IND vs SL : టీమ్ఇండియాకు ‘గులాబీ’ గుబాళించేనా...? గుచ్చుకునేనా..?
అంతర్జాతీయంగా సుదీర్ఘ ఫార్మాట్ టెస్టు క్రికెట్కు ప్రత్యేక స్థానముంది. వన్డేలు, టీ20లు వచ్చిన ...
ఈ మధ్యాహ్నం నుంచి లంకతో డే/నైట్ టెస్టు మ్యాచ్
ఇంటర్నెట్ డెస్క్: అంతర్జాతీయంగా సుదీర్ఘ ఫార్మాట్ టెస్టు క్రికెట్కు ప్రత్యేక స్థానముంది. వన్డేలు, టీ20లు వచ్చిన తర్వాత ఆటలో వేగం పెరిగింది. అయితే ఇప్పటికీ టెస్టు క్రికెట్నే క్లాస్ ఆటగా చెప్పేవారూ ఉన్నారంటే అభిమానుల్లో ఆదరణ ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఐదు రోజులపాటు ఇరు జట్లు విజయం కోసం పోరాటం సాగించే తీరు ఇటీవల మరింత ఆకట్టుకుంటోంది. ఈ క్రమంలో ఐసీసీ గులాబీ బంతి (పింక్ బాల్) క్రికెట్ను అంతర్జాతీయ స్థాయిలో ప్రవేశపెట్టింది. టీమ్ఇండియా ఇప్పటి వరకు మూడే గులాబీ టెస్టులను ఆడింది. మరి ఎప్పుడు గులాబీ టెస్టులు ప్రారంభమయ్యాయి.. ఎన్ని జరిగాయి.. భారత్ పరిస్థితేంటో తెలుసుకుందాం..
ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్ల మధ్య 2015 నవంబర్ 27-డిసెంబర్ 1 వరకు తొలి గులాబీ టెస్టు (డే/నైట్) జరిగింది. అందులో ఆసీస్ మూడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు 18 టెస్టులు జరిగాయి. మార్చి 12 నుంచి 16వ తేదీ వరకు భారత్-శ్రీలంక మధ్య జరిగే బెంగళూరు టెస్టు అంతర్జాతీయంగా 19వ మ్యాచ్. రికార్డుపరంగా చూసుకుంటే... ఆస్ట్రేలియానే ఎక్కువ మ్యాచ్లను గెలిచింది. పది టెస్టులకుగాను పదింటిలోనూ విజయం సాధించడం విశేషం. టీమ్ఇండియాకు మాత్రం ఇది నాలుగో డే/నైట్ టెస్టు. మిగతా మూడు మ్యాచుల్లో భారత్ రెండు విజయాలు, ఒక ఘోర ఓటమి చవిచూసింది. మరి ఈసారి గులాబీ టెస్టులో భారత్ గుబాళిస్తుందా..? గుచ్చుకుంటుందో వేచి చూడాలి.
తొలి గులాబీ టెస్టులో...?
ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన తొలి గులాబీ టెస్టులో (2019 నవంబర్ 22-26) పసికూన బంగ్లాదేశ్ను భారత్ చిత్తు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లా మొదటి ఇన్నింగ్స్లో 106 పరుగులకే ఆలౌటైంది. అనంతరం టీమ్ఇండియా 347/9 వద్ద డిక్లేర్డ్ చేసింది. విరాట్ కోహ్లీ (136) శతకం సహా ఛెతేశ్వర్ పుజారా, అజింక్య రహానె హాఫ్ సెంచరీలతో రాణించారు. మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. 241 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్ ఆడిన బంగ్లాదేశ్ 195 పరుగులకే కుప్పకూలింది. దీంతో భారత్ ఇన్నింగ్స్ 46 పరుగుల తేడాతో విజయం సాధించింది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ఇషాంత్ శర్మ (5/22, 4/45), ఉమేశ్ యాదవ్ (3/29, 5/53) బౌలింగ్లో చెలరేగారు. ఈసారి గులాబీ టెస్టులోనైనా విరాట్ కోహ్లీ సెంచరీ చేయాలని అభిమానులు ఆశిస్తున్నారు.
ఆసీస్ చేతిలో ఘోర ఓటమి...
కొన్నేళ్లుగా విదేశీ పిచ్లపైనా రాణిస్తున్న టీమ్ఇండియాకు 2020 ఆసీస్ పర్యటనలో భారీ షాక్ తగిలింది. అడిలైడ్ వేదికగా జరిగిన తొలి టెస్టులో (డై/నైట్) భారత్ రెండో ఇన్నింగ్స్లో 36 పరుగులకే ఆలౌటై ఘోర పరాభవం చవిచూసింది. గులాబీ బంతితో ఆసీస్ బౌలర్లు హేజిల్వుడ్(5), కమిన్స్(4) వికెట్లతో చెలరేగడంతో భారత్ చేతులెత్తేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ తొలి ఇన్నింగ్స్లో 244 పరుగులు చేయగా.. ఆసీస్ 191 పరుగులకే ఆలౌటైంది. దీంతో భారత్ 53 పరుగుల స్వల్ప ఆధిక్యం సాధించింది. అయితే, రెండో ఇన్నింగ్స్లో ఆతిథ్య జట్టు బౌలర్ల దెబ్బకు వికెట్లు టపటపా రాలాయి. కేవలం 36 పరుగులకే ఆలౌటై టెస్టు చరిత్రలో అత్యంత చెత్త రికార్డును టీమ్ఇండియా మూట గట్టుకుంది. అనంతరం 90 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్ రెండు వికెట్లను మాత్రమే నష్టపోయి ఛేదించింది. అయితే మిగిలిన టెస్టుల్లో రెండు గెలిచి, ఒకదానిని డ్రా చేసుకుని భారత్ సిరీస్ను కైవసం చేసుకోవడం విశేషం.
మరోసారి స్వదేశీ పిచ్పై..
భారత్ స్వదేశీ మైదానాల్లో చెలరేగిపోతుంది. మన బౌలర్లకు తగ్గట్టు పిచ్ రూపొందించుకొనే అవకాశం ఉండటంతో స్పిన్కు అనుకూలంగా అహ్మదాబాద్ పిచ్ను క్యూరేటర్ తయారు చేశాడు. తొలి ఇన్నింగ్స్లో అక్షర్ పటేల్ (6/38), అశ్విన్ (3/27) దెబ్బకు 112 పరుగులకే ఇంగ్లాండ్ కుప్పకూలింది. అయితే ఇంగ్లాండ్ పార్ట్టైమ్ బౌలర్ జో రూట్ (5/8), జాక్ లీచ్ (4/54), ఆర్చర్ (1/24) చెలరేగడంతో భారత్ 145 పరుగులే చేయగలిగింది. 33 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్ను ప్రారంభించిన ఇంగ్లాండ్ను మరోసారి అక్షర్ పటేల్ (5/32), అశ్విన్ (4/48), వాషింగ్టన్ సుందర్ (1/1) చెలరేగడంతో 81 పరుగులకే ఆలౌటైంది. 49 పరుగుల లక్ష్యాన్ని భారత్ వికెట్లేమీ కోల్పోకుండా ఛేదించింది. ప్రత్యర్థికి చెందిన రెండు ఇన్నింగ్స్ల్లో కలిపి 19 వికెట్లను స్పిన్నర్లే కూల్చారు.
ఈసారి చిన్నస్వామి స్టేడియంలో..
భారత్Xశ్రీలంక జట్ల మధ్య జరిగే డే/నైట్ టెస్టుకు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం ఆతిథ్యం ఇవ్వనుంది. రెండు టెస్టుల సిరీస్లో భాగంగా తొలి మ్యాచ్లో భారత్ ఇన్నింగ్స్ 222 పరుగుల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో గులాబీ బంతి టెస్టులోనూ గెలిచి క్లీన్స్వీప్ చేయాలని భారత్ భావిస్తోంది. మరోవైపు శ్రీలంక జట్టు టీమ్ఇండియా కంటే ముందే డే/నైట్ మ్యాచ్ ఆడటం విశేషం. 2017లోనే పాకిస్థాన్తో లంక గులాబీ టెస్టు ఆడింది. పాక్పై లంక 68 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇప్పటి వరకు లంక కూడానూ మూడే గులాబీ టెస్టులను ఆడింది. ఇరు జట్లకూ నాలుగోది కావడం.. సిరీస్ విజయంలో కీలక పాత్ర పోషించే అవకాశం ఉండటం సర్వత్రా ఆసక్తి నెలకొంది. స్పిన్నర్లకు అనుకూలంగా పిచ్ను రూపొందించే అవకాశం ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
భాగ్యనగర వాసులకు మళ్లీ ఐపీఎల్ సందడి వచ్చేసింది. గురువారం బెంగళూరుతో హైదరాబాద్ (Hyderabad Vs Bengaluru) తలపడనుంది. -
చెపాక్లో చూసుకుందాం.. లఖ్నవూపై చెన్నై ప్రతీకారం తీరేనా?
మళ్లీ మ్యాచ్ చెపాక్కు వచ్చేసింది. లఖ్నవూతో తలపడేందుకు చెన్నై సిద్ధమవుతోంది. ఇరు జట్ల మధ్య జరిగిన గత మ్యాచ్లో కేఎల్ రాహుల్ నాయకత్వంలోని లఖ్నవూ విజయం సాధించింది. -
వరుస ఓటములతో డీలా.. బెంగళూరుకు ఇంకా ప్లేఆఫ్స్ అవకాశాలు ఉన్నాయా..?
ఈ సీజన్లో బెంగళూరు పేలవమైన ప్రదర్శనతో తీవ్రంగా నిరాశపరుస్తోంది. ఆడిన ఎనిమిదింట్లో ఏడు ఓడి.. ప్లేఆఫ్స్ అవకాశాలకు దాదాపు దూరమైంది . -
200+ స్కోరు... చాలడం లేదు బాసూ!
ఐపీఎల్ 17వ సీజన్లో మ్యాచ్లు చివరి బంతి వరకూ రసవత్తరంగా సాగుతున్నాయి. భారీ స్కోరు చేసినా గెలుస్తామనే నమ్మకం చివరి వరకూ జట్లకు రావడం లేదు. -
సగం IPL పూర్తి.. బాదుడు నుంచి ఫ్లైయింగ్ కిస్ వరకు... ఆసక్తికర విశేషాలివే!
సుదీర్ఘమైన ఐపీఎల్ టోర్నీలో సగం మ్యాచ్లు ముగిశాయి. అనూహ్యంగా కొన్ని జట్లు చెలరేగగా.. మరికొన్ని డీలా పడిపోయి పాయింట్ల పట్టికలో అడుగుకు చేరాయి. -
అంపైర్గా పని చేసి.. ఐపీఎల్లో అదరగొట్టి... నయా సంచలనం అశుతోష్ కథ ఇది!
ధనాధన్ షాట్లతో ముంబయి మీద విరుచుకుపడి ఓటమి భయం చూపించిన అశుతోష్ శర్మ గురించి ఆసక్తికర విషయాలు... -
వీరుడొచ్చాడు.. సన్రైజర్స్కు దొరికిన మరో వార్నర్
సన్రైజర్స్ హైదరాబాద్ అంటే ఒకప్పుడు డేవిడ్ వార్నర్ (David Warner) మెరుపులే గుర్తుకొచ్చేవి. వార్నర్ వెళ్లిపోయిన తర్వాత ఆ లోటు కనిపించింది. ఓపెనింగ్లో ఓ ఖాళీ. రెండు సీజన్ల పాటు ఆ వెలితి అలాగే ఉంది. కానీ ఇప్పుడొక వీరుడొచ్చాడు. అతనే.. ట్రావిస్ హెడ్ (Travis Head). -
పరుగులివ్వడు.. వికెట్లు వదలడు... బెంబేలెత్తిస్తున్న బుమ్రా
ఐపీఎల్లో అదరగొడుతున్న బౌలర్ల జాబితా రాస్తే తొలి స్థానంలో కనిపించే పేరు జస్ప్రీత్ బుమ్రా. అతని బౌలింగ్లో ఆడటానికి బ్యాటర్లు బాగా ఇబ్బందిపడుతున్నారు. -
వీళ్లు ఆడితే మామూలుగా ఉండదు!
ఐపీఎల్.. ఈ టోర్నీ పేరు చెప్పగానే వెస్టిండీస్ ఆటగాళ్లే గుర్తొస్తారు. గత 16 ఏళ్లుగా కరీబియన్ ఆటగాళ్ల విన్యాసాలే అభిమానుల మనసుల్లో మెదులుతాయి. ఎందుకంటే తమ ఆటతోనే కాదు తమ హవభావాలతో మైదానంలో, మైదానం బయట ఈ విండీస్ వీరుల సందడి అంతాఇంతా కాదు. -
‘ఒక్క ఛాన్స్.. ఒకే ఒక్క ఛాన్స్’.. సత్తా చాటేందుకు విదేశీ సంచలనాల తహతహ
ఐపీఎల్లో తమ సత్తా నిరూపించుకోవడానికి ఆటగాళ్లు ఎదురు చూస్తుంటారు. ఫామ్ను అందుకోవడంతోపాటు ఫ్రాంచైజీ దృష్టిలో పడాలనేది కొందరి ఆశ. -
నితీశ్ రెడ్డి.. భారత్ క్రికెట్కు మరో పేస్ ఆల్రౌండర్ లభించినట్లేనా?
హైదరాబాద్ తరఫున మరో ఆణిముత్యం వంటి ఆటగాడు వెలుగులోకి వచ్చాడు. అదీనూ తెలుగు కుర్రాడు కావడం ఇక్కడ విశేషం. జట్టును గెలిపించే ప్రదర్శన చేయడం అభిమానులను ఆకట్టుకుంది. -
ఫామ్తో తంటాలా.. ఆర్సీబీ ఉందిగా!
ఈ ఐపీఎల్ సీజన్లో బెంగళూరుపై ఫామ్లో లేని ఆటగాళ్లు కూడా చెలరేగుతున్నారు. అంతేకాదు వారే మ్యాచ్ విన్నర్లుగా అవతరిస్తున్నారు. -
అప్పుడు వేస్ట్.. ఇప్పుడు బెస్ట్... ‘విఫల’ ముద్ర తొలగించుకున్న బ్యాటర్లు
ఐపీఎల్లో ఇప్పటివరకు సరిగ్గా ఆడని కొంతమంది ప్లేయర్లు ఈ సీజన్ ఐపీఎల్లో అదరగొట్టేస్తున్నారు. వాళ్లెవరు, వాళ్ల సంగతేంటో చూద్దాం! -
యశ్ ఠాకూర్.. ధోనీలా మారదామని వచ్చి.. పేసర్గా అదరగొట్టి!
లఖ్నవూ పేస్ బౌలర్లు పెను సంచలనంగా మారారు. ఇదివరకు మయాంక్ యాదవ్ తన ఫాస్ట్తో బెంబేలెత్తించగా.. తాజాగా యశ్ ఠాకూర్ అదరగొట్టాడు. -
వద్దనుకున్నవాడే వరమయ్యాడు.. ఎవరీ శశాంక్ సింగ్..?
తన అద్భుత బ్యాటింగ్తో గుజరాత్పై పంజాబ్కు విజయం అందించిన శశాంక్ సింగ్పై ఇప్పుడు అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు. -
ఓరి‘నరైనో’.. బ్యాటుతో రెచ్చిపోతున్న విండీస్ స్పిన్నర్
ప్రత్యర్థి సొంత మైదానాల్లో దూకుడుగా ఆడుతూ పరుగులు రాబట్టడం అతడి ప్రత్యేకత. గత సీజన్లో పెద్దగా ప్రభావం చూపని ఈ కోల్కతా ఆటగాడు మళ్లీ బ్యాట్తో అదరగొట్టేస్తున్నాడు. -
వింటేజ్ ధోనీ... కీపింగ్ మెరుపులు ఓవైపు... భారీ సిక్సర్లు మరోవైపు!
తొలి రెండు మ్యాచుల్లో బ్యాటింగ్కి రాని ధోనీ... మూడో మ్యాచులో బరిలోకి దిగి భారీ సిక్సర్లు బాదాడు. దీంతో ఇప్పుడు అంతా అతని మేనియానే కనిపిస్తోంది. -
పంత్.. ఇదే కావాలయ్యా...రిషబ్ ఇక రెచ్చిపో!
రిషభ్ పంత్ జట్టులో ఉంటే అదో ధైర్యం. మనది కాదనుకున్న మ్యాచ్ను అమాంతం మనవైపు తిప్పేస్తుంటాడు. యాక్సిడెంట్ తర్వాత రీఎంట్రీలో చెన్నై మీద అదరగొట్టాడు. -
రేటెక్కువ.. ఆట తక్కువ... ఐపీఎల్లో ఎప్పుడూ ఇదే కథ!
భారీ ధరపెట్టి జట్టులోకి తీసుకున్న స్టార్ ప్లేయర్లు ఐపీఎల్లో నిరాశపరుస్తుంటారు. ఈ ఏడాది కూడా అదే పరిస్థితి కనిపిస్తోంది. -
కొత్త పేస్ స్టార్.. గాయాలు ఇబ్బంది పెట్టినా బెదరని మయాంక్ యాదవ్
ఐపీఎల్ ప్లాట్ఫామ్ ద్వారా మరో ఆణిముత్యం వెలుగులోకి వచ్చింది. కొత్త స్టార్ పేసర్పై భారత సెలక్టర్లు దృష్టి పెట్టే అవకాశం లేకపోలేదు.. -
సిరాజ్ మియా.. ఎక్కడ బౌలింగ్ మాయ..? తేలిపోతున్న బెంగళూరు పేస్ ఎటాక్!
భారత స్టార్ పేసర్గా మారిన సిరాజ్ (Siraj) తన మాయాజాలాన్ని ప్రదర్శించలేకపోతున్నాడు. ప్రత్యర్థి బ్యాటర్లు అతడి బౌలింగ్ను తేలిగ్గా ఆడేస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
హైదరాబాద్, బెంగళూరు మ్యాచ్.. మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
-
రూ.8500కే మూడు రోజుల శిర్డీ టూర్.. ఐఆర్సీటీసీ ప్యాకేజీ వివరాలు ఇవీ..
-
కెమెరామెన్కు సారీ చెప్పిన పంత్.. ఎందుకో తెలుసా?
-
చెప్పలేని విధంగా వ్యక్తిత్వ హననం.. నీకిది తగునా జగన్?: సీఎంకు వివేకా సతీమణి లేఖ
-
ఆ ఒక్క సాంగ్ చేయలేకపోతే ఇండస్ట్రీని వదిలేద్దామనుకొన్నా: సోనాలి బింద్రే
-
దేశాల మధ్య డీప్ఫేక్ చిచ్చు.. ఫిలిప్పీన్స్-చైనాలో కలకలం సృష్టించిన వీడియో