T20 World Cup: తడబడిన నమీబియా బ్యాటర్లు.. టీమ్‌ఇండియాకు స్వల్ప లక్ష్యం

టీ20 ప్రపంచకప్‌లో నమీబియాతో నామమాత్రమైన ఆఖరి మ్యాచ్‌లో భారత బౌలర్లు రాణించారు. టాస్‌ నెగ్గిన టీమ్‌ఇండియా కెప్టెన్ విరాట్‌ కోహ్లీ బౌలింగ్ ఎంచుకున్నాడు

Updated : 08 Nov 2021 21:14 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: టీ20 ప్రపంచకప్‌లో నమీబియాతో నామమాత్రమైన ఆఖరి మ్యాచ్‌లో భారత బౌలర్లు రాణించారు. టాస్‌ నెగ్గిన టీమ్‌ఇండియా కెప్టెన్ విరాట్‌ కోహ్లీ బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో తొలుత బ్యాటింగ్‌ చేసిన నమీబియా నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 132 పరుగులు చేసింది. దీంతో భారత్‌కు 133 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని నిర్దేశించింది. డేవిడ్ వైజ్ (26), బార్డ్‌ (21) తప్ప మిగతా అందరూ విఫలమయ్యారు. నమీబియా బ్యాటర్లలో మైకెల్ 14, క్రెయిగ్‌ డకౌట్, ఎరాస్మస్ 12, జాన్‌ నికోల్‌ 5, స్మిత్ 9, ఫ్రైలింక్‌ 15*, రుబెన్ 13* పరుగులు చేశారు. 47 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయిన నమీబియాను కెప్టెన్‌ ఎరాస్మస్‌తో కలిసి వైజ్ కాస్త ఆదుకున్నాడు. అయితే స్వల్ప వ్యవధిలో వికెట్లను కోల్పోవడంతో ఇబ్బందుల్లో పడింది. చివర్లో ఫ్రైలింక్, రుబెన్ ధాటిగా ఆడటంతో నమీబియా స్కోరు 130 దాటింది. భారత బౌలర్లలో జడేజా 3, అశ్విన్‌ 3, బుమ్రా 2 వికెట్లు పడగొట్టారు. 

Read latest Sports News and Telugu News

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని