WTC: ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్.. ‘ఫైనల్’కు దగ్గరైన టీమ్ఇండియా
ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ (WTC) ఫైనల్ పోరుకు భారత్(Team India) మరో అడుగు ముందుకేసింది. నాగ్పూర్ టెస్టులో ఘన విజయం సాధించి తన అవకాశాలను మరింత మెరుగుపర్చుకుంది.
ఇంటర్నెట్ డెస్క్: ప్రతిష్ఠాత్మక బోర్డర్ - గావస్కర్ (Border-Gavaskar Trophy) ట్రోఫీని టీమ్ఇండియా ఘనంగా ఆరంభించింది. తొలి టెస్టులో ఆది నుంచే పట్టుబిగించిన రోహిత్ సేన.. ఆస్ట్రేలియాపై ఇన్నింగ్స్ 132 పరుగుల తేడాతో అద్భుత విజయం సాధించింది. ఈ విజయంతో ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ (World Test Championship) ఫైనల్ పోరుకు భారత జట్టు (Team India) మరింత దగ్గరైంది.
ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ (WTC) పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉన్న టీమిండియా (Team India) గెలుపు శాతం నాగ్పూర్ టెస్టుకు ముందు 58.93గా ఉండగా.. నేటి విజయంతో అది 61.67 శాతానికి పెరిగింది. ఇక ఈ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న ఆసీస్ (Australia) గెలుపు శాతం 75.56 నుంచి 70.83కు పడిపోయింది. గత డబ్ల్యూటీసీ ఫైనల్లో న్యూజిలాండ్ చేతిలో ఓడి రన్నరప్గా నిలిచిన టీమ్ఇండియా.. ఈసారి ఫైనల్ బెర్త్ను ఖరారు చేసుకోవాలంటే బోర్డర్ గావస్కర్ ట్రోఫీ సిరీస్లోని మిగతా మూడు మ్యాచ్ల్లో కనీసం రెండింట విజయం సాధించాలి.
మరోవైపు ఈ పాయింట్ల పట్టికలో శ్రీలంక (53.33శాతం), దక్షిణాఫ్రికా (48.72) వరుసగా మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నాయి. అయితే ఈ జట్ల ‘ఫైనల్’ అవకాశాలు కూడా బోర్డర్ - గావస్కర్ ట్రోఫీ సిరీస్ ఫలితంపైనే ఆధారపడి ఉన్నాయి. ఒకవేళ, ఈ సిరీస్లో ఆసీస్ జట్టు పుంజుకుని 2-2తో విజయం సాధించి.. అటు న్యూజిలాండ్తో సిరీస్ను శ్రీలంక 2-0తో గెలిస్తే.. భారత్ ఫైనల్ (WTC Final) పోరుకు దూరమయ్యే అవకాశాలున్నాయి. ఇక ఇంగ్లాండ్, వెస్టిండీస్, పాకిస్థాన్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్ జట్లు ఇప్పటికే ఫైనల్ రేసు నుంచి వైదొలిగాయి.
నాగ్పూర్ వేదికగా జరిగిన తొలి టెస్టులో టీమ్ఇండియా ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టింది. కెప్టెన్ రోహిత్ శర్మ శతకానికి తోడు అక్షర్ పటేల్, జడేజా మెరుపులు మెరిపించడంతో తొలి ఇన్నింగ్స్లో భారత జట్టు 400 పరుగులు చేసింది. అంతకుముందు భారత స్పిన్నర్ల ధాటికి ఆసీస్ తొలి ఇన్నింగ్స్లో 177 పరుగులు చేయగా.. రెండో ఇన్నింగ్స్లో 91 పరుగులకే కుప్పకూలింది. దీంతో ఇన్నింగ్స్ 132 పరుగుల తేడాతో రోహిత్ సేన విజయం సాధించి సిరీస్లో 1-0తో ఆధిక్యంతో నిలిచింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కేఎల్ రాహుల్ కెప్టెన్ ఇన్నింగ్స్.. చెన్నైకి చెక్
ఏక్నా స్టేడియంలోని నెమ్మదైన పిచ్పై స్కోరు 160 దాటిందంటే ఛేదన కష్టమే. ఓ దశలో చెన్నై 150 అయినా చేస్తుందా అనుకుంటే.. గత మ్యాచ్లో ముంబయిపై చెలరేగినట్లే మహేంద్రసింగ్ ధోని ఈ మ్యాచ్లోనూ ఆఖర్లో మెరుపు ఇన్నింగ్స్ ఆడడంతో చెన్నై స్కోరు 176కు చేరుకుంది. -
ధోని.. ఇంకా నాటౌటే
చివరి సీజన్గా భావిస్తున్న ఈ ఐపీఎల్లో బ్యాటింగ్ చేస్తోంది తక్కువసేపే అయినా అభిమానులను ఉర్రూతలూగిస్తున్నాడు ధోని. -
కుర్రాళ్లు కుమ్మేస్తున్నారు
ఛేదనలో నాలుగైదు వికెట్లు పడ్డాయా? అయినా భయం లేదు తామున్నామంటూ సత్తాచాటుతున్నారు. -
బుమ్రా బౌలింగ్లో స్వీప్ షాట్.. నా కల!
అశుతోష్ శర్మ.. ఈ ఐపీఎల్లో గట్టిగా వినిపిస్తున్న కొత్త పేరు. -
రేసులో గుకేశ్ ఒక్కడే..
క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్లో భారత యువ కెరటం గుకేశ్ మళ్లీ ఆధిక్యంలోకి వచ్చాడు. -
మెరిసిన ఇషా, భవేష్
ఒలింపిక్స్ సెలెక్షన్ ట్రయల్స్లో అగ్రశ్రేణి షూటర్లు ఇషా సింగ్, భవేష్ షెకావత్ మెరిశారు. -
దీపకు నాలుగో స్థానం
దోహాలో జరిగిన జిమ్నాస్టిక్స్ ప్రపంచకప్ను భారత స్టార్ దీప కర్మాకర్ నాలుగో స్థానంతో ముగించింది. -
భారత రెజ్లర్లు విఫలం
ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో భారత పురుష రెజ్లర్లు విఫలమయ్యారు. -
విమానం ఆలస్యమై...
భారత ఉత్తమ రెజ్లర్లలో ఇద్దరైన దీపక్ పునియా (86 కేజీలు), సుజీత్ కలాకల్ (65 కేజీలు)కు నిరాశ తప్పలేదు. -
రాకెట్ వదిలేద్దాం అనుకున్నా
గత కొన్నేళ్లలో కెరీర్లో ఎంతో క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొన్నానని.. ఒకటికి రెండుసార్లు బ్యాడ్మింటన్కు వీడ్కోలు చెప్పాలని భావించానని భారత డబుల్స్ స్టార్ అశ్విని పొన్నప్ప తెలిపింది. -
చెరువుల సంరక్షణ కోసం ఆర్సీబీ
ఐపీఎల్ జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టింది.
తాజా వార్తలు (Latest News)
-
జగన్ ఎదుటే జనసేనానికి జేజేలు.. విద్యార్థుల నినాదాలతో అవాక్కయిన సీఎం
-
‘ఉండి’ అభ్యర్థిగా 22న నామినేషన్: రఘురామ
-
తెదేపా కార్యాలయం వద్ద టాస్క్ఫోర్స్ కదలికలు
-
ఒలింపిక్స్లో పతకం తెస్తే బీఎండబ్ల్యూ కారు
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!