IND w Vs AUS w: కామన్వెల్త్ ఓటమికి.. ఆసీస్పై భారత్ ప్రతీకారం తీర్చుకొనేనా..?
మహిళల టీ20 ప్రపంచ కప్ నాకౌట్ దశకు చేరుకొంది. పది జట్లు టైటిల్ రేసులో నిలవగా.. చివరికి నాలుగు టీమ్లు మాత్రమే సెమీస్కు చేరాయి.
ఇంటర్నెట్ డెస్క్: మహిళల టీ20 ప్రపంచ కప్ నాకౌట్ దశకు చేరుకొంది. పది జట్లు టైటిల్ రేసులో నిలవగా.. చివరికి నాలుగు టీమ్లు మాత్రమే సెమీస్కు చేరాయి. గ్రూప్ - A నుంచి ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా.. గ్రూప్ - B నుంచి ఇంగ్లాండ్, టీమ్ఇండియా సెమీస్ బెర్తులను సొంతం చేసుకొన్న విషయం తెలిసిందే. ఇక సెమీస్లో ఆసీస్-భారత్, ఇంగ్లాండ్-దక్షిణాఫ్రికా తలపడనున్నాయి. అందులో ఫిబ్రవరి 23న (గురువారం) ఆసీస్తో టీమ్ఇండియా తలపడేందుకు సిద్ధమైంది. అయితే, ఆస్ట్రేలియా ఎంత పటిష్టమైన జట్టు అనేది ఇదివరకే భారత్కు తెలుసు. మరోసారి అలాంటి టీమ్తో తలపడాలంటే సర్వశక్తులూ వడ్డాల్సిందే.
ఆసీస్వన్నీ భారీ విజయాలే..
గ్రూప్ స్టేజ్లో ఆస్ట్రేలియా నాలుగు మ్యాచ్లను ఆడింది. అన్నింట్లోనూ విజయం సాధించింది. అదికూడానూ భారీ విజయాలే సుమా... న్యూజిలాండ్పై 97 పరుగుల తేడా, శ్రీలంకపై ఏకంగా పది వికెట్ల తేడాతో విజయం సాధించడం గమనార్హం. లంకనిర్దేశించిన 113 పరుగుల లక్ష్యాన్ని ఆసీస్ 16 ఓవర్లలోనే వికెట్ కోల్పోకుండా ఛేదించింది. అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్ల జాబితాలో అలీసా హీలే (146) మూడో స్థానంలో ఉంది. ఇక బౌలింగ్ విభాగంలో యాష్ గార్డెనర్ (5/12) అత్యుత్తమ వ్యక్తిగత ప్రదర్శన ఇచ్చిన బౌలర్. అలీ హీలేతోపాటు బెత్ మూనీ, కెప్టెన్ మెగ్ లానింగ్, ఆష్లే గార్డెనర్, ఎల్సే పెర్రీ, తహిలా మెక్గ్రాత్ వంటి టాప్ ప్లేయర్లు ఆ జట్టు సొంతం. పక్కా ప్రొఫెషనల్ ప్లేయర్లకు కేరాఫ్ అడ్రస్గా ఆసీస్ జట్టు ఉంటుంది.
వారిదే హవా.. కానీ.
స్మృతీ మంధాన, హర్మన్, షెఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్, దీప్తి శర్మ వంటి టాప్స్టార్ ప్లేయర్లు భారత్కు ఉన్నప్పటికీ.. కీలకమైన సమయంలో చేతులెత్తేయడం ఒక్కోసారి భారత్కు వీక్నెస్గా మారింది. ఆసీస్ వంటి బలమైన జట్టుతో ఆడేటప్పుడు ఎంతో జాగ్రత్తగా ఆడాల్సి ఉంది. ఇప్పటి వరకు 30 టీ20ల్లో ముఖాముఖి తలపడగా.. కేవలం ఏడు మ్యాచుల్లోనే భారత్ విజయం సాధించింది. ఆసీస్ మాత్రం 22 టీ20ల్లో గెలిచింది. ఒక మ్యాచ్ ఫలితం తేలలేదు. చివరిసారిగా ఇరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో 54 పరుగుల తేడాతో ఆసీస్ విజయం సాధించింది. గత ఐదు మ్యాచ్లనే పరిగణనలోకి తీసుకుంటే కేవలం ఒక్క మ్యాచ్లోనే టీమ్ఇండియా గెలవడం గమనార్హం.
ఈసారి మాత్రం..
ప్రస్తుతం టీ20 ప్రపంచకప్లో భారత మహిళల జట్టు ప్రదర్శన అత్యుత్తమంగానే ఉంది. స్టార్ ఓపెనర్లు స్మృతీ మంధాన, షఫాలీ వర్మ ధాటిగా ఇన్నింగ్స్ను ఆరంభించాలి. ఇప్పటికే స్మృతీ మంధాన మెగా టోర్నీలో వరుసగా మూడు అర్ధశతకాలను నమోదు చేసింది. నాకౌట్ స్టేజ్లోనూ ఇదే ఊపు కొనసాగించాలి. క్రీజ్లో పాతుకుపోతే మాత్రం పరుగులు సాధించవచ్చని ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్లనుబట్టి తెలుస్తోంది. బ్యాటింగ్లో విఫలమవుతున్న దీప్తి శర్మ గాడిలో పడాల్సిన అవసరం ఉంది. గత మ్యాచ్లో (ఇంగ్లాండ్పై) రిచా ఘోష్ తొలి బంతికే పెవిలియన్కు చేరినప్పటికీ.. అంతకుముందు మంచి ఇన్నింగ్స్లే ఆడింది. మరోసారి మిడిలార్డర్లో బ్యాటింగ్కు మద్దతుగా నిలిస్తే భారత్కు తిరుగుండదు. కామన్వెల్త్ గేమ్స్ ఫైనల్లో ఓటమికి ఆసీస్పై టీమ్ఇండియా ప్రతీకారం తీర్చుకోవాల్సిన అవసరం ఉంది. తొలుత బ్యాటింగ్ చేస్తే కనీసం 170 పరుగులను సాధిస్తేనే.. ఆసీస్కు అడ్డుకట్ట వేసేందుకు అవకాశం ఉంటుంది.
మ్యాచ్ ఎప్పుడు..: ఫిబ్రవరి 23న గురువారం
వీక్షించేది ఎలా..?: స్టార్ స్పోర్ట్స్ ఛానెల్స్, డీస్నీ + హాట్స్టార్ ఓటీటీ ప్లాట్ఫామ్
ఎన్ని గంటలకు: సాయంత్రం 6.30 గంటలకు.. టాస్ 6 గంటలకు..
జట్లు (అంచనాలు):
భారత్: హర్మన్ ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతీ మంధాన, షఫాలీ వర్మ, రిచా ఘోష్, జెమీమా రోడ్రిగ్స్, దీప్తి శర్మ, రాధా యాదవ్, పూజా వస్త్రాకర్, రాజేశ్వరి గైక్వాడ్, శిఖా పాండే, రేణుకా సింగ్
ఆస్ట్రేలియా: మెగ్ లానింగ్ (కెప్టెన్), బెత్ మూనీ, ఎలీసా హీలే, ఆష్లే గార్డెనర్, ఎలీస్ పెర్రీ, తహిలా మెక్గ్రాత్, గ్రేస్ హారిస్, జార్షియా వారెహమ్, అలానా కింగ్, మెగన్ స్కట్, డార్సీ బ్రౌన్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అది నా డ్రీమ్ సిక్స్.. బుమ్రా బౌలింగ్లో ఇప్పటికి నెరవేరింది: అశుతోష్ శర్మ
క్రికెటర్లు తాము కొట్టే షాట్.. లేదా తీసే వికెట్ జీవితాంతం మరిచిపోకుండా ఉంటారు. అలాంటి అనుభవం పంజాబ్ బ్యాటర్ అశుతోష్ శర్మకూ ఎదురైంది. -
‘స్పీడ్’ స్టార్లు vs సిక్సర్ల వీరులు... రెండు జట్లలో ‘హ్యాట్రిక్’ ఎవరికి?
ఐపీఎల్ 17వ సీజన్లో ఇవాళ మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమవుతోంది. తన సొంత మైదానంలో లఖ్నవూ జట్టు చెన్నైను ఢీకొట్టనుంది. -
త్వరలో ఫీల్డింగ్కు వస్తా.. 40 ఓవర్లూ మైదానంలో ఉంటా: సూర్య
‘ఇంపాక్ట్’ ప్లేయర్గా బరిలోకి దిగుతున్న సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) బ్యాటింగ్లో చెలరేగుతున్నాడు. విరామం తర్వాత బ్యాటింగ్లో మునుపటి సూర్యను చూస్తున్నామని అభిమానులు సంబరపడుతున్నారు. -
దుబాయ్ నుంచి ఆలస్యంగా పునియా, సుజీత్.. ఒలింపిక్ క్వాలిఫయర్స్ మిస్
Wrestlers: భారీ వర్షాల కారణంగా దుబాయ్లో చిక్కుకున్న భారత రెజ్లర్లు దీపక్ పునియా, సుజీత్.. ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్ దూరమయ్యారు. ఆలస్యంగా రావడంతో వారిని పోటీలకు అనుమతించలేదు. -
పవర్ప్లేలో రెండు ఓవర్లు వేస్తేనే..: జస్ప్రీత్ బుమ్రా
పంజాబ్పై ముంబయి విజయం సాధించడంలో బుమ్రా కీలక పాత్ర పోషించాడు. తన తొలి ఓవర్లోనే రెండు వికెట్లను పడగొట్టి ముంబయి పైచేయి సాధించేలా చేశాడు. -
ఆలస్యమైన మ్యాచ్.. హార్దిక్ పాండ్యకు జరిమానా
ఎట్టకేలకు ముంబయి మళ్లీ మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్లో పంజాబ్పై కేవలం 9 పరుగుల తేడాతో విజయం సాధించింది. -
అంపైర్గా పని చేసి.. ఐపీఎల్లో అదరగొట్టి... నయా సంచలనం అశుతోష్ కథ ఇది!
ధనాధన్ షాట్లతో ముంబయి మీద విరుచుకుపడి ఓటమి భయం చూపించిన అశుతోష్ శర్మ గురించి ఆసక్తికర విషయాలు... -
ఇంపాక్ట్ ప్లేయర్తో నష్టమే
ఐపీఎల్ గతేడాది ప్రవేశ పెట్టిన ఇంపాక్ట్ ప్లేయర్ విధానం కారణంగా ఆల్రౌండర్లకు నష్టం కలుగుతోందని టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అభిప్రాయపడ్డాడు. -
ఆల్రౌండర్లకు దెబ్బ
టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ చెప్పినట్లు ఐపీఎల్లో ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన భారత ఆల్రౌండర్లకు చేటు చేస్తోంది. టీ20 ప్రపంచకప్లో తలపడే టీమ్ఇండియా ఎంపిక కోసం ఐపీఎల్ ప్రదర్శన కూడా పరిగణలోకి తీసుకుంటారనే చెప్పాలి. -
ప్చ్.. పంజాబ్
13 బంతులు.. 14 పరుగులు.. 4 వికెట్లు! 193 పరుగుల ఛేదనలో పంజాబ్ పరిస్థితిది! బుమ్రా లాంటి మేటి బౌలర్.. బెంబేలెత్తిస్తున్న నేపథ్యంలో ఆ జట్టు కనీసం పోటీలో ఉన్నట్లు కూడా కనపడలేదు. ముంబయి విజయం లాంఛనమేనని తీర్మానించారంతా! కానీ అశుతోష్ శర్మ అసాధారణ బ్యాటింగ్తో పంజాబ్ అద్భుతం చేసినంత పని చేసింది. -
అశుతోష్.. నయా మెరుపు
గుజరాత్తో పంజాబ్ మ్యాచ్.. లక్ష్యం 200.. 150కే 6 వికెట్లు పడిపోయాయి.. ఉన్న ఓవర్లు కూడా తక్కువే! అయినా చివరికి పంజాబ్ గెలిచింది! -
చమరి 195 నాటౌట్
మహిళల క్రికెట్లో శ్రీలంక నయా రికార్డు సృష్టించింది. చమరి ఆటపట్టు (195 నాటౌట్; 139 బంతుల్లో 26×4, 5×6) భారీ శతకంతో అదరగొట్టడంతో దక్షిణాఫ్రికాతో మ్యాచ్లో 302 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. -
ఇషా సత్తా చాటేనా!
హైదరాబాదీ షూటర్ ఇషా సింగ్కు సవాల్. పారిస్ ఒలింపిక్స్ టికెట్ కోసం ఆమె పోటీకి సిద్ధమైంది. శుక్రవారం కర్ణిసింగ్ రేంజ్లో ఆరంభమయ్యే సెలక్షన్ ట్రయల్స్లో మహిళల 25 మీటర్ల పిస్టల్ విభాగంలో ఇషా బరిలో దిగనుంది. -
కళ్లన్నీ వినేశ్ పైనే
పారిస్ ఒలింపిక్స్ కోటా స్థానాల వేటకు భారత రెజ్లర్లు సిద్ధమయ్యారు. శుక్రవారం ప్రారంభమయ్యే ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో అత్యుత్తమ ప్రదర్శనే లక్ష్యంగా బరిలో దిగుతున్నారు. -
నదిలో నాలుగు గంటలు
ఒలింపిక్స్ చరిత్రలోనే మొట్టమొదటిగా ఈ మెగా క్రీడల ఆరంభోత్సవ వేడుకలను ఆరుబయట నిర్వహించేందుకు పారిస్ సిద్ధమవుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
నెల్లూరులో తెదేపాలో చేరిన 100 మంది వాలంటీర్లు
-
అది నా డ్రీమ్ సిక్స్.. బుమ్రా బౌలింగ్లో ఇప్పటికి నెరవేరింది: అశుతోష్ శర్మ
-
మధ్యాహ్నం 3 గంటల వరకు 50%పోలింగ్.. అత్యధికంగా ఈ రాష్ట్రంలో..
-
రివ్యూ: సైరెన్.. జయం రవి, కీర్తి సురేశ్ యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉంది?
-
దిల్లీ మద్యం స్కామ్.. సీబీఐ కేసులోనూ అప్రూవర్గా మారిన శరత్ చంద్రారెడ్డి