Mariyappan Thangavelu: మరియప్పన్‌కు ప్రభుత్వ ఉద్యోగం.. అపాయింట్‌మెంట్‌ లెటర్‌ ఇచ్చిన సీఎం

టోక్యో పారాలింపిక్స్‌లో రజతం సాధించిన మరియప్పన్‌ తంగవేలుకు తమిళనాడు ప్రభుత్వం ఉద్యోగం ఇచ్చింది. టీఎన్‌పీఎల్‌లో సేల్స్‌ విభాగంలో.....

Published : 03 Nov 2021 19:22 IST

చెన్నై: టోక్యో పారాలింపిక్స్‌లో రజతం సాధించిన మరియప్పన్‌ తంగవేలుకు తమిళనాడు ప్రభుత్వం ఉద్యోగం ఇచ్చింది. టీఎన్‌పీఎల్‌లో సేల్స్‌ విభాగంలో ఆయన్ను డిప్యూటీ మేనేజర్‌గా నియమించి గౌరవించింది. ఈ మేరకు సీఎం ఎంకే స్టాలిన్‌ తన కార్యాలయంలో మరియప్పన్‌కు నియామక పత్రాన్ని అందజేశారు. ఈ ఫొటోను తన ట్విటర్‌లో షేర్‌ చేశారు. ఇది గుర్తింపు కోసం ఇస్తున్న ఉద్యోగం కాదనీ.. ఏదో సాధించాలన్న తపనతో ఎదురుచూస్తున్నవారికి ప్రభుత్వం కల్పిస్తోన్న ప్రోత్సాహమని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.

ఈ ఏడాది టోక్యో ఒలింపిక్స్‌, పారాలింపిక్స్‌లో మన దేశ క్రీడాకారులు అసమాన ప్రతిభకనబరిచి పతకాలు సాధించి గర్వకారణంగా నిలిచారు. పారాలింపిక్స్‌లో పురుషుల హైజంప్‌ టీ-42 ఈవెంట్‌లో మరియప్పన్‌ తంగవేలు రజతంతో మెరిసిన విషయం తెలిసిందే. రజతం సాధించి తమిళనాడు కీర్తిని చాటిన మరియప్పన్‌ తంగవేలుకు ఉద్యోగం ఇస్తామని తమిళనాడు సీఎం స్టాలిన్‌ హామీ ఇచ్చారు. ఇందులో భాగంగా బుధవారం మరియప్పన్‌కు ఉద్యోగ నియామక పత్రం అందించి తన హామీని నిలబెట్టుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని