IND vs NZ : కివీస్ మాజీ ఆల్రౌండర్ రికార్డును సమం చేసిన అశ్విన్
కివీస్తో రెండో టెస్టు మ్యాచ్లో భారత్ పూర్తి పట్టు సాధించింది. టీమ్ఇండియా నిర్దేశించిన...
ఇంటర్నెట్ డెస్క్: కివీస్తో రెండో టెస్టు మ్యాచ్లో భారత్ పూర్తి పట్టు సాధించింది. టీమ్ఇండియా నిర్దేశించిన 540 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో న్యూజిలాండ్ మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఐదు వికెట్ల నష్టానికి 140 పరుగులు చేసింది. ఇంకా 400 పరుగులు వెనుకబడి ఉంది. కివీస్ కోల్పోయిన ఐదు వికెట్లలో భారత బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ మూడు వికెట్లను పడగొట్టాడు. దీంతో అశ్విన్ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. భారత్-కివీస్ ద్వైపాక్షిక టెస్టు సిరీసుల్లో మాజీ ఆల్రౌండర్ సర్ రిచర్డ్ హ్యాడ్లీ రికార్డును అశ్విన్ సమం చేశాడు. ఇరు దేశాలు ముఖాముఖిగా తలపడిన టెస్టుల్లో హ్యాడ్లీ 24 ఇన్నింగ్స్ల్లో 65 వికెట్లను పడగొట్టగా.. రవిచంద్రన్ మాత్రం కేవలం 17 ఇన్నింగ్స్ల్లోనే ఈ ఘనతను సాధించడం విశేషం.
అంతేకాకుండా ఈ సంవత్సరం టెస్టుల్లో 50 వికెట్లను తీసిన మొదటి బౌలర్గా అశ్విన్ రికార్డుకెక్కాడు. అశ్విన్ తర్వాత పాకిస్థాన్ ఫాస్ట్ బౌలర్లు షహీన్ అఫ్రిది (44), హసన్ అలీ (39) ఉన్నారు. కివీస్తో చివరి టెస్టు మొదటి ఇన్నింగ్స్లోనూ అశ్విన్ నాలుగు వికెట్లు పడగొట్టాడు. 62 పరుగులకే కివీస్ కుప్పకూలడంలో కీలక పాత్ర పోషించాడు. టీమ్ఇండియా తొలి ఇన్నింగ్స్లో 345 పరుగులు చేయగా.. రెండో ఇన్నింగ్స్ను 276/7 స్కోరు వద్ద డిక్లేర్డ్ చేసింది. మరో రెండు రోజులు మిగిలిన ఉన్న క్రమంలో టీమ్ఇండియా విజయం ఖాయమే. ఇదే మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్లో పది, రెండో ఇన్నింగ్స్లో నాలుగు వికెట్లను తీసిన కివీస్ బౌలర్ అజాజ్ పటేల్ (14/225) కూడా హ్యాడ్లీ (9/52) రికార్డును అధిగమించాడు. న్యూజిలాండ్ తరఫున అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలను నమోదు చేశాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
MS Dhoni: ధోని.. ఇంకా నాటౌటే
చివరి సీజన్గా భావిస్తున్న ఈ ఐపీఎల్లో బ్యాటింగ్ చేస్తోంది తక్కువసేపే అయినా అభిమానులను ఉర్రూతలూగిస్తున్నాడు ధోని. -
కేఎల్ రాహుల్ కెప్టెన్ ఇన్నింగ్స్.. చెన్నైకి చెక్
ఏక్నా స్టేడియంలోని నెమ్మదైన పిచ్పై స్కోరు 160 దాటిందంటే ఛేదన కష్టమే. ఓ దశలో చెన్నై 150 అయినా చేస్తుందా అనుకుంటే.. గత మ్యాచ్లో ముంబయిపై చెలరేగినట్లే మహేంద్రసింగ్ ధోని ఈ మ్యాచ్లోనూ ఆఖర్లో మెరుపు ఇన్నింగ్స్ ఆడడంతో చెన్నై స్కోరు 176కు చేరుకుంది. -
కుర్రాళ్లు కుమ్మేస్తున్నారు
ఛేదనలో నాలుగైదు వికెట్లు పడ్డాయా? అయినా భయం లేదు తామున్నామంటూ సత్తాచాటుతున్నారు. -
బుమ్రా బౌలింగ్లో స్వీప్ షాట్.. నా కల!
అశుతోష్ శర్మ.. ఈ ఐపీఎల్లో గట్టిగా వినిపిస్తున్న కొత్త పేరు. -
రేసులో గుకేశ్ ఒక్కడే..
క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్లో భారత యువ కెరటం గుకేశ్ మళ్లీ ఆధిక్యంలోకి వచ్చాడు. -
మెరిసిన ఇషా, భవేష్
ఒలింపిక్స్ సెలెక్షన్ ట్రయల్స్లో అగ్రశ్రేణి షూటర్లు ఇషా సింగ్, భవేష్ షెకావత్ మెరిశారు. -
దీపకు నాలుగో స్థానం
దోహాలో జరిగిన జిమ్నాస్టిక్స్ ప్రపంచకప్ను భారత స్టార్ దీప కర్మాకర్ నాలుగో స్థానంతో ముగించింది. -
భారత రెజ్లర్లు విఫలం
ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో భారత పురుష రెజ్లర్లు విఫలమయ్యారు. -
విమానం ఆలస్యమై...
భారత ఉత్తమ రెజ్లర్లలో ఇద్దరైన దీపక్ పునియా (86 కేజీలు), సుజీత్ కలాకల్ (65 కేజీలు)కు నిరాశ తప్పలేదు. -
రాకెట్ వదిలేద్దాం అనుకున్నా
గత కొన్నేళ్లలో కెరీర్లో ఎంతో క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొన్నానని.. ఒకటికి రెండుసార్లు బ్యాడ్మింటన్కు వీడ్కోలు చెప్పాలని భావించానని భారత డబుల్స్ స్టార్ అశ్విని పొన్నప్ప తెలిపింది. -
చెరువుల సంరక్షణ కోసం ఆర్సీబీ
ఐపీఎల్ జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టింది.