Team India: సరదాగా కాసేపు! క్రికెటర్ల విహారం

టీమ్‌ఇండియా క్రికెటర్లు ‘కుటుంబ సమయం’ ఆస్వాదిస్తున్నారు. దొరికిన విరామాన్ని చక్కగా సద్వినియోగం చేసుకుంటున్నారు. బ్రిటన్‌లోని పర్యాటక ప్రదేశాలను సందర్శిస్తున్నారు. కుటుంబ సభ్యులతో తమకు నచ్చిన ప్రాంతాల్లో విహరిస్తున్నారు....

Published : 29 Jun 2021 12:14 IST

కుటుంబ సమయం ఆస్వాదిస్తున్న రోహిత్‌, రహానె, కోహ్లీ 

ఇంటర్నెట్‌ డెస్క్‌: టీమ్‌ఇండియా క్రికెటర్లు ‘కుటుంబ సమయం’ ఆస్వాదిస్తున్నారు. దొరికిన విరామాన్ని చక్కగా సద్వినియోగం చేసుకుంటున్నారు. బ్రిటన్‌లోని పర్యాటక ప్రదేశాలను సందర్శిస్తున్నారు. కుటుంబ సభ్యులతో తమకు నచ్చిన ప్రాంతాల్లో విహరిస్తున్నారు.

విరాట్‌ కోహ్లీ సారథ్యంలోని టీమ్‌ఇండియా ప్రస్తుతం ఇంగ్లాండ్‌లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఇంగ్లాండ్‌తో ఐదు టెస్టుల సిరీసుకు మరో ఆరు వారాల సమయం ఉంది. అన్ని రోజుల పాటు బయో బుడగలో ఉండటం కష్టం. అంతేకాకుండా ఆటగాళ్లు మానసికంగా ఒత్తిడికి లోనయ్యే అవకాశం ఉంది.

ఈ నేపథ్యంలో వారిని ఉల్లాసంగా ఉంచేందుకు మూడు వారాల పాటు టీమ్‌ఇండియా క్రికెటర్లకు విరామం ఇచ్చారు. బుడగ నుంచి బయటకు వెళ్లి గడిపేందుకు అనుమతి ఇచ్చారు. జట్టులోని చాలామందికి బ్రిటన్‌లోని ప్రాంతాలతో పరిచయం ఉంది. తెలిసిన వాళ్లు ఉన్నారు. సారథి విరాట్‌ కోహ్లీ తన సతీమణి అనుష్క శర్మతో కలిసి ఓ కెఫేకు వెళ్లి చక్కని కాఫీని ఆస్వాదించాడు. ఇందుకు సంబంధించిన చిత్రాలను వీరిద్దరూ ఇన్‌స్టాలో పంచుకున్నారు.

టీమ్‌ఇండియా వన్డే, టెస్టు జట్ల వైస్‌ కెప్టెన్లు కుటుంబ సమేతంగా బయటకు వెళ్లారు. భార్యా, బిడ్డలతో కలిసి విహరిస్తున్నారు. పిల్లలు ఎక్కువగా ఇష్టపడే పార్క్‌లు, ఆట స్థలాలకు వెళ్తున్నారు. ఎందుకంటే వీరిద్దరికీ 2-3 ఏళ్ల వయసు పిల్లలున్న సంగతి తెలిసిందే. ఐపీఎల్‌ జట్టు దిల్లీ క్యాపిటల్స్‌ ఈ చిత్రాలను పంచుకొంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని