మూడో టెస్టుకు ఉమేశ్ ఔట్.. శార్దుల్ ఇన్!
ఆస్ట్రేలియాతో జనవరి 7 నుంచి ప్రారంభమయ్యే మూడో టెస్టులో టీమ్ఇండియా పేసర్ ఉమేశ్ యాదవ్ స్థానంలో శార్దుల్ ఠాకుర్ను తీసుకోవాలని భావిస్తున్నట్లు ఓ బీసీసీఐ అధికారి చెప్పారు...
ఇంటర్నెట్డెస్క్: ఆస్ట్రేలియాతో జనవరి 7 నుంచి ప్రారంభమయ్యే మూడో టెస్టులో టీమ్ఇండియా పేసర్ ఉమేశ్ యాదవ్ స్థానంలో శార్దుల్ ఠాకుర్ను తీసుకోవాలని భావిస్తున్నట్లు ఓ బీసీసీఐ అధికారి చెప్పారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. రెండో టెస్టులో ఉమేశ్కు గాయమైన సంగతి తెలిసిందే. దీంతో అతడు మిగతా సిరీస్కు దూరమయ్యాడు. దీంతో భారత్కు తిరిగి వెళ్లి ఎన్సీఏలో చేరే అవకాశం ఉందని ఆయన అన్నారు.
అయితే, ఉమేశ్ స్థానంలో ఇటీవల పరిమిత ఓవర్ల క్రికెట్లో ఆకట్టుకున్న నటరాజన్ను ఎంపిక చేసే అవకాశం ఉన్నా.. టీమ్ఇండియా శార్దుల్ పట్ల సానుకూలంగా ఉందని ఆయన చెప్పారు. ఎందుకంటే నటరాజన్ తమిళనాడు తరఫున ఒకే ఒక్క ఫస్ట్క్లాస్ మ్యాచ్ ఆడాడని, శార్దుల్ ముంబయి తరఫున 62 మ్యాచ్లు ఆడి 206 వికెట్లు తీశాడని బీసీసీఐ అధికారి పేర్కొన్నారు. ఇంతకుముందే అతడు వెస్టిండీస్తో టెస్టు సిరీస్కు ఎంపికైనా గాయం కారణంగా అరంగేట్రం చేయలేకపోయిన సంగతి గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో నటరాజన్కు బదులు శార్దుల్ను ఎంపిక చేసే వీలుందని వివరించారు.
శార్దుల్ ఠాకుర్ బ్యాటింగ్లోనూ రాణించగలడని, ఫస్ట్క్లాస్ క్రికెట్లో 6 అర్ధశతకాలు కూడా చేశాడని సదరు అధికారి పేర్కొన్నారు. దీంతో నటరాజన్ను కాదని, అతడిని ఎంపిక చేయడానికే ఎక్కువ అవకాశాలు ఉన్నట్లు ఆయన అభిప్రాయపడ్డారు. ఏదేమైనా టీమ్ఇండియా సిడ్నీ చేరుకున్నాకే శార్దుల్ను మూడో టెస్టుకు ఎంపిక చేయాలా వద్దా అనేది నిర్ణయిస్తారని తెలిపారు. ఈ విషయంలో హెడ్ కోచ్ రవిశాస్త్రి, తాత్కాలిక కెప్టెన్ రహానె, బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ నిర్ణయం తీసుకుంటారన్నారు. ఇదిలా ఉండగా.. భారత్ మెల్బోర్న్లో విజయం సాధించి సిరీస్ను 1-1తో సమం చేసింది. మిగతా రెండు టెస్టుల్లోనూ విజయం సాధిస్తే రహానె చరిత్ర సృష్టించే అవకాశం ఉంది.
ఇవీ చదవండి..
డేవిడ్ వార్నర్ ‘మహర్షి’ టీజర్ చూశారా?
వార్నర్ దశావతారం..హార్దిక్ హ్యాపీ హ్యాపీ!
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్చ్.. పంజాబ్
13 బంతులు.. 14 పరుగులు.. 4 వికెట్లు! 193 పరుగుల ఛేదనలో పంజాబ్ పరిస్థితిది! బుమ్రా లాంటి మేటి బౌలర్.. బెంబేలెత్తిస్తున్న నేపథ్యంలో ఆ జట్టు కనీసం పోటీలో ఉన్నట్లు కూడా కనపడలేదు. ముంబయి విజయం లాంఛనమేనని తీర్మానించారంతా! కానీ అశుతోష్ శర్మ అసాధారణ బ్యాటింగ్తో పంజాబ్ అద్భుతం చేసినంత పని చేసింది. -
అశుతోష్.. నయా మెరుపు
గుజరాత్తో పంజాబ్ మ్యాచ్.. లక్ష్యం 200.. 150కే 6 వికెట్లు పడిపోయాయి.. ఉన్న ఓవర్లు కూడా తక్కువే! అయినా చివరికి పంజాబ్ గెలిచింది! -
ఇంపాక్ట్ ప్లేయర్తో నష్టమే
ఐపీఎల్ గతేడాది ప్రవేశ పెట్టిన ఇంపాక్ట్ ప్లేయర్ విధానం కారణంగా ఆల్రౌండర్లకు నష్టం కలుగుతోందని టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అభిప్రాయపడ్డాడు. -
చమరి 195 నాటౌట్
మహిళల క్రికెట్లో శ్రీలంక నయా రికార్డు సృష్టించింది. చమరి ఆటపట్టు (195 నాటౌట్; 139 బంతుల్లో 26×4, 5×6) భారీ శతకంతో అదరగొట్టడంతో దక్షిణాఫ్రికాతో మ్యాచ్లో 302 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. -
ఇషా సత్తా చాటేనా!
హైదరాబాదీ షూటర్ ఇషా సింగ్కు సవాల్. పారిస్ ఒలింపిక్స్ టికెట్ కోసం ఆమె పోటీకి సిద్ధమైంది. శుక్రవారం కర్ణిసింగ్ రేంజ్లో ఆరంభమయ్యే సెలక్షన్ ట్రయల్స్లో మహిళల 25 మీటర్ల పిస్టల్ విభాగంలో ఇషా బరిలో దిగనుంది. -
కళ్లన్నీ వినేశ్ పైనే
పారిస్ ఒలింపిక్స్ కోటా స్థానాల వేటకు భారత రెజ్లర్లు సిద్ధమయ్యారు. శుక్రవారం ప్రారంభమయ్యే ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో అత్యుత్తమ ప్రదర్శనే లక్ష్యంగా బరిలో దిగుతున్నారు. -
నదిలో నాలుగు గంటలు
ఒలింపిక్స్ చరిత్రలోనే మొట్టమొదటిగా ఈ మెగా క్రీడల ఆరంభోత్సవ వేడుకలను ఆరుబయట నిర్వహించేందుకు పారిస్ సిద్ధమవుతోంది. -
ఆల్రౌండర్లకు దెబ్బ
టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ చెప్పినట్లు ఐపీఎల్లో ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన భారత ఆల్రౌండర్లకు చేటు చేస్తోంది. టీ20 ప్రపంచకప్లో తలపడే టీమ్ఇండియా ఎంపిక కోసం ఐపీఎల్ ప్రదర్శన కూడా పరిగణలోకి తీసుకుంటారనే చెప్పాలి.
తాజా వార్తలు (Latest News)
-
పేదరాలు బుట్టమ్మ ఆస్తులు రూ.161.21 కోట్లు
-
నా భర్తపై రెబల్గా పోటీ చేస్తా.. టెక్కలి వైకాపా అభ్యర్థి దువ్వాడ భార్య వాణి
-
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
-
గూగుల్ మ్యాప్స్లో మరో కొత్త ఫీచర్.. ఈవీ స్టేషన్లు వెతకడం ఇక సులువే!
-
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు
-
40 గంటల బ్యాటరీ లైఫ్తో నథింగ్ నుంచి 2 కొత్త ఇయర్బడ్స్