Team India: ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్లో టీమ్ఇండియా ఎక్కడంటే?
ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ పాయింట్ల పట్టికలో టీమ్ఇండియా ఒక స్థానం మెరుగుపర్చుకొని నాలుగో స్థానానికి ఎగబాకింది. ఇంతకుముందు ఐదో స్థానంలో నిలిచిన రోహిత్ సేన తాజాగా శ్రీలంకపై...
ఇంటర్నెట్డెస్క్: ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ పాయింట్ల పట్టికలో టీమ్ఇండియా ఒక స్థానం మెరుగుపర్చుకొని నాలుగో స్థానానికి ఎగబాకింది. ఇంతకుముందు ఐదో స్థానంలో నిలిచిన రోహిత్ సేన తాజాగా శ్రీలంకపై రెండో టెస్టు గెలిచింది. దీంతో 2-0 తేడాతో టెస్టు సిరీస్ను క్లీన్స్వీప్ చేసింది. ఈ క్రమంలోనే తాజా ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ పట్టికలో కాస్త మెరుగైంది. మరోవైపు టీమ్ఇండియాకు ఈ సిరీస్ గెలుపు భారీ ఉపశమనం కలిగించింది. ఇంతకుముందు దక్షిణాఫ్రికాలో ఆడిన సిరీస్లో భారత్ 1-2 తేడాతో ఓటమిపాలైన సంగతి తెలిసిందే. ఇక రోహిత్ కెప్టెన్సీ చేపట్టాక వరుస విజయాలతో దూసుకుపోతున్న టీమ్ఇండియా శ్రీలంకను వైట్వాష్ చేసింది. ఇక ఛాంపియన్షిప్ పట్టికలో ఆస్ట్రేలియా నంబర్ వన్ జట్టుగా కొనసాగుతుండగా.. పాకిస్థాన్, దక్షిణాఫ్రికా జట్లు తర్వాతి స్థానాల్లో నిలిచాయి.
తొలి బౌలర్గా అశ్విన్ రికార్డు
ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్లో వంద వికెట్ల మైలురాయిని అందుకున్న తొలి బౌలర్గా టీమ్ఇండియా టాప్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ రికార్డు సృష్టించాడు. తొలి డబ్ల్యూటీసీలో 14 మ్యాచ్లకుగాను 79 వికెట్లు తీసిన అశ్విన్.. రెండో డబ్ల్యూటీసీ పోటీల్లో ఏడు మ్యాచుల్లో 21 వికెట్లు పడగొట్టాడు. దీంతో 21 టెస్టుల్లో 100 వికెట్లను తీశాడు. ఇక ప్రస్తుతం కొనసాగుతున్న రెండో డబ్ల్యూటీసీలో ఆరోస్థానంలో కొనసాగుతున్నాడు. అందరికంటే బుమ్రా (40) ఎక్కువ వికెట్లను తీశాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దిల్లీ గట్టెక్కింది
ఐపీఎల్-17లో తడబడుతూ సాగుతున్న దిల్లీ క్యాపిటల్స్.. ప్లేఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లుతున్న సమయంలో ఓ కీలక విజయం సాధించింది. బుధవారం ఆ జట్టు గుజరాత్ టైటాన్స్ను 4 పరుగుల స్వల్ప తేడాతో ఓడించింది. -
మోహిత్.. చెత్త రికార్డు
గుజరాత్ టైటాన్స్ పేసర్ మోహిత్ శర్మ చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఓ ఐపీఎల్ మ్యాచ్లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్గా అతను రికార్డులకెక్కాడు. -
పొట్టి కప్పులో ఎవరు?
వెస్టిండీస్, అమెరికా ఉమ్మడిగా ఆతిథ్యమిస్తున్న టీ20 ప్రపంచకప్ కోసం 15 మంది జట్టుతో పాటు అయిదుగురు రిజర్వ్ ఆటగాళ్లనూ ప్రకటించేందుకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ కసరత్తులు చేస్తోంది. -
300 కొట్టేస్తారా?
ఈ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ నమోదు చేసిన రికార్డులివీ. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్లతో రికార్డులు తిరగరాస్తున్న సన్రైజర్స్ పొట్టి లీగ్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. -
తాగి చెస్ ఆడా.. ప్యాంట్లో మూత్రం పోసుకున్నా..
చెస్ మేటి మాగ్నస్ కార్ల్సన్ ఇటీవల ఓ కొత్త సవాలును స్వీకరించాడు. సత్యశోధన పరీక్ష (లై డిటెక్టర్ టెస్ట్)లో తన చెస్ కెరీర్, వ్యక్తిగత జీవితంపై అనేక ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. -
ఫైనల్లో జ్యోతి జట్టు
ఆర్చరీ ప్రపంచకప్లో భారత ఆర్చర్ల దూకుడు కొనసాగుతోంది. విజయవాడ అమ్మాయి జ్యోతి సురేఖ జట్టు కాంపౌడ్ మహిళల విభాగంలో ఫైనల్లో అడుగుపెట్టింది. -
దీపాన్షుకు జావెలిన్ స్వర్ణం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ తొలి రోజు, బుధవారం భారత అథ్లెట్లు సత్తా చాటారు. పురుషుల జావెలిన్ త్రోలో దీపాన్షు శర్మ స్వర్ణం గెలుచుకున్నాడు. -
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
T20 Worldcup 2024 - BCCI: వచ్చే టీ20 ప్రపంచకప్ కోసం ఏ 15 మందిని ఎంపిక చేస్తే బాగుంటుంది. -
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
ఐపీఎల్లో ఫినిషర్గా అదరగొడుతున్న ఎంఎస్ ధోనీ (MS Dhoni)ని టీ20 వరల్డ్కప్నకు ఎంపిక చేయాలనే ఆలోచనను పలువురు మాజీలు కోరుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
-
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?
-
ఒకే ద్విచక్రవాహనంపై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’