IND vs ZIM: జింబాబ్వేని చిత్తు చేసి.. అగ్రస్థానంతో సెమీస్కు దూసుకెళ్లిన భారత్
టీ20 ప్రపంచ కప్ సూపర్ 12లో ఆఖరి మ్యాచ్లో టీమ్ఇండియా అదరగొట్టింది. జింబాబ్వేను చిత్తుగా ఓడించి ఇంగ్లాండ్తో సెమీస్ పోరుకు సిద్ధమైంది. గ్రూప్ -2లో ఎనిమిది పాయింట్లతో అగ్రస్థానంలోకి దూసుకెళ్లింది.
మెల్బోర్న్: టీ20 ప్రపంచ కప్ సూపర్ -12లో ఆఖరి మ్యాచ్లో టీమ్ఇండియా అదరగొట్టింది. జింబాబ్వేను చిత్తుగా ఓడించి ఇంగ్లాండ్తో సెమీస్ పోరుకు సై అంటోంది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమ్ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో సూర్యకుమార్ యాదవ్ (61; 25 బంతుల్లో), కేఎల్ రాహుల్ (51; 35 బంతుల్లో) అర్ధ శతకాలతో రాణించారు. అనంతరం లక్ష్య ఛేదనలో జింబాబ్వే.. భారత బౌలర్ల ధాటికి 115 పరుగులకే కుప్పకూలింది. దీంతో రోహిత్ సేన 71 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. జింబాబ్వే బ్యాటర్లలో రియాన్ బర్ల్ (35), సికిందర్ రజా (34) మాత్రమే పోరాడారు.
టీమ్ఇండియా బౌలర్ల జోరు.. జింబాబ్వే బ్యాటర్ల విలవిల
187 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వేకు ఇన్నింగ్స్ తొలి ఓవర్లోనే భువి షాకిచ్చాడు. మొదటి బంతికే మెదర్వె (0) కోహ్లీకి క్యాచ్ ఇచ్చి గోల్డెన్ డక్గా వెనుదిరిగాడు. అర్ష్దీప్ వేసిన రెండో ఓవర్లో నాలుగో బంతికి చకబ్వా (0) క్లీన్బౌల్డ్ అయ్యాడు. తర్వాత కొద్దిసేపు వికెట్ల పతనం ఆగినా పరుగులు మాత్రం రాలేదు. షమి వేసిన ఆరో ఓవర్లో చివరి బంతికి విలియమ్స్ (11) భువికి చిక్కాడు. హార్దిక్ వేసిన ఏడో ఓవర్లో ఎర్విన్ (13) హార్దిక్కే క్యాచ్ ఇవ్వగా.. షమీ వేసిన తర్వాతి ఓవర్లో టోనీ (5) ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. ఈ క్రమంలో పది ఓవర్లు పూర్తయ్యేసరికి స్కోరు 59-5గా నమోదైంది. అనంతరం జింబాబ్వే కాస్త పుంజుకుంది. అక్షర్ పటేల్ వేసిన 11వ ఓవర్లో 16, 13 ఓవర్లో 13వ పరుగులు రాబట్టింది. 16వ ఓవర్లో అశ్విన్ ఓవర్లో మసకద్జ (1), ఎన్గరవా (1)లను పెవిలియన్ చేర్చాడు. తర్వాతి ఓవర్లో సికిందర్ రజా కూడా ఔట్ కావడంతో జింబాబ్వే విజయంపై ఆశలు వదులుకుంది.
ఆఖరి ఐదు ఓవర్లలో సూర్యకుమార్ విధ్వంసం
15 ఓవర్లకు భారత్ స్కోరు 107/4. సూర్యకుమార్ 6 బంతుల్లో 5 పరుగులు. మ్యాచ్ మ్యాచ్ ముగిసే సమయానికి సూర్యకుమార్ స్కోరు 61. ఇదొక్కటి చాలు sky విధ్వంసం ఎలా సాగిందో చెప్పడానికి. మసకద్జ వేసిన 16వ ఓవర్లో రెండు ఫోర్లు బాదిన సూర్య.. ఎన్గరవా వేసిన తర్వాతి ఓవర్లో ఓ ఫోర్, సిక్స్ బాదాడు. చతారా వేసిన 18వ ఓవర్లోనూ ఇదే సీన్ రిపీట్ అయింది. ఆఖరి ఓవర్లో కూడా ఓ బౌండరీ, సిక్స్ బాదాడు. భారత్ చివరి ఐదు ఓవర్లలో 79 పరుగులు రాబట్టడం విశేషం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
త్వరలో ఫీల్డింగ్కు వస్తా.. 40 ఓవర్లూ మైదానంలో ఉంటా: సూర్య
‘ఇంపాక్ట్’ ప్లేయర్గా బరిలోకి దిగుతున్న సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) బ్యాటింగ్లో చెలరేగుతున్నాడు. విరామం తర్వాత బ్యాటింగ్లో మునుపటి సూర్యను చూస్తున్నామని అభిమానులు సంబరపడుతున్నారు. -
దుబాయ్ నుంచి ఆలస్యంగా పునియా, సుజీత్.. ఒలింపిక్ క్వాలిఫయర్స్ మిస్
Wrestlers: భారీ వర్షాల కారణంగా దుబాయ్లో చిక్కుకున్న భారత రెజ్లర్లు దీపక్ పునియా, సుజీత్.. ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్ దూరమయ్యారు. ఆలస్యంగా రావడంతో వారిని పోటీలకు అనుమతించలేదు. -
పవర్ప్లేలో రెండు ఓవర్లు వేస్తేనే..: జస్ప్రీత్ బుమ్రా
పంజాబ్పై ముంబయి విజయం సాధించడంలో బుమ్రా కీలక పాత్ర పోషించాడు. తన తొలి ఓవర్లోనే రెండు వికెట్లను పడగొట్టి ముంబయి పైచేయి సాధించేలా చేశాడు. -
ఆలస్యమైన మ్యాచ్.. హార్దిక్ పాండ్యకు జరిమానా
ఎట్టకేలకు ముంబయి మళ్లీ మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్లో పంజాబ్పై కేవలం 9 పరుగుల తేడాతో విజయం సాధించింది. -
అంపైర్గా పని చేసి.. ఐపీఎల్లో అదరగొట్టి... నయా సంచలనం అశుతోష్ కథ ఇది!
ధనాధన్ షాట్లతో ముంబయి మీద విరుచుకుపడి ఓటమి భయం చూపించిన అశుతోష్ శర్మ గురించి ఆసక్తికర విషయాలు... -
ఇంపాక్ట్ ప్లేయర్తో నష్టమే
ఐపీఎల్ గతేడాది ప్రవేశ పెట్టిన ఇంపాక్ట్ ప్లేయర్ విధానం కారణంగా ఆల్రౌండర్లకు నష్టం కలుగుతోందని టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అభిప్రాయపడ్డాడు. -
ఆల్రౌండర్లకు దెబ్బ
టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ చెప్పినట్లు ఐపీఎల్లో ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన భారత ఆల్రౌండర్లకు చేటు చేస్తోంది. టీ20 ప్రపంచకప్లో తలపడే టీమ్ఇండియా ఎంపిక కోసం ఐపీఎల్ ప్రదర్శన కూడా పరిగణలోకి తీసుకుంటారనే చెప్పాలి. -
ప్చ్.. పంజాబ్
13 బంతులు.. 14 పరుగులు.. 4 వికెట్లు! 193 పరుగుల ఛేదనలో పంజాబ్ పరిస్థితిది! బుమ్రా లాంటి మేటి బౌలర్.. బెంబేలెత్తిస్తున్న నేపథ్యంలో ఆ జట్టు కనీసం పోటీలో ఉన్నట్లు కూడా కనపడలేదు. ముంబయి విజయం లాంఛనమేనని తీర్మానించారంతా! కానీ అశుతోష్ శర్మ అసాధారణ బ్యాటింగ్తో పంజాబ్ అద్భుతం చేసినంత పని చేసింది. -
అశుతోష్.. నయా మెరుపు
గుజరాత్తో పంజాబ్ మ్యాచ్.. లక్ష్యం 200.. 150కే 6 వికెట్లు పడిపోయాయి.. ఉన్న ఓవర్లు కూడా తక్కువే! అయినా చివరికి పంజాబ్ గెలిచింది! -
చమరి 195 నాటౌట్
మహిళల క్రికెట్లో శ్రీలంక నయా రికార్డు సృష్టించింది. చమరి ఆటపట్టు (195 నాటౌట్; 139 బంతుల్లో 26×4, 5×6) భారీ శతకంతో అదరగొట్టడంతో దక్షిణాఫ్రికాతో మ్యాచ్లో 302 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. -
ఇషా సత్తా చాటేనా!
హైదరాబాదీ షూటర్ ఇషా సింగ్కు సవాల్. పారిస్ ఒలింపిక్స్ టికెట్ కోసం ఆమె పోటీకి సిద్ధమైంది. శుక్రవారం కర్ణిసింగ్ రేంజ్లో ఆరంభమయ్యే సెలక్షన్ ట్రయల్స్లో మహిళల 25 మీటర్ల పిస్టల్ విభాగంలో ఇషా బరిలో దిగనుంది. -
కళ్లన్నీ వినేశ్ పైనే
పారిస్ ఒలింపిక్స్ కోటా స్థానాల వేటకు భారత రెజ్లర్లు సిద్ధమయ్యారు. శుక్రవారం ప్రారంభమయ్యే ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో అత్యుత్తమ ప్రదర్శనే లక్ష్యంగా బరిలో దిగుతున్నారు. -
నదిలో నాలుగు గంటలు
ఒలింపిక్స్ చరిత్రలోనే మొట్టమొదటిగా ఈ మెగా క్రీడల ఆరంభోత్సవ వేడుకలను ఆరుబయట నిర్వహించేందుకు పారిస్ సిద్ధమవుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
మీ ప్రాంతంలో బ్రాడ్బ్యాండ్ సేవలందించే సంస్థలేవో ఎలా తెలుసుకోవాలి?
-
మహబూబ్నగర్ ఎంపీ అభ్యర్థిగా వంశీచంద్రెడ్డి నామినేషన్.. ర్యాలీలో పాల్గొన్న సీఎం రేవంత్
-
త్వరలో ఫీల్డింగ్కు వస్తా.. 40 ఓవర్లూ మైదానంలో ఉంటా: సూర్య
-
వైకాపా అడ్డుపడుతోంది.. మీ ఇళ్ల వద్దకు రాలేకపోతే మన్నించండి: సునీత
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
దుబాయ్ నుంచి ఆలస్యంగా పునియా, సుజీత్.. ఒలింపిక్ క్వాలిఫయర్స్ మిస్