T20 World Cup: కివీస్ ఘన విజయం.. సెమీస్ రేసులో ముందడుగు
షార్జా వేదికగా నమీబియాతో జరిగిన మ్యాచ్లో న్యూజిలాండ్ 52 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన...
ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచకప్లో న్యూజిలాండ్ వరుసగా మూడో విజయాన్ని నమోదు చేసింది. నమీబియాపై ఘన విజయం సాధించింది. దీంతో గ్రూప్-2లో సెమీస్ అవకాశాలను మరింత మెరుగుపరుచుకుంది. పాకిస్థాన్ (8 పాయింట్లు) ఇప్పటికే సెమీస్కు చేరుకోగా.. కివీస్ (6 పాయింట్లు), అఫ్గానిస్థాన్ (4 పాయింట్లు) రెండో సెమీస్ బెర్తు కోసం ముందు వరుసలో ఉన్నాయి. కివీస్ తన ఆఖరి మ్యాచ్ను అఫ్గాన్తోనే నవంబర్ 8న తలపడనుంది. ఆ మ్యాచ్లో న్యూజిలాండ్ గెలిస్తే నేరుగా సెమీస్కు వెళ్లిపోతుంది. భారత్, ఆఫ్గాన్ ఇంటిముఖం పట్టక తప్పదు. ఒకవేళ అఫ్గాన్ విజయం సాధిస్తే నెట్ రన్రేట్ కీలకం కానుంది. భారత్ తన రెండు మ్యాచుల్లోనూ (నవంబర్ 5 స్కాట్లాండ్పై, నవంబర్ 8న నమీబియాపై) గెలిచినా.. ఇతర జట్ల ఫలితాలపై సెమీస్ భవితవ్యం ఆధారపడి ఉంది.
షార్జా వేదికగా నమీబియాతో జరిగిన మ్యాచ్లో న్యూజిలాండ్ 52 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. అనంతరం 164 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన నమీబియా ఏడు వికెట్ల నష్టానికి 111 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఓపెనర్లు స్టీఫెన్ బార్డ్ (21: రెండు ఫోర్లు), మైకెల్ వాన్ లింగెన్ (25: రెండు ఫోర్లు, ఒక సిక్స్) నిలకడగా ఆడుతూ తొలి వికెట్కు 47 పరుగులు జోడించారు. అయితే స్వల్ప వ్యవధిలో వీరిద్దరితోపాటు కెప్టెన్ ఎరాస్మస్ (3) ఔట్ కావడం నమీబియాను దెబ్బతీసింది. అనంతరం వచ్చిన గ్రీన్ (23)తో కలిసి డేవిడ్ వైజ్ (16) ఇన్నింగ్స్ను నిలబెట్టేందుకు ప్రయత్నించాడు. అయితే ఛేదించాల్సిన రన్రేట్ పెరిగిపోవడంతో దూకుడుగా ఆడే క్రమంలో కివీస్ బౌలర్ సౌథీకి వికెట్ల ముందు దొరికిపోయాడు. అప్పటికే నమీబియా ఓటమి ఖాయమైపోయింది. జేజే స్మిత్ 9*, రుబెన్ 6* నాటౌట్గా నిలిచారు. న్యూజిలాండ్ బౌలర్లలో సౌథీ 2.. సాట్నర్, నీషమ్, సోధి తలో వికెట్ తీశారు.
ఆఖర్లో దంచికొట్టారు..
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్కు చేసిన కివీస్కు శుభారంభం దక్కలేదు. ఓపెనర్లు గప్తిల్ (18), మిచెల్ (19) దూకుడును నమీబియా బౌలర్లు అడ్డుకోగలిగారు. అయితే తర్వాత వచ్చిన విలియమ్సన్ (28) ఫర్వాలేదనిపించినా.. కీలక సమయంలో ఔటైపోయాడు. కాన్వే (17) ఎక్కువ సేపు నిలవలేదు. అప్పటి వరకు కట్టుదిట్టంగా బౌలింగ్ చేసిన నమీబియా బౌలర్లు చివర్లో పట్టు సడలించారు. దీంతో ఆఖర్లో కివీస్ బ్యాటర్లు గ్లెన్ ఫిలిప్స్ (39*), నీషమ్ (35*) చెలరేగిపోయారు. వీరిద్దరూ కలిసి ఆరు ఓవర్లలో 76 పరుగులు రాబట్టారు. దీంతో తక్కువ స్కోరుకే పరిమితమవుతుందని అనుకున్న కివీస్ మంచి లక్ష్యాన్నే ప్రత్యర్థి ఎదుట ఉంచింది. నమీబియా బౌలర్లలో స్కాల్జ్, వైజ్, ఎరాస్మస్ తలో వికెట్ పడగొట్టారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారత క్రికెట్లో నీ భాగస్వామ్యం ఏంటి?: హర్షా భోగ్లేపై మాజీ క్రికెటర్ ఆగ్రహం
ఐపీఎల్లో చెన్నై జట్టును తక్కువ చేయడం సరికాదని భారత మాజీ క్రికెటర్ శివరామకృష్ణన్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. -
అదంతా ఫేక్ న్యూస్.. నేనెవరినీ కలవలేదు: రోహిత్ శర్మ
పొట్టి కప్ కోసం జట్టు ఎంపికపై ఇప్పటి వరకు తానెవరినీ కలవలేదని భారత కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) స్పష్టం చేశాడు. -
ఆ లక్ష్యంతోనే బరిలోకి దిగాం : రిషభ్ పంత్
భారీ విజయంతో దిల్లీ పాయింట్ల పట్టికలో తన స్థానాన్ని మెరుగు పర్చుకుంది. సొంతమైదానంలోనే గుజరాత్ను చిత్తు చేసి ఈ సీజన్ ఐపీఎల్లో దిల్లీ మూడో విజయాన్ని నమోదు చేసింది. -
అత్యంత ప్రభావశీలుర జాబితాలో సాక్షి
టైమ్ మ్యాగజైన్ 2024 అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల జాబితాలో భారత రెజ్లర్ సాక్షి మలిక్ చోటు దక్కించుకుంది. భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) మాజీ అధ్యక్షుడు బ్రిజ్భూషణ్ శరణ్ సింగ్పై పోరాటానికి గాను సాక్షికి ఈ గౌరవం లభించింది. -
భళా పంత్!.. అదరగొడుతున్న దిల్లీ కెప్టెన్
రోడ్డు ప్రమాదం కారణంగా 15 నెలల విరామం తర్వాత పంత్ మైదానంలో అడుగుపెడుతుంటే.. అతనెలా ఆడతాడో అని ఎన్నో సందేహాలు! కానీ ఈ ఐపీఎల్లో అతను అదరగొడుతున్నాడు. -
గుజరాత్ ఢమాల్
ఓవైపు ముంబయి ఇండియన్స్ కెప్టెన్ అయ్యాక హార్దిక్ పాండ్య తేలిపోతున్నాడు. మరోవైపు హార్దిక్ సారథ్యంలో గత రెండు సీజన్లలో అద్భుత ప్రదర్శన చేసిన గుజరాత్ టైటాన్స్.. అతను దూరమయ్యాక ఇబ్బంది పడుతోంది. -
ఒలింపిక్స్లో రష్యా అథ్లెట్లు ఉంటారా?
మరో వంద రోజుల్లోనే పారిస్ ఒలింపిక్స్ ఆరంభమవుతాయి. జులై 26న ప్రారంభోత్సవ వేడుకలు జరుగుతాయి. ఒలింపిక్స్ కోసం దేశాలన్నీ సిద్ధమవుతున్న తరుణంలో రష్యా ఈ మెగా క్రీడల్లో పాల్గొనడంపై సందిగ్ధత నెలకొంది. -
నరైన్ కోసం..
టీ20 ప్రపంచకప్ నేపథ్యంలో అంతర్జాతీయ రిటైర్మెంట్ వీడాలని సునీల్ నరైన్కు నచ్చజెప్పేందుకు ప్రయత్నిస్తున్నామని వెస్టిండీస్ కెప్టెన్ రోమన్ పావెల్ అన్నాడు. నరైన్ ఐపీఎల్లో కోల్కతా తరఫున విశేషంగా రాణిస్తోన్న సంగతి తెలిసిందే. -
షారుక్ను కలిసిన వేళ
యశస్వి జైస్వాల్.. ఇప్పుడీ యువ ఓపెనర్ పేరు తెలియని క్రికెట్ అభిమానులు ఉండరంటే అతిశయోక్తి కాదు. దూకుడైన ఆటతీరుతో ఎంతోమంది అభిమానులను అతను సంపాదించుకున్నాడు. -
శీతల్ మళ్లీ అదుర్స్
భారత సంచలన పారా ఆర్చర్ శీతల్ దేవి మళ్లీ అదుర్స్ అనిపించింది. రెండు చేతులు లేకపోయినా ఆర్చరీలో పతకాల పంట పండిస్తున్న ఈ 17 ఏళ్ల అమ్మాయి.. తాజాగా సాధారణ (అన్ని శరీర భాగాలు సక్రమంగా ఉన్న) ఆర్చర్లతో పోటీపడి మరీ సత్తాచాటింది. -
ఫైనల్లో దీప
భారత స్టార్ జిమ్నాస్ట్ దీప కర్మాకర్ జిమ్నాస్టిక్స్ ప్రపంచకప్ వాల్ట్ విభాగంలో ఫైనల్కు అర్హత సాధించింది. 30 ఏళ్ల దీప క్వాలిఫయింగ్ రౌండ్ తొలి వాల్ట్లో 12.5, రెండో వాల్ట్లో 13.066.. మొత్తంగా 12.783 సగటు స్కోరు సాధించి నాలుగో స్థానంలో నిలిచింది. -
శ్రీజ, మనిక పరాజయం
ఐటీటీఎఫ్ ప్రపంచకప్లో భారత టేబుట్ టెన్నిస్ క్రీడాకారిణులు ఆకుల శ్రీజ, మనిక బాత్రా పోరాటం గ్రూపు దశలోనే ముగిసింది. గ్రూపు దశలో ఒక్కో విజయం, ఓటమితో ద్వితీయ స్థానాల్లో నిలిచిన శ్రీజ, మనిక నాకౌట్కు అర్హత సాధించలేకపోయారు. -
ధోని, కోహ్లీని అనుకరించా: బట్లర్
భారీ లక్ష్యాన్ని ఛేదించడం కోసం భారత స్టార్లు మహేంద్రసింగ్ ధోని, విరాట్ కోహ్లీని అనుకరించినట్లు రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్ జోస్ బట్లర్ అన్నాడు. గాయం కారణంగా పంజాబ్ కింగ్స్తో మ్యాచ్ ఆడలేకపోయిన బట్లర్..
తాజా వార్తలు (Latest News)
-
భద్రాచలంలో కనులపండువగా శ్రీరామ మహా పట్టాభిషేకం
-
ఫస్ట్ టైమ్ ఓటర్లకు ఎయిరిండియా ఎక్స్ప్రెస్ ఆఫర్
-
పెద్ద కోటల్లో ఉండే జగన్.. ఎన్నికల వేళ బయటకు వస్తున్నారు: షర్మిల
-
ఎన్నికల ప్రక్రియ పవిత్రంగా ఉండాలి: సుప్రీంకోర్టు
-
వివేకా వ్యక్తిగత జీవితాన్ని బయటపెట్టి తీవ్రంగా అవమానిస్తున్నారు: సునీత
-
జాబిల్లిపై చైనా ముందే కాలుమోపితే.. అక్రమణలే: నాసా అధిపతి వ్యాఖ్యలు