థాయిలో వృద్ధి చెందిందని, కొన్ని సార్లు ఈ లీగ్ అంటే క్రికెట్టేనా! అనే ఆశ్చర్యమూ కలుగుతుందని రాజస్థాన్ రాయల్స్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అభిప్రాయపడ్డాడు. -
నితిన్ అయిదోసారి..
భారత అంపైర్ నితిన్ మేనన్ అయిదోసారి ఐసీసీ ఎలైట్ ప్యానల్లో చోటు దక్కించుకున్నాడు. ఇం -
అమ్మో నైట్రైడర్స్ కోచ్
కోల్కతా నైట్రైడర్స్ కోచ్ చంద్రకాంత్ పండిత్ కోచింగ్ విధానాలపై ఆ జట్టు మాజీ ఆటగాడు, నమీబియా ఆల్రౌండర్ డేవిడ్ వీజ్ అసహనం వ్యక్తం చేశాడు. -
నీరజ్.. దోహా టోర్నీతో షూరూ
ఒలింపిక్ ఛాంపియన్ నీరజ్ చోప్రా ఈ సీజన్ను మే 10న ఆరంభమయ్యే డైమండ్ లీగ్ దోహా అంచె టోర్నీతో షురూ చేయనున్నాడు. -
బుమ్రాను ఎందుకు కొనసాగించలేదో?
సన్రైజర్స్ హైదరాబాద్తో మ్యాచ్లో ముంబయి ఇండియన్స్ హార్దిక్ పాండ్య బౌలింగ్ వ్యూహాలు అంతుచిక్కని విధంగా సాగాయని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ అన్నాడు. -
సూర్య ఇంకొన్ని రోజులు!
సూర్యకుమార్ యాదవ్ ఐపీఎల్-17లో ముంబయి ఇండియన్స్కు అందుబాటులోకి రావడానికి ఇంకొన్ని రోజులు సమయం పడుతుందని సమాచారం. -
కోల్కతా జట్టులోకి 16 ఏళ్ల స్పిన్నర్
గాయంతో ఈ ఐపీఎల్ సీజన్కు దూరమైన ముజీబ్ ఉర్ రెహ్మాన్ స్థానాన్ని మరో అఫ్గాన్ స్పిన్నర్ అల్లా గజన్ఫర్తో కోల్కతా నైట్రైడర్స్ భర్తీ చేసింది. -
ఐపీఎల్ తొలిరోజు వీక్షకులు 16.8 కోట్లు
వీక్షణలో ఐపీఎల్-17 కొత్త రికార్డు నెలకొల్పింది. -
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు జరిగింది. ముజీబ్ స్థానంలో అల్లాహ్ ఘజన్ఫర్, ప్రసీధ్ కృష్ణ స్థానంలో కేశవ్ మహరాజ్ జట్టులోకి వచ్చారు.
తాజా వార్తలు (Latest News)
-
ప్రధాని మోదీ, బిల్గేట్స్.. ‘చాయ్ పే చర్చ’
-
‘మిలిటరీ తరహా కోచ్’ అంటూ వీజ్ వ్యాఖ్యలు.. ఆండ్రి రస్సెల్ కౌంటర్
-
నిన్న అమెరికా, నేడు ఐరాస.. భారత అంతర్గత వ్యవహారాలపై వ్యాఖ్యలు!
-
మేనల్లుడికి అత్యున్నతాధికారి నజరానా!
-
ముఖ్యమంత్రితో ముఖాముఖిలో వాలంటీరు
-
కేరళలోనూ రియాన్ గురించే అడిగేవారు.. ఇప్పుడు 15 మంది కీలకమే: సంజూ