Covid Relief: పాండ్య సోదరులు.. మీరు గ్రేట్!
టీమ్ఇండియా పోండ్య సోదరులు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నారు. కరోనా రెండో దశ తీవ్రంగా ఉన్న నేపథ్యంలో వాళ్లిద్దరూ ఈనెల ఆరంభంలో తమ కుటుంబం తరఫున 200 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు అందజేస్తామని చెప్పారు...
ఇంటర్నెట్డెస్క్: టీమ్ఇండియా పోండ్య సోదరులు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నారు. కరోనా రెండో దశ తీవ్రంగా ఉన్న నేపథ్యంలో వాళ్లిద్దరూ ఈనెల ఆరంభంలో తమ కుటుంబం తరఫున 200 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు అందజేస్తామని చెప్పారు. ఈ క్రమంలోనే సోమవారం తమకు అందిన కొన్ని ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లను అవసరమైన కొవిడ్ కేర్ సెంటర్లకు తరలించారు. అందుకు సంబంధించిన ఫొటోను ట్విటర్లో పంచుకున్న కృనాల్ పాండ్య ప్రతి ఒక్కరూ త్వరగా కోలుకోవాలని తాము కోరుకుంటున్నామని చెప్పాడు.
అలాగే హార్దిక్ పాండ్య ట్వీట్ చేస్తూ అందరం కలిసుంటేనే ఈ మహమ్మారిపై విజయం సాధిస్తామని అన్నాడు. ప్రస్తుతం కరోనాపై యుద్ధంలో మధ్యలో ఉన్నామని, కలిసికట్టుగా ఎదుర్కోవాలని సూచించాడు. కాగా, దేశంలో ప్రస్తుతం నెలకొన్న విపత్కర పరిస్థితుల్లో పాండ్య సోదరులే కాకుండా పలువురు క్రికెటర్లు సైతం తమకు తోచిన సాయం చేస్తున్నారు. కెప్టెన్ విరాట్ కోహ్లీ-అనుష్క దంపతులు రూ.11 కోట్లకుపైగా విరాళాలు సేకరించగా.. హనుమ విహారి, వృద్ధిమాన్ సాహా, మహిళా క్రికెటర్ వేదా కృష్ణమూర్తి లాంటి వారు సామాజిక మాధ్యమాల ద్వారా వీలైనంత సాయం అందజేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
హైదరాబాద్, ముంబయి మ్యాచ్లో నమోదైన రికార్డులివీ..
-
రాశీఖన్నా ‘గోల్డెన్’ మెరుపులు.. అలా చూడొద్దన్న కేతిక.. టీమ్తో కృతి సనన్
-
లీడర్ పిలిస్తే.. జనసేన పార్టీ ప్రచారానికి సిద్ధంగా ఉన్నా: నటి అనసూయ
-
నా దగ్గర అంత డబ్బు లేదు.. అందుకే పోటీ చేయట్లేదు: నిర్మలా సీతారామన్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (28/03/2024)
-
మాల్దీవుల్లో తాగునీటి కొరత.. టిబెట్ నుంచి 1500 టన్నుల నీరు పంపిన చైనా