టీమ్ఇండియా తొలి ఇన్నింగ్స్ 336 ఆలౌట్
ఆస్ట్రేలియాతో జరుగుతోన్న నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్లో టీమ్ఇండియా 336 పరుగులకు ఆలౌటైంది. లోయర్ ఆర్డర్ బ్యాట్స్మెన్ వాషింగ్టన్ సుందర్(62; 144 బంతుల్లో 7x4, 1x6), శార్దూల్ ఠాకుర్(67; 115 బంతుల్లో 9x4, 2x6)...
అర్ధశతకాలతో ఆదుకున్న శార్దూల్, వాషింగ్టన్
ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్ 21/0
బ్రిస్బేన్: ఆస్ట్రేలియాతో జరుగుతోన్న నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్లో టీమ్ఇండియా 336 పరుగులకు ఆలౌటైంది. లోయర్ ఆర్డర్ బ్యాట్స్మెన్ వాషింగ్టన్ సుందర్(62; 144 బంతుల్లో 7x4, 1x6), శార్దూల్ ఠాకుర్(67; 115 బంతుల్లో 9x4, 2x6) అర్ధశతకాలతో రాణించారు. ప్రధాన బ్యాట్స్మెన్ పెద్ద స్కోర్లు చేయకపోయినా వీరిద్దరూ పట్టుదలతో ఆడారు. ఈ క్రమంలోనే గబ్బా మైదానంలో టీమ్ఇండియా తరఫున ఏడో వికెట్కు 123 పరుగుల రికార్డు భాగస్వామ్యం నెలకొల్పారు. దీంతో తొలి ఇన్నింగ్స్లో ఆసీస్ ఆధిక్యం 33కే పరిమితమైంది. కంగారూ బౌలర్లలో హేజిల్వుడ్ 5 వికెట్లు తీయగా, స్టార్క్ 2, కమిన్స్ 2, లైయన్ ఒక వికెట్ తీశారు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన ఆస్ట్రేలియా మూడో రోజు ఆట ముగిసే సమయానికి 6 ఓవర్లలో 21 పరుగులు చేసింది. డేవిడ్ వార్నర్(20), మార్కస్ హారిస్(1) క్రీజులో ఉన్నారు.
కుదురుకున్నట్లే కనిపించినా..
అంతకుముందు 62/2 ఓవర్నైట్ స్కోర్తో ఆదివారం మూడో రోజు బ్యాటింగ్ కొనసాగించిన టీమ్ఇండియా తొలి సెషన్లో మరో 99 పరుగులు జోడించి రెండు వికెట్లు కోల్పోయింది. జట్టు స్కోర్ 105 వద్ద పుజారా(25) మూడో వికెట్గా వెనుదిరిగాడు. హేజిల్వుడ్ బౌలింగ్లో పైన్కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఆపై రహానె(37), మయాంక్ (38) నిలకడగా ఆడినా భోజన విరామం ముందు భారత్ నాలుగో వికెట్ నష్టపోయింది. స్టార్క్ బౌలింగ్లో రహానె వేడ్ చేతికి చిక్కాడు. అప్పటికి భారత్ స్కోర్ 144/4గా నమోదైంది. ఆపై మయాంక్ అగర్వాల్, పంత్ జాగ్రత్తగా ఆడడంతో భారత్ తొలి సెషన్ పూర్తయ్యేసరికి 161/4తో నిలిచింది.
శార్దుల్, సుందర్ లేకుంటే..
ఇక రెండో సెషన్ ప్రారంభమైన తొలి ఓవర్లోనే మయాంక్ హేజిల్వుడ్ బౌలింగ్లో స్మిత్ చేతికి చిక్కాడు. కాసేపటికే పంత్ కూడా గ్రీన్ చేతికి చిక్కడంతో భారత్ 186/6 స్కోర్తో కష్టాల్లో పడింది. ఇక మిగిలింది టెయిలెండర్లే కావడంతో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్లో భారీ ఆధిక్యం సాధించేలా కనిపించింది. అయితే.. శార్దూల్, సుందర్ వారికి ఆ అవకాశం ఇవ్వలేదు. వీరిద్దరూ మరో వికెట్ పడకుండా రెండో సెషన్ను పూర్తి చేశారు. అప్పటికి జట్టు స్కోర్ 253/6కి చేరింది. ఈ క్రమంలోనే టీ విరామం తర్వాత మరింత రెచ్చిపోయిన శార్దూల్, సుందర్ ఆస్ట్రేలియా బౌలర్లపై పూర్తి ఆధిపత్యం చెలాయించారు. ఇద్దరూ అర్ధశతకాలతో ఏడో వికెట్కు శతక భాగస్వామ్యం జోడించారు. చివరికి జట్టు స్కోర్ 309 పరుగుల వద్ద కమిన్స్.. శార్దూల్ను బౌల్డ్ చేయడంతో ఆసీస్ ఊపిరి పీల్చుకుంది. తర్వాత సైని(5), సుందర్(62), సిరాజ్(13) త్వరగానే ఔటయ్యారు. దాంతో టీమ్ఇండియా 111.4 ఓవర్లలో 336 పరుగులు చేసింది.
ఇవీ చదవండి..
మరో 6 పరుగులు చేసుంటే..
శార్దూల్, సుందర్ రికార్డు భాగస్వామ్యం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దాని గురించి మాట్లాడటానికి ఇది సరైన సమయం కాదు: హార్దిక్ పాండ్య
రాజస్థాన్తో జరిగిన మ్యాచ్లో ముంబయి తొమ్మిది వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. అనంతరం ముంబయి కెప్టెన్ హార్దిక్ పాండ్య (Hardik Pandya) మాట్లాడాడు. -
టీ20 వరల్డ్ కప్లో ఓపెనర్లుగా గంగూలీ ఛాయిస్ వీళ్లే..!
T20 World Cup: రాబోయే టీ20 వరల్డ్ కప్ను దృష్టిలో ఉంచుకొని సౌరభ్ గంగూలీ పలు సూచనలు చేశాడు. ఓపెనర్లుగా ఎవరు ఆడితే బాగుంటుందో తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు. అలాగే జట్టు ఎంపిక ఎలా ఉండాలో కూడా సూచించాడు. -
చెపాక్లో చూసుకుందాం.. లఖ్నవూపై చెన్నై ప్రతీకారం తీరేనా?
మళ్లీ మ్యాచ్ చెపాక్కు వచ్చేసింది. లఖ్నవూతో తలపడేందుకు చెన్నై సిద్ధమవుతోంది. ఇరు జట్ల మధ్య జరిగిన గత మ్యాచ్లో కేఎల్ రాహుల్ నాయకత్వంలోని లఖ్నవూ విజయం సాధించింది. -
ఈ కుర్రాడు.. అసామాన్యుడు
కాదు అనుకున్నది చేసి చూపించడం.. ఓటమి తప్పదు అనుకున్న చోట గెలిచి రావడం ఆ కుర్రాడి నైజం. అంచనాలకు మించి రాణించడం.. అద్భుతమైన ఆటతీరుతో అబ్బురపరచడం అతనికి అలవాటు. -
యువరాజు వచ్చేశాడు
భారత్లో ఆదివారం అర్ధరాత్రి. అందరూ గాఢ నిద్రలో ఉండగా.. అక్కడ కెనడాలో ఓ యువరాజు ప్రతిష్ఠాత్మకమైన కిరీటాన్ని ధరించాడు. -
ఆ ఓటమి కసిని పెంచింది
భారత చదరంగ చరిత్రలో అత్యుత్తమ విజయాలు, అసాధారణ ప్రదర్శన అంటే దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ గుర్తుకొస్తాడు. ప్రపంచ చెస్ యవనికపై విషీ ముద్ర అలాంటిది. -
రాయల్స్.. తగ్గేదేలే
ఐపీఎల్-17లో పెద్దగా అంచనాల్లేకుండా బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్.. మ్యాచ్ మ్యాచ్కూ బలపడుతూ వరుస విజయాలతో దూసుకెళ్తోంది. సీజన్లో ఒక్కసారే ఓడిన రాయల్స్.. ఏడో విజయాన్ని నమోదు చేసింది. -
దూకుడు ఫలితాన్నిచ్చింది
క్యాండిడేట్స్ చెస్ టోర్నీలో మునుపెన్నడూ లేనంత పోటీ ఎదురైనట్లు భారత గ్రాండ్మాస్టర్ కోనేరు హంపి తెలిపింది. క్రీడాకారులంతా అత్యుత్తమ సన్నద్ధతతో బరిలో దిగినట్లు చెప్పింది. -
కోహ్లికి జరిమానా
కోల్కతాతో ఐపీఎల్ మ్యాచ్లో అనుచితంగా ప్రవర్తించినందుకు బెంగళూరు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లికి మ్యాచ్ ఫీజులో 50 శాతం కోత పడింది. -
ఇషాకు మూడో స్థానం
ఒలింపిక్ షూటింగ్ సెలక్షన్ ట్రయల్స్లో హైదరాబాదీ అమ్మాయి ఇషాసింగ్ మూడో స్థానంలో నిలిచింది. -
కష్ట కాలంలో కోహ్లి మాటలే..
ఒకప్పుడు ఐపీఎల్లో పేలవ ప్రదర్శనతో విమర్శలెదుర్కొన్న రాజస్థాన్ రాయల్స్ ఆల్రౌండర్ రియాన్ పరాగ్.. ఈ సీజన్లో నిలకడగా రాణిస్తూ ఆశ్చర్యపరుస్తున్నాడు. -
శతకం బాదిన జైస్వాల్.. ముంబయిపై రాజస్థాన్ ఘన విజయం
ముంబయితో జరిగిన పోరులో రాజస్థాన్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 180 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ 18.4 ఓవర్లలో కేవలం ఒక వికెట్ కోల్పోయి ఛేదించింది. ఆజట్టు ఆటగాడు యశస్వి జైస్వాల్ (104*) శతకంతో అదరగొట్టాడు.
తాజా వార్తలు (Latest News)
-
తెలుగులో ‘నాయట్టు’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
దుబాయ్ వరదలకు ముందు.. తర్వాత: శాటిలైట్ చిత్రాల్లో ఇలా
-
ఇన్స్టంట్ ఇ-పాన్ కావాలా..? ఉచితంగా పొందండిలా..
-
వన్ప్లస్ నార్డ్ సీఈ3 ఫోన్పై డిస్కౌంట్.. ఈ సబ్స్క్రిప్షన్లూ ఉచితం!
-
ఆయన్ని చూసి ఆశ్చర్యపోయాను.. అల్లు అర్జున్పై ‘కేజీఎఫ్’ నటుడు ప్రశంసలు..