Rohit Sharma : విండీస్తో మూడో టీ20.. గాయంపై స్పందించిన రోహిత్ శర్మ
విండీస్తో ఐదు టీ20ల సిరీస్లో భారత్ ముందంజ వేసింది. మూడో టీ20లో ఘన విజయం సాధించిన టీమ్ఇండియా...
ఇంటర్నెట్ డెస్క్: విండీస్తో ఐదు టీ20ల సిరీస్లో భారత్ ముందంజ వేసింది. మూడో టీ20లో ఘన విజయం సాధించిన టీమ్ఇండియా 2-1తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో భారత్ కేవలం మూడు వికెట్లను మాత్రమే కోల్పోయి విజయం సాధించింది. సూర్యకుమార్ యాదవ్ (76), శ్రేయస్ అయ్యర్ (27), రిషభ్ పంత్ (33*) రాణించారు. కెప్టెన్ రోహిత్ శర్మ (5 బంతుల్లో 11 రిటైర్హర్ట్: ఒక సిక్స్, ఒక ఫోర్) దూకుడుగానే ఇన్నింగ్స్ను ప్రారంభించినా నడుం వద్ద కండరాలు పట్టేయడంతో మైదానం వదిలి పెట్టాల్సి వచ్చింది. నాలుగో టీ20 నాటికే అందుబాటులోకి వస్తాడా..? లేదా..? అనే అనుమానాలు రేకెత్తడంతో.. రోహిత్ స్పందించాడు. గాయం నుంచి కోలుకుని వచ్చే మ్యాచ్ ఆడతాననే ఆశాభావం వ్యక్తం చేశాడు.
మ్యాచ్ అనంతరం రోహిత్ మాట్లాడుతూ.. ‘‘ఇప్పుడైతే బాగానే ఉంది. తదుపరి మ్యాచ్కు(ఆగస్ట్ 6) ఇంకా సమయం ఉంది.. కాబట్టి ఆలోపు గాయం నుంచి కోలుకుంటానని భావిస్తున్నా. ఇక ఇవాళ్టి మ్యాచ్ గెలవడం సంతోషంగా ఉంది. కీలకమైన మధ్య ఓవర్లలో బౌలింగ్ చేయడం ఎప్పుడూ సవాలే. అయితే పిచ్ పరిస్థితులను సద్వినియోగం చేసుకుని మా బౌలర్లు విభిన్నంగా బౌలింగ్ వేశారు. ఛేదనలోనూ సానుకూల దృక్పథంతో ఆడాం. ఎక్కడా రిస్క్ తీసుకున్నట్లు నాకైతే అనిపించలేదు. చాలా ప్రశాంతంగా బ్యాటర్లు ఛేదన చేశారు. సూర్య అద్భుతంగా ఆడాడు. శ్రేయస్ అయ్యర్తో కలిసి మంచి భాగస్వామ్యం నిర్మించాడు. ఇక్కడ టార్గెట్ను ఛేదించడం అంత సులువేం కాదు. అందుకే.. ఎలాంటి రిస్క్కు పోకుండా పరుగులు రాబట్టాం’’ అని రోహిత్ వివరించాడు. రోహిత్ గాయంపై బీసీసీఐ ట్విటర్లో స్పందించింది. ‘రోహిత్కు నడుం కండరాలు పట్టేయడంతో ఇబ్బంది పడ్డాడు. వైద్యబృందం నిశితంగా పరిశీలిస్తోంది’’ అని ట్వీట్ చేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దిల్లీ గట్టెక్కింది
ఐపీఎల్-17లో తడబడుతూ సాగుతున్న దిల్లీ క్యాపిటల్స్.. ప్లేఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లుతున్న సమయంలో ఓ కీలక విజయం సాధించింది. బుధవారం ఆ జట్టు గుజరాత్ టైటాన్స్ను 4 పరుగుల స్వల్ప తేడాతో ఓడించింది. -
మోహిత్.. చెత్త రికార్డు
గుజరాత్ టైటాన్స్ పేసర్ మోహిత్ శర్మ చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఓ ఐపీఎల్ మ్యాచ్లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్గా అతను రికార్డులకెక్కాడు. -
పొట్టి కప్పులో ఎవరు?
వెస్టిండీస్, అమెరికా ఉమ్మడిగా ఆతిథ్యమిస్తున్న టీ20 ప్రపంచకప్ కోసం 15 మంది జట్టుతో పాటు అయిదుగురు రిజర్వ్ ఆటగాళ్లనూ ప్రకటించేందుకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ కసరత్తులు చేస్తోంది. -
300 కొట్టేస్తారా?
ఈ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ నమోదు చేసిన రికార్డులివీ. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్లతో రికార్డులు తిరగరాస్తున్న సన్రైజర్స్ పొట్టి లీగ్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. -
తాగి చెస్ ఆడా.. ప్యాంట్లో మూత్రం పోసుకున్నా..
చెస్ మేటి మాగ్నస్ కార్ల్సన్ ఇటీవల ఓ కొత్త సవాలును స్వీకరించాడు. సత్యశోధన పరీక్ష (లై డిటెక్టర్ టెస్ట్)లో తన చెస్ కెరీర్, వ్యక్తిగత జీవితంపై అనేక ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. -
ఫైనల్లో జ్యోతి జట్టు
ఆర్చరీ ప్రపంచకప్లో భారత ఆర్చర్ల దూకుడు కొనసాగుతోంది. విజయవాడ అమ్మాయి జ్యోతి సురేఖ జట్టు కాంపౌడ్ మహిళల విభాగంలో ఫైనల్లో అడుగుపెట్టింది. -
దీపాన్షుకు జావెలిన్ స్వర్ణం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ తొలి రోజు, బుధవారం భారత అథ్లెట్లు సత్తా చాటారు. పురుషుల జావెలిన్ త్రోలో దీపాన్షు శర్మ స్వర్ణం గెలుచుకున్నాడు. -
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
T20 Worldcup 2024 - BCCI: వచ్చే టీ20 ప్రపంచకప్ కోసం ఏ 15 మందిని ఎంపిక చేస్తే బాగుంటుంది. -
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
ఐపీఎల్లో ఫినిషర్గా అదరగొడుతున్న ఎంఎస్ ధోనీ (MS Dhoni)ని టీ20 వరల్డ్కప్నకు ఎంపిక చేయాలనే ఆలోచనను పలువురు మాజీలు కోరుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఏ ముఖం పెట్టుకుని రాజధాని రైతులను సీఎం ఓట్లు అడుగుతారు
-
ఒకే ద్విచక్రవాహనంపై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
-
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
-
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం