IND vs AUS: ఇదొక సూపర్ సిరీస్.. ఆ మ్యాచ్ ఫలితంపైనా ఓ కన్నేసి ఉంచాం: ద్రవిడ్
ఆసీస్తో టెస్టు సిరీస్ను 2-1 తేడాతో సొంతం చేసుకున్న భారత్.. డబ్ల్యూటీసీ ఫైనల్కూ దూసుకెళ్లింది. ఈ సందర్భంగా భారత ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ మాట్లాడాడు.
ఇంటర్నెట్ డెస్క్: బోర్డర్ - గావస్కర్ ట్రోఫీలో భాగంగా నాలుగు టెస్టుల సిరీస్ను (IND vs AUS) టీమ్ఇండియా 2-1తేడాతో సొంతం చేసుకుంది. వరుసగా నాలుగో సారి సిరీస్ను గెలుచుకోవడం కూడా రికార్డే. ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు ఇద్దరు భారత క్రికెటర్లను వరించింది. అవార్డును ఆల్రౌండర్లు రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్ ఉమ్మడిగా సొంతం చేసుకున్నారు. అహ్మదాబాద్ వేదికగాజరిగిన నాలుగో టెస్టు డ్రాగా ముగిసినప్పటికీ టీమ్ఇండియా ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్కు వరుసగా రెండోసారి చేరుకుంది. ఉత్కంఠభరితంగా సాగిన టెస్టులో శ్రీలంకపై న్యూజిలాండ్ విజయం సాధించడమే దీనికి కారణం. ఇదే విషయంపైనా భారత ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ (Rahul Dravid) కూడా స్పందించాడు. ఆసీస్తో నాలుగో టెస్టు ముగిసిన అనంతరం ప్రత్యేకంగా మాట్లాడాడు.
‘‘చాలా రోజుల తర్వాత తీవ్రమైన పోటీపడిన సిరీస్ ఇది. తీవ్రమైన ఒత్తిడిలోనూ ఆటగాళ్లు రాణించారు. తొలి టెస్టులోనే సెంచరీ సాధించిన కెప్టెన్ రోహిత్ శర్మ జట్టును ముందుండి నడిపించిన విధాన అద్భుతం. శుభ్మన్ గిల్ తొలి రెండు టెస్టుల్లో బెంచ్కే పరిమితమైనప్పటికీ.. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. గత నాలుగైదు నెలలుగా గిల్ సూపర్ ఫామ్లో ఉన్నాడు. ఇలాంటి యువ ఆటగాడి ఆటను చూడటం చాలా బాగుంది. నైపుణ్యాలను మెరుగుపర్చుకునేందుకు కఠినంగా శ్రమిస్తాడు. నాలుగో టెస్టు డ్రాగా ముగిసింది. అయితే, న్యూజిలాండ్ - శ్రీలంక మ్యాచ్ ఫలితం ఎలా ఉంటుందనేదానిపై మేం ఓ కన్నేసి ఉంచాం. ఈ టెస్టు లంచ్ బ్రేక్ సమయానికి ఆ మ్యాచ్ ఫలితం కూడా తేలిపోయింది. ఆసీస్కు అద్భుతమైన ఇద్దరు యువ స్పిన్నర్లు దొరికారు. మర్ఫీ, కునెమన్ చాలా చక్కగా బౌలింగ్ చేశారు. విదేశీ జట్లకు ఒకేఒక్క నాణ్యమైన స్పిన్నర్ను ఇప్పటి వరకు చూస్తూ ఉండేవాళ్లం. కానీ, ఈసారి మాత్రం లయన్తోపాటు వారిద్దరూ బాగా వేశారు. ఇక డబ్ల్యూటీసీ ఫైనల్ గురించి మేం ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి. అయితే తొలుత సిరీస్ విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంటాం’’ అని రాహుల్ ద్రవిడ్ చెప్పాడు.
ఆ సెషన్ సవాల్ విసిరింది: గిల్ (Shubman Gill)
నాలుగో టెస్టులో ఆసీస్పై శుభ్మన్ గిల్ (128) సెంచరీ సాధించాడు. మ్యాచ్ అనంతరం గిల్ మాట్లాడుతూ.. ‘‘నాథన్ లయన్ చాలా అద్భుతంగా బౌలింగ్ చేశాడు. ప్రతి మ్యాచ్లో ఎప్పుడూ అతడి మార్క్ ఉంటుంది. మూడో రోజు తొలి సెషన్ చాలా సవాల్ విసిరింది. బ్యాటింగ్ చేయడానికి రోహిత్, నేనూ శ్రమించాల్సి వచ్చింది. మరీ ముఖ్యంగా లయన్ బౌలింగ్ చేసేటప్పుడు క్లిష్టంగా మారింది. బ్యాటర్కు ఎలాంటి అవకాశం ఇవ్వడు. ఆఫ్స్టంప్కు ఆవల నిలకడగా బంతులను సంధిస్తాడు’’ అని గిల్ తెలిపాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘ఇంకెవరూ మీ భార్యే..’: కోహ్లీ ఆన్సర్కు షాకైన దినేశ్ కార్తిక్
Kohli-DK: బెంగళూరు ఆటగాడు డీకే అడిగిన ప్రశ్నలకు.. కోహ్లీ ఇచ్చిన సమాధానం నెట్టింట వైరల్ అవుతోంది. దినేశ్ కార్తిక్ సతీమణి దీపిక ప్రస్తావన తేవడంతో అతడు ఆశ్చర్యపోయాడు. ఇంతకీ ఏం జరిగిందంటే..? -
డేవిడ్, పొలార్డ్కు భారీ జరిమానా.. ‘డీఆర్ఎస్ సిగ్నల్’ వివాదమేనా కారణం?
ముంబయి ఆటగాడు, కోచ్పై ఐపీఎల్ అడ్వైజరీ కమిటీ కొరడా ఝళిపించింది. వారు చేసిన చర్యలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తీవ్ర నిర్ణయం తీసుకుంది. -
Ravindra Jadeja: గాల్లోకి ఎగిరి.. ఒంటిచేత్తో జడేజా క్యాచ్!
లఖ్నవూతో శుక్రవారం జరిగిన మ్యాచ్లో చెన్నై ఆటగాడు రవీంద్ర జడేజా.. గాల్లోకి ఎగిరి ఒంటి చేత్తో క్యాచ్ ఒడిసిపట్టాడు.
-
దిల్లీ కోటలో తొలి మ్యాచ్.. హైదరాబాద్ దూకుడు కొనసాగేనా?
అభిమానుల ఊహకు అందనిరీతిలో.. సంచలన ఆటతో ఐపీఎల్ 17వ సీజన్లో హైదరాబాద్ జట్టు అదరగొట్టేస్తోంది. ఇవాళ మరో మ్యాచ్లో తలపడేందుకు సిద్ధమవుతోంది. -
ధోనీ ఆటే స్ఫూర్తి.. లేటుగా బ్యాటింగ్కు రావడానికి కారణముంది: ఫ్లెమింగ్
ప్రస్తుత సీజన్లో దూకుడుగా ఆడుతున్న క్రికెటర్లలో ధోనీ ముందువరుసలో ఉంటాడు. ఆడేది పది బంతుల్లోపే అయినా ప్రత్యర్థి బౌలర్లకు వణుకు పుట్టిస్తున్నాడు. -
ఆ ముగ్గురిని చూస్తే ముచ్చటేసింది.. రోహిత్ ఈజ్ బ్యాక్: హర్భజన్
పంజాబ్తో జరిగిన మ్యాచ్లో ముంబయి జట్టుకు కాసేపు యాక్టివ్ కెప్టెన్గా రోహిత్ శర్మ వ్యవహరించాడు. ఇది సోషల్ మీడియాలో వైరల్గా మారింది. -
చెరో రూ. 12 లక్షలు కట్టండి.. కెప్టెన్లకు జరిమానా
లఖ్నవూ కెప్టెన్ కేఎల్ రాహుల్, చెన్నై సారథి రుతురాజ్ గైక్వాడ్కు ఐపీఎల్ అడ్వైజరీ కమిటీ జరిమానా విధించింది. -
ధోనీ ఎంట్రీ ఎఫెక్ట్.. వామ్మో వినికిడి కోల్పోమా..? : లఖ్నవూ స్టార్ వైఫ్
సొంత మైదానంలో లఖ్నవూ విజయం సాధించింది. ఆ జట్టు గెలుపు కంటే మరొక అంశం అభిమానులను ఆకట్టుకుంది. అదే ఎంఎస్ ధోనీ (MS Dhoni) బ్యాటింగ్ వీరవిహారం. -
ధోని.. ఇంకా నాటౌటే
చివరి సీజన్గా భావిస్తున్న ఈ ఐపీఎల్లో బ్యాటింగ్ చేస్తోంది తక్కువసేపే అయినా అభిమానులను ఉర్రూతలూగిస్తున్నాడు ధోని. -
కేఎల్ రాహుల్ కెప్టెన్ ఇన్నింగ్స్.. చెన్నైకి చెక్
ఏక్నా స్టేడియంలోని నెమ్మదైన పిచ్పై స్కోరు 160 దాటిందంటే ఛేదన కష్టమే. ఓ దశలో చెన్నై 150 అయినా చేస్తుందా అనుకుంటే.. గత మ్యాచ్లో ముంబయిపై చెలరేగినట్లే మహేంద్రసింగ్ ధోని ఈ మ్యాచ్లోనూ ఆఖర్లో మెరుపు ఇన్నింగ్స్ ఆడడంతో చెన్నై స్కోరు 176కు చేరుకుంది. -
కుర్రాళ్లు కుమ్మేస్తున్నారు
ఛేదనలో నాలుగైదు వికెట్లు పడ్డాయా? అయినా భయం లేదు తామున్నామంటూ సత్తాచాటుతున్నారు. -
బుమ్రా బౌలింగ్లో స్వీప్ షాట్.. నా కల!
అశుతోష్ శర్మ.. ఈ ఐపీఎల్లో గట్టిగా వినిపిస్తున్న కొత్త పేరు. -
రేసులో గుకేశ్ ఒక్కడే..
క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్లో భారత యువ కెరటం గుకేశ్ మళ్లీ ఆధిక్యంలోకి వచ్చాడు. -
మెరిసిన ఇషా, భవేష్
ఒలింపిక్స్ సెలెక్షన్ ట్రయల్స్లో అగ్రశ్రేణి షూటర్లు ఇషా సింగ్, భవేష్ షెకావత్ మెరిశారు. -
దీపకు నాలుగో స్థానం
దోహాలో జరిగిన జిమ్నాస్టిక్స్ ప్రపంచకప్ను భారత స్టార్ దీప కర్మాకర్ నాలుగో స్థానంతో ముగించింది. -
భారత రెజ్లర్లు విఫలం
ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో భారత పురుష రెజ్లర్లు విఫలమయ్యారు. -
విమానం ఆలస్యమై...
భారత ఉత్తమ రెజ్లర్లలో ఇద్దరైన దీపక్ పునియా (86 కేజీలు), సుజీత్ కలాకల్ (65 కేజీలు)కు నిరాశ తప్పలేదు. -
రాకెట్ వదిలేద్దాం అనుకున్నా
గత కొన్నేళ్లలో కెరీర్లో ఎంతో క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొన్నానని.. ఒకటికి రెండుసార్లు బ్యాడ్మింటన్కు వీడ్కోలు చెప్పాలని భావించానని భారత డబుల్స్ స్టార్ అశ్విని పొన్నప్ప తెలిపింది. -
చెరువుల సంరక్షణ కోసం ఆర్సీబీ
ఐపీఎల్ జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టింది.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
వినీతాసింగ్ మృతిపై వదంతులు ..ఆమె ఏమన్నారంటే!
-
హామీలపై నిలదీస్తే అసహనమెందుకు?: హరీశ్రావు
-
బంగారం పేరుతో రూ.6.12 కోట్ల మోసం.. సాఫ్ట్వేర్ ఇంజినీర్ అరెస్టు
-
social look: వర్ష చీరకట్టు.. ప్రియాంక క్యూటు.. రష్మి హాటు..
-
నేను ఓటు వేశా.. మీరూ వేయండి..! ఎన్నికల వేళ విశాల్ ఇంకా ఏమన్నారంటే?