Rohit Sharma: వన్డేల్లో రోహిత్.. మూడంకెల కోసం మూడేళ్ల నిరీక్షణకు తెర!
భారత కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) ఎట్టకేలకు వన్డేల్లో మూడేళ్ల తర్వాత సెంచరీ బాదేశాడు. న్యూజిలాండ్తో జరుగుతున్న మూడో వన్డేలో (IND vs NZ) శతకం పూర్తి చేశాడు. మరోవైపు గిల్ కూడా సెంచరీ నమోదు చేశాడు.
ఇంటర్నెట్ డెస్క్: న్యూజిలాండ్తో జరుగుతున్న మూడో వన్డే మ్యాచ్లో భారత ఓపెనర్లు సెంచరీలతో మోతమోగించారు. మూడేళ్ల నిరీక్షణకు తెర దించుతూ భారత కెప్టెన్ రోహిత్ శర్మ (101) వన్డేల్లో శతకం నమోదు చేశాడు. ఈ మ్యాచ్లో 83 బంతుల్లోనే సెంచరీ మార్క్ను తాకాడు. చిన్నస్వామి స్టేడియం వేదికగా 2020 జనవరి 19వ తేదీన ఆస్ట్రేలియా మీద చివరిసారిగా రోహిత్ మూడంకెల స్కోరును నమోదు చేశాడు. ఇప్పుడు సుదీర్ఘ నిరీక్షణకు ముగింపు పలుకుతూ ఇన్నింగ్స్లో సెంచరీ చేశాడు. ఇందులో ఆరు సిక్స్లు, 9 ఫోర్లు ఉన్నాయి. వన్డే కెరీర్లో రోహిత్కిది 30వ శతకం. సెంచరీ సాధించిన వెంటనే ఔటై పెవిలియన్కు చేరాడు.
మరోవైపు మరో ఓపెనర్ శుభ్మన్ గిల్ (112) కూడా తన ఫామ్ను కొనసాగిస్తున్నాడు. తొలి వన్డేలో డబుల్ సెంచరీతో అదరగొట్టిన గిల్.. మూడో వన్డేలోనూ సెంచరీ పూర్తి చేశాడు. గిల్ కేవలం 72 బంతుల్లోనే 13 ఫోర్లు, 6 సిక్స్ల సాయంతో శతకం బాదడం విశేషం. ప్రస్తుతం 28 ఓవర్లు ముగిసేసరికి భారత్ రెండు వికెట్లు కోల్పోయి 230 పరుగులు చేసింది. ఇందులో కేవలం బౌండరీల ద్వారానే 156 పరుగులు రావడం గమనార్హం. క్రీజ్లో విరాట్ కోహ్లీ, ఇషాన్ కిషన్ ఉన్నారు.
మరికొన్ని విశేషాలు..
* వన్డేల్లో అత్యధిక సెంచరీల సాధించిన బ్యాటర్లలో రోహిత్ ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ (30)తో కలిసి సమంగా మూడో స్థానంలో నిలిచాడు.
* మరో ఓపెనర్ గిల్తో కలిసి తొలి వికెట్కు 212 పరుగులు జోడించాడు. న్యూజిలాండ్పై తొలి వికెట్కు ఇదే అత్యధిక భాగస్వామ్యం కావడం విశేషం.
* తక్కువ ఇన్నింగ్స్ల్లో నాలుగు వన్డే శతకాలు బాదిన ఐదో క్రికెటర్ శుభ్మన్ గిల్. భారత్ నుంచి తొలి ఆటగాడు. 21 ఇన్నింగ్స్ల్లోనే నాలుగు సెంచరీలు బాదాడు. పాక్ బ్యాటర్ ఇమామ్ ఉల్ హక్ కేవలం 9 ఇన్నింగ్స్ల్లోనే ఈ ఫీట్ను సాధించాడు.
* ద్వైపాక్షిక సిరీసుల్లో అత్యధిక పరుగులు సాధించిన భారత బ్యాటర్గానూ గిల్ రికార్డు సృష్టించాడు. మూడు వన్డేల సిరీస్లో 360 పరుగులు సాధించాడు. అంతర్జాతీయంగా బాబర్ అజామ్ (360)తో సమంగా నిలిచాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విజయ్ మాల్యా అప్పుడు అలా అనడంతోనే..: కుంబ్లే
టెస్టు క్రికెట్లో అద్భుతాలు సృష్టించిన అనిల్ కుంబ్లేను తొలి ఐపీఎల్ వేలంలో బెంగళూరు దక్కించుకుంది. ఆ సమయంలో చోటుచేసుకున్న పరిణామాలను తాజాగా కుంబ్లే వెల్లడించాడు. -
మాజీ క్రికెటర్పై చిరుత దాడి.. కాపాడిన పెంపుడు శునకం
జింబాబ్వే మాజీ క్రికెటర్పై చిరుత దాడి చేసింది. దీంతో పెంపుడు శునకం ఆయనను రక్షించింది. -
అదేం కొట్టుడు.. పంత్ నువ్వేనా క్రికెట్కు ఏడాదిన్నర దూరమైంది?
ఐపీఎల్లో రిషభ్ పంత్ ప్రత్యేక ఆకర్షణగా మారాడు. దూకుడైన ఆటతీరుతో అభిమానులను అలరిస్తున్నాడు. -
మన దగ్గర ఇదే సమస్య.. హార్దిక్ గురించి పిల్లలకూ చెబుతాం: వసీమ్ అక్రమ్
హార్దిక్పై విమర్శలను ఇకనైనా ఆపాలని మాజీ క్రికెటర్లు ఫ్యాన్స్కు కీలక సూచనలు చేశారు. అతడిని ట్రోలింగ్ చేయడం సరి కాదని పేర్కొన్నారు. -
కెమెరామెన్కు సారీ చెప్పిన పంత్.. ఎందుకో తెలుసా?
హైదరాబాద్ చేతిలో భారీ ఓటమితో కుదేలైన దిల్లీకి ఊరటనిచ్చే విజయం దక్కింది. గుజరాత్పై నాలుగు పరుగుల తేడాతో గెలిచింది. -
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
భాగ్యనగర వాసులకు మళ్లీ ఐపీఎల్ సందడి వచ్చేసింది. గురువారం బెంగళూరుతో హైదరాబాద్ (Hyderabad Vs Bengaluru) తలపడనుంది. -
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్మన్ గిల్
Shubman Gill: ఈ ఐపీఎల్ సీజన్లో భారీ స్కోర్లు నమోదవుతున్న విషయం తెలిసిందే. దీనికి ఓ కారణం ఉందని శుభ్మన్ గిల్ తెలిపాడు. -
తాగి చెస్ ఆడా.. ప్యాంట్లో మూత్రం పోసుకున్నా..
చెస్ మేటి మాగ్నస్ కార్ల్సన్ ఇటీవల ఓ కొత్త సవాలును స్వీకరించాడు. సత్యశోధన పరీక్ష (లై డిటెక్టర్ టెస్ట్)లో తన చెస్ కెరీర్, వ్యక్తిగత జీవితంపై అనేక ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. -
మోహిత్.. చెత్త రికార్డు
గుజరాత్ టైటాన్స్ పేసర్ మోహిత్ శర్మ చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఓ ఐపీఎల్ మ్యాచ్లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్గా అతను రికార్డులకెక్కాడు. -
దిల్లీ గట్టెక్కింది
ఐపీఎల్-17లో తడబడుతూ సాగుతున్న దిల్లీ క్యాపిటల్స్.. ప్లేఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లుతున్న సమయంలో ఓ కీలక విజయం సాధించింది. బుధవారం ఆ జట్టు గుజరాత్ టైటాన్స్ను 4 పరుగుల స్వల్ప తేడాతో ఓడించింది. -
పొట్టి కప్పులో ఎవరు?
వెస్టిండీస్, అమెరికా ఉమ్మడిగా ఆతిథ్యమిస్తున్న టీ20 ప్రపంచకప్ కోసం 15 మంది జట్టుతో పాటు అయిదుగురు రిజర్వ్ ఆటగాళ్లనూ ప్రకటించేందుకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ కసరత్తులు చేస్తోంది. -
300 కొట్టేస్తారా?
ఈ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ నమోదు చేసిన రికార్డులివీ. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్లతో రికార్డులు తిరగరాస్తున్న సన్రైజర్స్ పొట్టి లీగ్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. -
ఫైనల్లో జ్యోతి జట్టు
ఆర్చరీ ప్రపంచకప్లో భారత ఆర్చర్ల దూకుడు కొనసాగుతోంది. విజయవాడ అమ్మాయి జ్యోతి సురేఖ జట్టు కాంపౌడ్ మహిళల విభాగంలో ఫైనల్లో అడుగుపెట్టింది. -
దీపాన్షుకు జావెలిన్ స్వర్ణం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ తొలి రోజు, బుధవారం భారత అథ్లెట్లు సత్తా చాటారు. పురుషుల జావెలిన్ త్రోలో దీపాన్షు శర్మ స్వర్ణం గెలుచుకున్నాడు. -
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
T20 Worldcup 2024 - BCCI: వచ్చే టీ20 ప్రపంచకప్ కోసం ఏ 15 మందిని ఎంపిక చేస్తే బాగుంటుంది. -
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
ఐపీఎల్లో ఫినిషర్గా అదరగొడుతున్న ఎంఎస్ ధోనీ (MS Dhoni)ని టీ20 వరల్డ్కప్నకు ఎంపిక చేయాలనే ఆలోచనను పలువురు మాజీలు కోరుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
విజయ్ మాల్యా అప్పుడు అలా అనడంతోనే..: కుంబ్లే
-
ఎక్స్ట్రా ఫీజుతో జొమాటోలో ఇక ఫాస్ట్ డెలివరీలు సేవలు..!
-
మస్క్ పేరుతో మస్కా.. మహిళకు రూ.41 లక్షలకు సైబర్ నేరగాడు టోకరా
-
మాజీ క్రికెటర్పై చిరుత దాడి.. కాపాడిన పెంపుడు శునకం
-
‘ఆ బ్లీచ్ జుట్టుకు చేరినట్టుంది’: ట్రంప్పై బైడెన్ వ్యక్తిగత విమర్శలు
-
323km రేంజ్.. 155km టాప్ స్పీడ్తో అల్ట్రావయోలెట్ కొత్త ఎలక్ట్రిక్ బైక్