IND vs NZ: జడేజాను నాలుగో స్థానంలో ఆడించాలి: మనోజ్ తివారి
టీమ్ఇండియా నాలుగోస్థానంలో ఆల్రౌండర్ రవీంద్ర జడేజాను ఆడించాలని బెంగాల్ క్రికెటర్ మనోజ్ తివారి అభిప్రాయపడ్డాడు. పాకిస్థాన్తో టీమ్ఇండియా ఓటమికి బ్యాటింగ్ వైఫల్యమే కారణమన్నాడు...
ఇంటర్నెట్డెస్క్: టీమ్ఇండియా నాలుగోస్థానంలో ఆల్రౌండర్ రవీంద్ర జడేజాను ఆడించాలని బెంగాల్ క్రికెటర్ మనోజ్ తివారి అభిప్రాయపడ్డాడు. పాకిస్థాన్తో టీమ్ఇండియా ఓటమికి బ్యాటింగ్ వైఫల్యమే కారణమన్నాడు. తాజాగా ఓ క్రీడాఛానల్తో మాట్లాడిన అతడు టీమ్ఇండియా ఆటతీరుపై స్పందించాడు. ఈ క్రమంలోనే పాక్తో ఓటమి, తిరిగి పుంజుకునే విషయాలపై తన ఆలోచనలు పంచుకున్నాడు. కోహ్లీసేన బ్యాటింగ్ ఆర్డర్ పరిస్థితులకు అనుగుణంగా ఉండాలని, టాప్ఆర్డర్ వైఫల్యమే దాయాదుల పోరులో ఓటమికి కారణమైందని వెల్లడించాడు.
అలాగే టాప్ఆర్డర్లో నలుగురు ఆటగాళ్లు కుడిచేతివాటం గల బ్యాట్స్మెన్ ఉన్నారని, అలా కాకుండా నాలుగో స్థానంలో ఎడమచేతి వాటంగల జడేజాను పంపించాలన్నాడు. అలా చేస్తే బౌలర్లకు ఇబ్బందిగా మారి లైన్ అండ్ లెంగ్త్లో బౌలింగ్ చేయలేరని చెప్పాడు. అయితే, ఆ స్థానంలో టీమ్ఇండియా.. సూర్యకుమార్ లేదా రిషభ్పంత్ను పంపుతోందని పేర్కొన్నాడు. కానీ, జడేజా ఇటీవలి కాలంలో మంచి ఫామ్లో ఉన్నాడన్నాడు. అతడు స్రైక్ రొటేట్ చేస్తూ బౌండరీలు బాదుతూ పరుగులు సాధిస్తాడన్నాడు. అతడిని నాలుగో స్థానంలో బ్యాటింగ్కు పంపే ప్రయత్నం చేయాలన్నాడు. టీమ్ఇండియా మంచి అనుభవం కలిగిన జట్టని, ఇకపై ఆడే ప్రతి గేమ్ మంచి రన్రేట్తో గెలవాలని కోరాడు. న్యూజిలాండ్తో పోరులో కోహ్లీ సేన విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కేఎల్ రాహుల్ కెప్టెన్ ఇన్నింగ్స్.. చెన్నైకి చెక్
ఏక్నా స్టేడియంలోని నెమ్మదైన పిచ్పై స్కోరు 160 దాటిందంటే ఛేదన కష్టమే. ఓ దశలో చెన్నై 150 అయినా చేస్తుందా అనుకుంటే.. గత మ్యాచ్లో ముంబయిపై చెలరేగినట్లే మహేంద్రసింగ్ ధోని ఈ మ్యాచ్లోనూ ఆఖర్లో మెరుపు ఇన్నింగ్స్ ఆడడంతో చెన్నై స్కోరు 176కు చేరుకుంది. -
ధోని.. ఇంకా నాటౌటే
చివరి సీజన్గా భావిస్తున్న ఈ ఐపీఎల్లో బ్యాటింగ్ చేస్తోంది తక్కువసేపే అయినా అభిమానులను ఉర్రూతలూగిస్తున్నాడు ధోని. -
కుర్రాళ్లు కుమ్మేస్తున్నారు
ఛేదనలో నాలుగైదు వికెట్లు పడ్డాయా? అయినా భయం లేదు తామున్నామంటూ సత్తాచాటుతున్నారు. -
బుమ్రా బౌలింగ్లో స్వీప్ షాట్.. నా కల!
అశుతోష్ శర్మ.. ఈ ఐపీఎల్లో గట్టిగా వినిపిస్తున్న కొత్త పేరు. -
రేసులో గుకేశ్ ఒక్కడే..
క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్లో భారత యువ కెరటం గుకేశ్ మళ్లీ ఆధిక్యంలోకి వచ్చాడు. -
మెరిసిన ఇషా, భవేష్
ఒలింపిక్స్ సెలెక్షన్ ట్రయల్స్లో అగ్రశ్రేణి షూటర్లు ఇషా సింగ్, భవేష్ షెకావత్ మెరిశారు. -
దీపకు నాలుగో స్థానం
దోహాలో జరిగిన జిమ్నాస్టిక్స్ ప్రపంచకప్ను భారత స్టార్ దీప కర్మాకర్ నాలుగో స్థానంతో ముగించింది. -
భారత రెజ్లర్లు విఫలం
ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో భారత పురుష రెజ్లర్లు విఫలమయ్యారు. -
విమానం ఆలస్యమై...
భారత ఉత్తమ రెజ్లర్లలో ఇద్దరైన దీపక్ పునియా (86 కేజీలు), సుజీత్ కలాకల్ (65 కేజీలు)కు నిరాశ తప్పలేదు. -
రాకెట్ వదిలేద్దాం అనుకున్నా
గత కొన్నేళ్లలో కెరీర్లో ఎంతో క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొన్నానని.. ఒకటికి రెండుసార్లు బ్యాడ్మింటన్కు వీడ్కోలు చెప్పాలని భావించానని భారత డబుల్స్ స్టార్ అశ్విని పొన్నప్ప తెలిపింది. -
చెరువుల సంరక్షణ కోసం ఆర్సీబీ
ఐపీఎల్ జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టింది.
తాజా వార్తలు (Latest News)
-
తెదేపా కార్యాలయం వద్ద టాస్క్ఫోర్స్ కదలికలు
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?