టీమ్‌ ఇండియా లండన్‌ ప్రయాణం చూస్తారా!

ఇంగ్లాండ్‌ చేరుకున్న టీమ్‌ఇండియా కఠిన క్వారంటైన్‌లో ఉంటోంది. ఆటగాళ్లు ఒకర్నొకరు కలవకుండా తమ గదుల్లోనే ఉంటున్నారు. మూడు రోజుల తర్వాత క్రికెటర్లంతా కలుసుకొని సాధన చేయనున్నారు....

Updated : 04 Jun 2021 18:48 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఇంగ్లాండ్‌ చేరుకున్న టీమ్‌ఇండియా కఠిన క్వారంటైన్‌లో ఉంటోంది. ఆటగాళ్లు ఒకర్నొకరు కలవకుండా తమ గదుల్లోనే ఉంటున్నారు. మూడు రోజుల తర్వాత క్రికెటర్లంతా కలుసుకొని సాధన చేయనున్నారు. కాగా క్రికెటర్ల ప్రయాణానికి సంబంధించిన వీడియోను బీసీసీఐ సోషల్‌ మీడియాలో పంచుకొంది. ‘టీమ్ఇండియా ఇంగ్లాండ్‌ చేరుకోవడంతో ఉత్సాహం పెరిగింది’ అని దానికి వ్యాఖ్య పెట్టింది.

ఆటగాళ్లను ఒకర్నొకరు కలుసుకోవద్దని బీసీసీఐ తమకు చెప్పిందని అక్షర్‌ పటేల్‌ తెలిపాడు. ‘నాకు చక్కగా నిద్ర పట్టింది. ఇక మేం క్వారంటైన్లో ఉండాలి. మూడు రోజుల వరకు ఒకర్నొకరం కలుసుకోవద్దని మాకు చెప్పారు’ అని అతడు వీడియోలో చెప్పాడు.  ‘నిన్న రన్నింగ్‌ సెషన్‌ జరిగింది. ప్రయాణంలో సరిగ్గా నిద్రపట్టలేదు. శరీరం అలసిపోయింది’ అని మహ్మద్‌ సిరాజ్‌ చెప్పాడు. టీమ్‌ ఇండియా పురుషుల జట్టు, మహిళ జట్టు సందడిని ఈ వీడియోలో చూడొచ్చు. మహిళల జట్టు సభ్యులు సైతం క్వారంటైన్లో ఉంటారు. పది రోజులు ముగిశాక బ్రిస్టల్‌ బయల్దేరి వెళ్తారు. జూన్‌ 18న కోహ్లీసేన న్యూజిలాండ్‌తో టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌లో తలపడనున్న సంగతి తెలిసిందే. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని