Team India: టెస్టు ఛాంపియన్షిప్ పాయింట్లపట్టికలో టీమ్ఇండియా ఎక్కడ?
దక్షిణాఫ్రికాలో పర్యటిస్తున్న టీమ్ఇండియా ప్రస్తుతం ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ టేబుల్ పట్టికలో నాలుగో స్థానంలో నిలిచింది. ఈ పర్యటనలో భారత్ తొలి టెస్టులో సఫారీలను ఓడించినా స్లో ఓవర్ రేట్ కారణంగా...
కేప్టౌన్: దక్షిణాఫ్రికాలో పర్యటిస్తున్న టీమ్ఇండియా ప్రస్తుతం ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో నిలిచింది. ఈ పర్యటనలో భారత్ తొలి టెస్టులో సఫారీలను ఓడించినా స్లో ఓవర్ రేట్ కారణంగా ఒక పాయింట్ కోల్పోయింది. అలాగే రెండో టెస్టులో విజయం సాధించిన దక్షిణాఫ్రికా ఇప్పుడు ఐదో స్థానంలో నిలిచింది. ఈ క్రమంలోనే కోహ్లీసేన నాలుగో స్థానంతో సరిపెట్టుకుంది. తొలి మూడు స్థానాల్లో ఆస్ట్రేలియా, శ్రీలంక, పాకిస్థాన్ జట్లు ఉన్నాయి. అయితే, విజయాల శాతం పరంగా చూస్తే భారత్ అత్యధికంగా నాలుగు మ్యాచ్లు గెలిచి రెండు ఓటముల పాలైంది. దీంతో 55.21 విజయశాతంతో నాలుగో స్థానానికి పరిమితమైంది. ఇక ఆసీస్ ఆడిన మూడు మ్యాచ్ల్లో గెలవగా.. శ్రీలంక ఆడిన రెండిటిలోనూ విజయం సాధించింది. అలా ఈ రెండు తొలి రెండు స్థానాల్లో నిలిచాయి. మరోవైపు పాక్ మూడు మ్యాచ్లు గెలిచి ఒకటి ఓటమిపాలై మూడో స్థానంలో కొనసాగుతోంది.
కేప్లో ఘన స్వాగతం..
ఇక టీమ్ఇండియా జట్టుకు శనివారం కేప్టౌన్లో ఘన స్వాగతం లభించింది. ఇటీవలే జోహానెస్బర్గ్లో జరిగిన రెండో టెస్టులో ఓటమిపాలైన భారత జట్టు మూడో టెస్టు కోసం శనివారం కేప్టౌన్కు చేరుకుంది. ఈ సందర్భంగా భారత ఆటగాళ్లకు అక్కడి హోటల్ సిబ్బంది స్వాగతం పలికారు. అందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ ట్విటర్లో అభిమానులతో పంచుకుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
MS Dhoni: ధోని.. ఇంకా నాటౌటే
చివరి సీజన్గా భావిస్తున్న ఈ ఐపీఎల్లో బ్యాటింగ్ చేస్తోంది తక్కువసేపే అయినా అభిమానులను ఉర్రూతలూగిస్తున్నాడు ధోని. -
కేఎల్ రాహుల్ కెప్టెన్ ఇన్నింగ్స్.. చెన్నైకి చెక్
ఏక్నా స్టేడియంలోని నెమ్మదైన పిచ్పై స్కోరు 160 దాటిందంటే ఛేదన కష్టమే. ఓ దశలో చెన్నై 150 అయినా చేస్తుందా అనుకుంటే.. గత మ్యాచ్లో ముంబయిపై చెలరేగినట్లే మహేంద్రసింగ్ ధోని ఈ మ్యాచ్లోనూ ఆఖర్లో మెరుపు ఇన్నింగ్స్ ఆడడంతో చెన్నై స్కోరు 176కు చేరుకుంది. -
కుర్రాళ్లు కుమ్మేస్తున్నారు
ఛేదనలో నాలుగైదు వికెట్లు పడ్డాయా? అయినా భయం లేదు తామున్నామంటూ సత్తాచాటుతున్నారు. -
బుమ్రా బౌలింగ్లో స్వీప్ షాట్.. నా కల!
అశుతోష్ శర్మ.. ఈ ఐపీఎల్లో గట్టిగా వినిపిస్తున్న కొత్త పేరు. -
రేసులో గుకేశ్ ఒక్కడే..
క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్లో భారత యువ కెరటం గుకేశ్ మళ్లీ ఆధిక్యంలోకి వచ్చాడు. -
మెరిసిన ఇషా, భవేష్
ఒలింపిక్స్ సెలెక్షన్ ట్రయల్స్లో అగ్రశ్రేణి షూటర్లు ఇషా సింగ్, భవేష్ షెకావత్ మెరిశారు. -
దీపకు నాలుగో స్థానం
దోహాలో జరిగిన జిమ్నాస్టిక్స్ ప్రపంచకప్ను భారత స్టార్ దీప కర్మాకర్ నాలుగో స్థానంతో ముగించింది. -
భారత రెజ్లర్లు విఫలం
ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో భారత పురుష రెజ్లర్లు విఫలమయ్యారు. -
విమానం ఆలస్యమై...
భారత ఉత్తమ రెజ్లర్లలో ఇద్దరైన దీపక్ పునియా (86 కేజీలు), సుజీత్ కలాకల్ (65 కేజీలు)కు నిరాశ తప్పలేదు. -
రాకెట్ వదిలేద్దాం అనుకున్నా
గత కొన్నేళ్లలో కెరీర్లో ఎంతో క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొన్నానని.. ఒకటికి రెండుసార్లు బ్యాడ్మింటన్కు వీడ్కోలు చెప్పాలని భావించానని భారత డబుల్స్ స్టార్ అశ్విని పొన్నప్ప తెలిపింది. -
చెరువుల సంరక్షణ కోసం ఆర్సీబీ
ఐపీఎల్ జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టింది.
తాజా వార్తలు (Latest News)
-
పిల్లలతో అశ్లీల వీడియోలు తీయడం ఆందోళనకరం, నేరం : సుప్రీంకోర్టు
-
వివేకా హత్యలో నాపై రెండు క్రిమినల్ కేసులు.. అఫిడవిట్లో పేర్కొన్న అవినాష్రెడ్డి
-
స్కూల్లో హెచ్ఎంకు ఫేషియల్ వీడియో తీసిన టీచరుపై దాడి
-
సైబర్ యుద్ధాలను ఎదుర్కొనేందుకు చైనా సైన్యంలో కొత్త విభాగం
-
MS Dhoni: ధోని.. ఇంకా నాటౌటే
-
వైకాపా పాలనలో చంద్రబాబుపై 22 కేసులు