శంషాబాద్లో సిరాజ్కు ఘన స్వాగతం..
ఆస్ట్రేలియా పర్యటనలో అద్భుత ప్రదర్శన చేసి అద్వితీయ సిరీస్ విజయంలో కీలక బౌలర్గా సేవలందించిన టీమ్ఇండియా పేసర్ మహ్మద్ సిరాజ్ కొద్దిసేపటి క్రితమే శంషాబాద్ విమానాశ్రయానికి...
శంషాబాద్: ఆస్ట్రేలియా పర్యటనలో అద్భుత ప్రదర్శన చేసిన టీమ్ఇండియా పేసర్ మహ్మద్ సిరాజ్ గురువారం ఉదయం శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నాడు. ఈ సందర్భంగా అతడికి ఘన స్వాగతం లభించింది. సిడ్నీ టెస్టులో అతడు జాత్యహంకార వ్యాఖ్యలు ఎదుర్కొని ఇబ్బందులు పడిన విషయం తెలిసిందే. సిరీస్లో నిర్ణయాత్మకమైన గబ్బా టెస్టులో ఆస్ట్రేలియా వెన్ను విరిచాడు. రెండో ఇన్నింగ్స్లో మొత్తం ఐదు వికెట్లు తీసి ఆ జట్టు భారీ స్కోర్ చేయకుండా నిలువరించాడు. ఆపై రిషభ్ పంత్(89*) చెలరేగడంతో టీమ్ఇండియా 2-1 తేడాతో సిరీస్ కైవసం చేసుకుంది.
ఐపీఎల్ తర్వాత ఇతర ఆటగాళ్లతో కలిసి సిరాజ్ నేరుగా యూఏఈ నుంచి ఆస్ట్రేలియా చేరుకున్నాడు. అదే సమయంలో సిరాజ్ తండ్రి అనారోగ్యంతో కన్నుమూశారు. అయినా, ఈ హైదరాబాదీ పేసర్ చివరి చూపులకు రాకుండా జట్టు కోసం అక్కడే ఉండిపోయాడు. ఈ నేపథ్యంలోనే అక్కడ మంచి ప్రదర్శన చేసిన సిరాజ్ అందరి ప్రశంసలు పొందాడు.
అలాగే, ఇతర ఆటగాళ్లు కూడా భారత్కు చేరుకున్నారు. తాత్కాలిక కెప్టెన్ అజింక్య రహానె, రోహిత్ శర్మ, శార్దూల్ ఠాకుర్, పృథ్వీషా, కోచ్ రవిశాస్త్రి ముంబయికి చేరుకోగా.. నటరాజన్ బెంగళూరు విమానాశ్రయంలో దిగి తమిళనాడులోని స్వగ్రామానికి పయనమయ్యాడు. గబ్బా హీరో రిషభ్ పంత్ దిల్లీకి చేరుకున్నాడు. ఈ క్రమంలోనే చెన్నైకి చెందిన ఆటగాళ్లు రవిచంద్రన్ అశ్విన్, వాషింగ్టన్ సుందర్, బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ ప్రస్తుతం దుబాయ్లో ఉన్నారు. వీరు శుక్రవారం ఉదయం నేరుగా చెన్నైకి చేరుకోనున్నారు. కాగా, వారికి ఆయా విమానాశ్రయాల్లో ఘన స్వాగతం లభించింది.
ఇవీ చదవండి..
రిషభ్ పంత్ కాదు.. స్పైడర్ పంత్: ఐసీసీ
2-1 కాదు 2-0!
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్చ్.. పంజాబ్
13 బంతులు.. 14 పరుగులు.. 4 వికెట్లు! 193 పరుగుల ఛేదనలో పంజాబ్ పరిస్థితిది! బుమ్రా లాంటి మేటి బౌలర్.. బెంబేలెత్తిస్తున్న నేపథ్యంలో ఆ జట్టు కనీసం పోటీలో ఉన్నట్లు కూడా కనపడలేదు. ముంబయి విజయం లాంఛనమేనని తీర్మానించారంతా! కానీ అశుతోష్ శర్మ అసాధారణ బ్యాటింగ్తో పంజాబ్ అద్భుతం చేసినంత పని చేసింది. -
అశుతోష్.. నయా మెరుపు
గుజరాత్తో పంజాబ్ మ్యాచ్.. లక్ష్యం 200.. 150కే 6 వికెట్లు పడిపోయాయి.. ఉన్న ఓవర్లు కూడా తక్కువే! అయినా చివరికి పంజాబ్ గెలిచింది! -
ఇంపాక్ట్ ప్లేయర్తో నష్టమే
ఐపీఎల్ గతేడాది ప్రవేశ పెట్టిన ఇంపాక్ట్ ప్లేయర్ విధానం కారణంగా ఆల్రౌండర్లకు నష్టం కలుగుతోందని టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అభిప్రాయపడ్డాడు. -
చమరి 195 నాటౌట్
మహిళల క్రికెట్లో శ్రీలంక నయా రికార్డు సృష్టించింది. చమరి ఆటపట్టు (195 నాటౌట్; 139 బంతుల్లో 26×4, 5×6) భారీ శతకంతో అదరగొట్టడంతో దక్షిణాఫ్రికాతో మ్యాచ్లో 302 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. -
ఇషా సత్తా చాటేనా!
హైదరాబాదీ షూటర్ ఇషా సింగ్కు సవాల్. పారిస్ ఒలింపిక్స్ టికెట్ కోసం ఆమె పోటీకి సిద్ధమైంది. శుక్రవారం కర్ణిసింగ్ రేంజ్లో ఆరంభమయ్యే సెలక్షన్ ట్రయల్స్లో మహిళల 25 మీటర్ల పిస్టల్ విభాగంలో ఇషా బరిలో దిగనుంది. -
కళ్లన్నీ వినేశ్ పైనే
పారిస్ ఒలింపిక్స్ కోటా స్థానాల వేటకు భారత రెజ్లర్లు సిద్ధమయ్యారు. శుక్రవారం ప్రారంభమయ్యే ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో అత్యుత్తమ ప్రదర్శనే లక్ష్యంగా బరిలో దిగుతున్నారు. -
నదిలో నాలుగు గంటలు
ఒలింపిక్స్ చరిత్రలోనే మొట్టమొదటిగా ఈ మెగా క్రీడల ఆరంభోత్సవ వేడుకలను ఆరుబయట నిర్వహించేందుకు పారిస్ సిద్ధమవుతోంది. -
ఆల్రౌండర్లకు దెబ్బ
టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ చెప్పినట్లు ఐపీఎల్లో ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన భారత ఆల్రౌండర్లకు చేటు చేస్తోంది. టీ20 ప్రపంచకప్లో తలపడే టీమ్ఇండియా ఎంపిక కోసం ఐపీఎల్ ప్రదర్శన కూడా పరిగణలోకి తీసుకుంటారనే చెప్పాలి.
తాజా వార్తలు (Latest News)
-
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షలు
-
పేదరాలు బుట్టమ్మ ఆస్తులు రూ.161.21 కోట్లు
-
నా భర్తపై రెబల్గా పోటీ చేస్తా.. టెక్కలి వైకాపా అభ్యర్థి దువ్వాడ భార్య వాణి
-
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
-
గూగుల్ మ్యాప్స్లో మరో కొత్త ఫీచర్.. ఈవీ స్టేషన్లు వెతకడం ఇక సులువే!
-
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు