IND vs SA: దంచికొట్టిన బ్యాటర్లు.. టీమ్ఇండియా ఘన విజయం
దక్షిణాఫ్రికాతో జరుగుతున్న నిర్ణయాత్మక రెండో వన్డేలో టీమ్ఇండియా విజృంభించి ఘన విజయం సాధించింది. శ్రేయస్ అయ్యర్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. ఇషాన్ కిషన్, మహ్మద్ సిరాజ్ రాణించారు.
ఇంటర్నెట్ డెస్క్: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో వన్డేలో భారత్ ఘన విజయం సాధించింది. 279 పరుగుల లక్ష్యాన్ని భారత్ మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. శ్రేయస్ అయ్యర్ (113*) సెంచరీతో చెలరేగాడు. ఓపెనర్లు శిఖర్ ధావన్ (13), శుభ్మన్ గిల్ (28) స్వల్ప స్కోర్లకే ఔటైనప్పటికీ.. శ్రేయస్ అయ్యర్-ఇషాన్ కిషన్ జోడీ అద్భుతంగా రాణించింది. నిలకడగా బ్యాటింగ్ చేస్తూ ఈ ఇద్దరూ ఇన్నింగ్స్ను చక్కదిద్దారు. ఆపై కుదురుకున్నాక చెలరేగిపోయారు. ముఖ్యంగా ఇషాన్ సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. ఇషాన్ కిషన్ 93 పరుగుల వద్ద ఔటై సెంచరీ మిస్సయినప్పటికీ.. అయ్యర్ (113*) శతకం బాదాడు. శాంసన్తో (30*) జట్టుకట్టి టీమ్ఇండియాను విజయ తీరాలకు చేర్చాడు. శ్రేయస్కు వన్డేల్లో ఇది రెండో సెంచరీ కావడం విశేషం.
అంతకుముందు సఫారీ జట్టు బ్యాటర్లు ఐదెన్ మార్క్రమ్ (79), రీజా హెండ్రిక్స్ (74) రాణించి భారత్ ముందు మెరుగైన లక్ష్యాన్ని ఉంచారు. ఈ ఇద్దరి దూకుడు చూస్తే ఆ జట్టు 300లకు పైగా స్కోరు చేస్తుందని అందరూ భావించారు. అయితే, బౌలర్లు విజృంభించడంతో ఆ జట్టు స్పల్ప వ్యవధిలో వికెట్లు కోల్పోయి 278 స్కోరుకే పరిమితమైంది. భారత బౌలర్లలో సిరాజ్ 3 వికెట్లతో రాణించాడు. సుందర్, షహబాజ్, కుల్దీప్ యాదవ్, శార్దూల్కు తలో వికెట్ దక్కింది. దీంతో మూడు వన్డేల సిరీస్లో ఇరు జట్లు 1-1తో నిలిచాయి. నిర్ణయాత్మక మూడో మ్యాచ్ దిల్లీలోని ఫిరోజ్షా కోట్లా మైదానంలో ఈనెల 11న (మంగళవారం) జరగనుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దిల్లీ గట్టెక్కింది
ఐపీఎల్-17లో తడబడుతూ సాగుతున్న దిల్లీ క్యాపిటల్స్.. ప్లేఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లుతున్న సమయంలో ఓ కీలక విజయం సాధించింది. బుధవారం ఆ జట్టు గుజరాత్ టైటాన్స్ను 4 పరుగుల స్వల్ప తేడాతో ఓడించింది. -
మోహిత్.. చెత్త రికార్డు
గుజరాత్ టైటాన్స్ పేసర్ మోహిత్ శర్మ చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఓ ఐపీఎల్ మ్యాచ్లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్గా అతను రికార్డులకెక్కాడు. -
పొట్టి కప్పులో ఎవరు?
వెస్టిండీస్, అమెరికా ఉమ్మడిగా ఆతిథ్యమిస్తున్న టీ20 ప్రపంచకప్ కోసం 15 మంది జట్టుతో పాటు అయిదుగురు రిజర్వ్ ఆటగాళ్లనూ ప్రకటించేందుకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ కసరత్తులు చేస్తోంది. -
300 కొట్టేస్తారా?
ఈ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ నమోదు చేసిన రికార్డులివీ. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్లతో రికార్డులు తిరగరాస్తున్న సన్రైజర్స్ పొట్టి లీగ్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. -
తాగి చెస్ ఆడా.. ప్యాంట్లో మూత్రం పోసుకున్నా..
చెస్ మేటి మాగ్నస్ కార్ల్సన్ ఇటీవల ఓ కొత్త సవాలును స్వీకరించాడు. సత్యశోధన పరీక్ష (లై డిటెక్టర్ టెస్ట్)లో తన చెస్ కెరీర్, వ్యక్తిగత జీవితంపై అనేక ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. -
ఫైనల్లో జ్యోతి జట్టు
ఆర్చరీ ప్రపంచకప్లో భారత ఆర్చర్ల దూకుడు కొనసాగుతోంది. విజయవాడ అమ్మాయి జ్యోతి సురేఖ జట్టు కాంపౌడ్ మహిళల విభాగంలో ఫైనల్లో అడుగుపెట్టింది. -
దీపాన్షుకు జావెలిన్ స్వర్ణం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ తొలి రోజు, బుధవారం భారత అథ్లెట్లు సత్తా చాటారు. పురుషుల జావెలిన్ త్రోలో దీపాన్షు శర్మ స్వర్ణం గెలుచుకున్నాడు. -
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
T20 Worldcup 2024 - BCCI: వచ్చే టీ20 ప్రపంచకప్ కోసం ఏ 15 మందిని ఎంపిక చేస్తే బాగుంటుంది. -
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
ఐపీఎల్లో ఫినిషర్గా అదరగొడుతున్న ఎంఎస్ ధోనీ (MS Dhoni)ని టీ20 వరల్డ్కప్నకు ఎంపిక చేయాలనే ఆలోచనను పలువురు మాజీలు కోరుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఒకే ద్విచక్రవాహనంపై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..