WTC Finals: కుర్రాళ్లు మానసికంగా సిద్ధమయ్యారు
ఐసీసీ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్కు టీమ్ఇండియా మానసికంగా సిద్ధంగా ఉందని ఫీల్డింగ్ కోచ్ ఆర్.శ్రీధర్ అన్నారు. సాధనకు సమయం లేకపోవడం పట్ల ఆందోళన లేదని పేర్కొన్నారు.....
ఇంటర్నెట్ డెస్క్: ఐసీసీ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్కు టీమ్ఇండియా మానసికంగా సిద్ధంగా ఉందని ఫీల్డింగ్ కోచ్ ఆర్.శ్రీధర్ అన్నారు. సాధనకు సమయం లేకపోవడం పట్ల ఆందోళన లేదని పేర్కొన్నారు. ప్రత్యర్థి జట్టులోనూ బలమైన క్రికెటర్లు ఉన్నారని వెల్లడించారు. కొవిడ్ మహమ్మారిపై పోరాటంలో విరాట్ కోహ్లీ, హనుమ విహారి, హార్దిక్ పాండ్య సహా క్రికెటర్లు పాలుపంచుకోవడం సంతోషకరమని తెలిపారు.
‘సాధనకు సమయం లేనందుకు ఆందోళనేమీ లేదు. పూర్తి సన్నద్ధత లేకపోవడం మాకు అనుకూలమే. ఎందుకంటే మా ఆటగాళ్లు మానసికంగా మరింత సన్నద్ధంగా ఉంటారు. గాయపడ్డప్పుడు ఆడినట్లుగా అన్నమాట. మా క్రికెటర్లు నెలల తరబడి క్రికెట్ ఆడుతూనే ఉన్నారు. ఐపీఎల్ వాయిదా పడటం దురదృష్టకరం. క్వారంటైన్లో కుర్రాళ్లు దేహదారుఢ్యం పెంచుకుంటారు. ఫైనల్కు తాజాగా సిద్ధమవుతారు’ అని శ్రీధర్ అన్నారు.
‘మా క్రికెటర్లంతా ప్రొఫెషనల్స్. ఏడాది సాంతం ఫిట్నెస్తో ఉంటారు. క్వారంటైన్ సమయంలో వారితో ప్రత్యేకమైన కసరత్తులేమీ చేయించడం లేదు. ఆటగాళ్లకు ఏవి ఎలా పనిచేస్తాయో తెలుసని నమ్ముతా. అవసరమనిపిస్తేనే జోక్యం చేసుకుంటాను. నేను వాళ్లతోనే ఉంటానని తెలుసు కాబట్టి నా సాయం అవసరమైతే కోరతారు. ఇక ప్రత్యర్థి జట్టులో కొందరిపైనే మేం దృష్టి పెట్టడం లేదు. ఎందుకంటే న్యూజిలాండ్ బలమైన జట్టు. తటస్థ వేదిక కాబట్టి వారికీ, మాకూ ఒకేలాంటి అవకాశాలు ఉంటాయి’ అని శ్రీధర్ తెలిపారు.
కొవిడ్-19 వల్ల దేశవ్యాప్తంగా ఎన్నో ఇబ్బందులు తలెత్తాయని శ్రీధర్ అన్నారు. తనకు తోచిన రీతిలో కొవిడ్ బాధితులకు సాయం చేస్తున్నానని వెల్లడించారు. కోహ్లీ, విహారి, పాండ్య, ఇంకా మరెంతో మంది క్రికెటర్లు చేయూతనందించడం గర్వకారణమని వెల్లడించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దిల్లీ గట్టెక్కింది
ఐపీఎల్-17లో తడబడుతూ సాగుతున్న దిల్లీ క్యాపిటల్స్.. ప్లేఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లుతున్న సమయంలో ఓ కీలక విజయం సాధించింది. బుధవారం ఆ జట్టు గుజరాత్ టైటాన్స్ను 4 పరుగుల స్వల్ప తేడాతో ఓడించింది. -
మోహిత్.. చెత్త రికార్డు
గుజరాత్ టైటాన్స్ పేసర్ మోహిత్ శర్మ చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఓ ఐపీఎల్ మ్యాచ్లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్గా అతను రికార్డులకెక్కాడు. -
పొట్టి కప్పులో ఎవరు?
వెస్టిండీస్, అమెరికా ఉమ్మడిగా ఆతిథ్యమిస్తున్న టీ20 ప్రపంచకప్ కోసం 15 మంది జట్టుతో పాటు అయిదుగురు రిజర్వ్ ఆటగాళ్లనూ ప్రకటించేందుకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ కసరత్తులు చేస్తోంది. -
300 కొట్టేస్తారా?
ఈ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ నమోదు చేసిన రికార్డులివీ. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్లతో రికార్డులు తిరగరాస్తున్న సన్రైజర్స్ పొట్టి లీగ్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. -
తాగి చెస్ ఆడా.. ప్యాంట్లో మూత్రం పోసుకున్నా..
చెస్ మేటి మాగ్నస్ కార్ల్సన్ ఇటీవల ఓ కొత్త సవాలును స్వీకరించాడు. సత్యశోధన పరీక్ష (లై డిటెక్టర్ టెస్ట్)లో తన చెస్ కెరీర్, వ్యక్తిగత జీవితంపై అనేక ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. -
ఫైనల్లో జ్యోతి జట్టు
ఆర్చరీ ప్రపంచకప్లో భారత ఆర్చర్ల దూకుడు కొనసాగుతోంది. విజయవాడ అమ్మాయి జ్యోతి సురేఖ జట్టు కాంపౌడ్ మహిళల విభాగంలో ఫైనల్లో అడుగుపెట్టింది. -
దీపాన్షుకు జావెలిన్ స్వర్ణం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ తొలి రోజు, బుధవారం భారత అథ్లెట్లు సత్తా చాటారు. పురుషుల జావెలిన్ త్రోలో దీపాన్షు శర్మ స్వర్ణం గెలుచుకున్నాడు. -
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
T20 Worldcup 2024 - BCCI: వచ్చే టీ20 ప్రపంచకప్ కోసం ఏ 15 మందిని ఎంపిక చేస్తే బాగుంటుంది. -
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
ఐపీఎల్లో ఫినిషర్గా అదరగొడుతున్న ఎంఎస్ ధోనీ (MS Dhoni)ని టీ20 వరల్డ్కప్నకు ఎంపిక చేయాలనే ఆలోచనను పలువురు మాజీలు కోరుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఒకే ద్విచక్రవాహనంపై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
-
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
-
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’