T20 World Cup: స్కాట్లాండ్‌ను కుప్పకూల్చిన టీమ్‌ఇండియా

కీలకమైన మ్యాచ్‌లో భారత బౌలర్లు చెలరేగిపోయారు. టీమ్‌ఇండియా బౌలర్‌ మహమ్మద్‌ షమీ (3/14), జడేజా (3/15) స్కాట్లాండ్‌ను తీశారు. టాస్‌ నెగ్గిన కోహ్లీ బౌలింగ్‌

Published : 06 Nov 2021 02:01 IST

ఇంటర్నెట్‌ డెస్క్: కీలకమైన మ్యాచ్‌లో భారత బౌలర్లు చెలరేగిపోయారు. టీమ్‌ఇండియా బౌలర్‌ మహమ్మద్‌ షమీ (3/14), జడేజా (3/15) స్కాట్లాండ్‌ను దెబ్బ తీశారు. టాస్‌ నెగ్గిన కోహ్లీ బౌలింగ్‌ ఎంచుకుని స్కాట్లాండ్‌కు బ్యాటింగ్‌ అప్పగించాడు. భారత బౌలర్ల ధాటికి స్కాట్లాండ్‌ 17.4 ఓవర్లలో 85 పరుగులకే కుప్పకూలింది. దీంతో భారత్‌కు 86 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని స్కాట్లాండ్‌ నిర్దేశించింది. జార్జ్‌ మున్సీ (24), లీస్క్‌ (21) కాస్త ఫర్వాలేదనిపించినా.. మిగిలిన బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. స్కాట్లాండ్‌ బ్యాటర్లలో ముగ్గురు డకౌట్‌గా వెనుదిరిగారు. రిచీ బెరింగ్‌టన్‌, షరిఫ్, ఈవన్స్‌ పరుగులేమీ చేయకుండా ఔట్‌ అయ్యారు. కెప్టెన్‌ కోట్జర్‌ (1), క్రాస్‌ (2), గ్రీవ్స్‌ (1) సింగిల్‌ డిజిట్‌కే పరిమితయ్యారు. మెక్‌లాయిడ్‌ 16, వాట్‌ 24 పరుగులు చేశారు. భారత బౌలర్లలో షమీ 3, జడేజా 3.. బుమ్రా 2, అశ్విన్‌ ఒక వికెట్‌ పడగొట్టారు. 86 పరుగుల లక్ష్యాన్ని 11.2 ఓవర్లలోపే ఛేదిస్తే.. టీమ్‌ఇండియా నెట్‌రన్‌రేట్‌ +1.000లోకి వచ్చేస్తుంది. 7.1 ఓవర్లలోపే ఛేదిస్తే అఫ్గానిస్థాన్‌ (+1.481)ను దాటేస్తుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని