టాస్ గెలిస్తే ప్రపంచకప్ గెలిచేస్తారేమో!
టీ20 సిరీసులో టాస్ కీలకం అవుతుండటంపై ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ మైకేల్ వాన్ ఛలోక్తి విసిరాడు. చూస్తుంటే భారత్లో జరిగే ప్రపంచకప్లో మెరుగైన టాసర్ కప్ను కైవసం చేసుకుంటారేమోనని ట్వీట్ చేశాడు. ప్రస్తుతం భారత్, ఇంగ్లాండ్ టీ20 సిరీస్ గురించి ఆయన ఇలా స్పందించాడు....
మైకేల్ వాన్ చమత్కారం
ఇంటర్నెట్ డెస్క్: టీ20 సిరీసులో టాస్ కీలకం అవుతుండటంపై ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ మైకేల్ వాన్ ఛలోక్తి విసిరాడు. చూస్తుంటే భారత్లో జరిగే ప్రపంచకప్లో మెరుగైన టాసర్ కప్ను కైవసం చేసుకుంటారేమోనని ట్వీట్ చేశాడు. ప్రస్తుతం భారత్, ఇంగ్లాండ్ టీ20 సిరీస్ గురించి ఆయన ఇలా స్పందించాడు.
ఐదు టీ20 సిరీసులో ఇప్పటి వరకు మూడు మ్యాచులు జరిగాయి. మొదటి పోరులో ఇంగ్లాండ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమ్ఇండియా పేలవంగా ఆడింది. తక్కువ స్కోరే చేయడంతో మోర్గాన్ సేన విజయం సాధించింది. రెండో పోరులో కోహ్లీ టాస్ గెలిచాడు. తొలుత ఫీల్డింగ్ ఎంచుకొని ఆంగ్లేయులను దెబ్బకొట్టాడు. జట్టును గెలుపు బాట పట్టించాడు. మంగళవారం జరిగిన మూడో టీ20లోనూ ఇదే సన్నివేశం పునరావృతమైంది. టాస్ గెలిచిన మోర్గాన్ ఫీల్డింగ్ ఎంచుకొని కోహ్లీసేనను మోస్తరు స్కోరుకే పరిమితం చేశాడు. దాంతో ఇంగ్లాండ్ 2-1తో సిరీస్లో పైచేయి సాధించింది.
ఇలా టాస్ కీలకం అవుతుండటంతో వాన్ ట్వీట్ చేశాడు. ‘చూస్తుంటే భారత్లో జరిగే టీ20 ప్రపంచకప్లో అత్యుత్తమ టాసర్ విజేతగా నిలుస్తాడేమో అనిపిస్తోంది!!!’ అని పోస్ట్ చేశాడు. అయితే తమ ఓటములకు టాస్ను నిందించబోమని కోహ్లీ స్పష్టం చేశాడు. ‘ఒకవేళ టాస్ ఓడితే ప్రత్యర్థి అడిగింది చేయాలి. కొత్త బంతితో ఇంగ్లాండ్ బౌలర్లు అదరగొట్టాడు. తొలి ఆరు ఓవర్లలో అసలు పరుగులు చేయనివ్వలేదు. కఠినంగా బంతులేశారు. మేం పుంజుకొనేందుకు ప్రయత్నించినా రెండో అర్ధభాగంలో మా తీవ్రత, బలం తగ్గింది’ అని అన్నాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
T20 Worldcup 2024 - BCCI: వచ్చే టీ20 ప్రపంచకప్ కోసం ఏ 15 మందిని ఎంపిక చేస్తే బాగుంటుంది. -
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
ఐపీఎల్లో ఫినిషర్గా అదరగొడుతున్న ఎంఎస్ ధోనీ (MS Dhoni)ని టీ20 వరల్డ్కప్నకు ఎంపిక చేయాలనే ఆలోచనను పలువురు మాజీలు కోరుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
-
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!